Saturday 10 June 2017

నిత్య దీపారాధనతో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? / NITHYA DEEPARADHANA THO ELANTI PHALITHALU.KALUGUTHAYI?


భగవంతుడు జ్యోతి స్వరూపుడు.అందులో దీపం లక్ష్మీ స్వరూపం.ప్రతి ఇంట్లో పూజా మందిరంలోనూ , తులసి చెట్టు వద్ద ఉదయం , సంధ్యా సమయంలో దీపాలు వెలిగించాలి.ఇలా చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది.ఉదయమైతే దీపం వెలిగించాక ఆ దీపానికి పసుపు ,కుంకుమ ,గంధం ,పువ్వులు సమర్పించాలి.అదే విశేష పూజలు జరిగినప్పుడు నైవేద్యం కూడా సమర్పించాలి.దీపారాధన తరువాతనే పూజ ప్రారంభించాలి.నిత్య దీపారాధనతో సకల శుభఫలితాలు కలుగుతాయి.దీపాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశగా ఉంచి వెలిగించాలి.వత్తి కూడా తూర్పు లేదా ఉత్తరం వైపు చూడాలి.అశౌచం , సూతకం ఏర్పడ్డప్పుడు ఆయా పరిమిత దినాల వరకే దీపం వెలిగించవద్దు.ఆ తర్వాత దీపం వెలిగించవచ్చు.

Wednesday 7 June 2017

GANESHUDITHO JIVITHAM SUKHAMAYAM


MAHANEEYULE MARGADARSHAKULU.


SUNDARA MANDIRAM THIRUCHULI.


HINDU DHARMANIKI PATTABHISHEKAM


గోవు విశిష్టత ఏమిటి? / GOVU VISHISHTATHA YEMITI?


మాతా ఆదిత్యానాం దుహితా వసూనాం
ప్రాణ్:ప్రజానాం అమ్రుతస్య నాభి:
హిరణ్య వర్ణా మధుకళా ఘృతాచి
మహానుభర్గశ్చ రతిమర్త్యేషు

అనగా ద్వాదశాదిత్యులకు అనగా 12 మంది సూర్యులకు తల్లి.అష్ట వసువులకు / దేవతలకు బిడ్డ గోవు.ప్రజలకు ప్రాణం . అమృతమునకు పుట్టినిల్లు.బంగారు రంగు కలది , పాలను వర్షిస్తూ , నేతిని నింపుతూ పరిపూర్ణమైన గోవు మన లోకంలో సంచరిస్తున్నది అని అర్థం.దుష్టులను సమ్హరించేది, సజ్జనులను కాపాడేది గోవు.ప్రాణులకు అన్నపానీయాలు అందించేది ,హితమును బోధించే గురువును ప్రసాదించేది , ధర్మ పాలకులను అందించేది, దేవతలందరికీ నిలయమైనది.మహేశ్వరునికి వాహనమైనది గోవు. " గో " అనే శబ్దం " ఓం " అనే పవిత్ర శబ్దానికి సమానం.

గురువు ప్రేమ / GURUVU PREMA

జెన్ గురువు సుజుకి రోషికి గొప్ప పేరుంది.ఆయన తన శిష్యులను చాలా ప్రేమగా చూసుకునే వారు.శిష్యులకు కూడా గురువంటే అమిత గౌరవాభిమానాలు ఉండేవి.శిష్యుల్లో ఒక అమ్మాయికి గురువు గారిపై ప్రేమ కలిగింది.ఆయన లేనిదే బ్రతుకు లేదనే భావనలో పడిపోయింది.ఒక రోజు ఆమె గురువు దగ్గరికి వచ్చింది.ఎలాగైనా తన ప్రేమను ఆయనకు చెప్పాలనుకుంది.ప్రేమతో కూడిన హావభావాలు వ్యక్తం చేస్తూ,ఏదొరకంగా గురువు గారి మనసులో చోటు సంపాదించాలని భావించింది.ఐతే అది ప్రేమో కాదో తెలియని అయోమయ స్థితిలో ఉందామె.తీరా గురువు గారు ఏమంటారో అనే ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడంలేదు.శిష్యురాలి ఇబ్బందిని గ్రహించిన సుజుకి ఆమె తలను ఆప్యాయంగా నిమిరి ' నీవు ఏమీ బాధ పడకు , మీ గురువు మీద ఉన్న ప్రేమనంతా, అభిమానాన్నంతా అలాగే మనసులో ఉంచుకోండి.అది మంచిదే.ఐతే మన ఇద్దరికీ సంబంధించి , అంటే గురు శిష్యులకు సంబంధించినంతవరకు కావలసినంత క్రమశిక్షణ నేను కలిగి ఉన్నాను.నా శిష్యురాలిగా నీలోనూ ఆ గుణం ఉందని విశ్వసిస్తున్నాను, అని సున్నితంగా ఆమె ప్రేమను తిరస్కరించాడు.ఆ మాటలు వినగానే ఆమెకు గురువు గొప్పదనం తెలిసివచ్చింది.ఆయన గురువుగా లభించడం తన అదృష్తంగా భావించింది.

VIMUKTHI MUKTHI


ANUMANAM AVAGINJANTHAINA PRAMADHAME


GOVU YELA VUDHBHAVINCHINDHI?


SKANDHUDU IKKADIKI RAMADA?


VIDYUKTHA KARMACHARANA VALLANE SAMPOORNATHVAM.


Thursday 1 June 2017

ఎదిగిన కొద్దీ ఒదగాలి / శ్రీకృష్ణుడి పాదసేవ / YEDHIGINA KODDEE ODHAGALI SREEKRUSHNUDI PADASEVA

పాండవాగ్రజుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయ తలపెట్టాడు.యాగానికి 15 రోజుల ముందు సోదరులను ,కౌరవులను,కృష్ణ భగవానుణ్ణి ,ఇతర సామంతులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు.యాగానికి అందరూ సహకరించాల్సిందిగా కోరాడు.సభకు హాజరైన వారంతా ధర్మరాజు ఏం చెబితే అది చేస్తామన్నారు.భీముడికి భోజనాల విభాగం,కర్ణుడికి దాన ధర్మాలు,దుర్యోధనుడికి ఆదాయ వ్యయ విషయాలు ఇలా ఒక్కొకరికి ఒక్కో బాధ్యతను అప్పగించాడు.అప్పుడు శ్రీకృష్ణుదు లేచి అందరికీ పనులు అప్పగిస్తున్నావు మరి నా మాటేమిటి అని అడిగాడు.అపుడు ధర్మరాజు " పరమాత్మా మీరు యాగంలో ఉంటే చాలు మాకు కొండంత అండ మీ సాన్నిధ్యబలంతో యాగం నిర్విఘ్నంగా కొనసాగుతుంది అని బదులిచ్చాడు.ఐనా శ్రీకృష్ణుదు అందుకు ఒప్పుకోలేదు.తనకేదైన పని అప్పగింఛాల్సిందేనని పట్టుబట్టాడు.దైవంగా కొలిచే కృష్ణ పరమాత్మకు ఏ పని అప్పగించాలో తెలియక తికమక పడ్డాడు ధర్మరాజు.అతడి ఇబ్బందిని గ్రహించిన కృష్ణుడు " ధర్మరాజా యాగనికి వచ్చే మునులు ,రుషుల పాదాలు కడిగే బాధ్యత నాదని చెప్పాడు.అది విని ధర్మరాజు విస్తుపోయాడు.అన్నట్లుగానే తపస్సంపన్నుల పాదసేవ చేశాడు కృష్ణుడు.రాజసూయ యాగం పూర్తైన పిదప అగ్రపూజ అందుకున్నాడు.ఎంతవాడైనా ఒదిగి ఉండాలని లోకానికి చాటిచెప్పాడు శ్రీకృష్ణుడు ఈ సంఘటనతో.

Sunday 28 May 2017

BHADRADRI RAMAIAH DARSHANANIKI DRESS CODE


GUINNESS BOOK RECORDS - SUNDARA CHAITANYANANDA ASHRAMAM


నీవు జయిస్తావు. / NEEVU JAYISTHAVU


మనందరిలోనూ అంతుచిక్కని గొప్ప విలువలు గోప్యంగా ఉన్నాయి.మన వల్ల చేతనవుతుంది, మనవల్ల చేతనవదు అన్నది మనకు సంబంధించిందిగానే ఉంటుంది.కాని 'నేను చేస్తాను 'అన్న మనోవైఖరి ఉండాలి.

ఏదైనా కౄరమృగాన్ని అదుపులో పెట్టాలంటే ఆరంభంలో చాలా కష్టంగా ఉంటుంది.కాని పోను పోను దానిపైన స్వారీ చేసినా అది ఏమీ చెయ్యనంత సమర్ధతతో దాని శిక్షకుడు దానిని వశం చేసుకుంటాడు.మనం సర్కస్ లో సాధారణంగా ఇలాంటివి చూస్తుంటాము.అదే విధంగా మనం కౄరంగా ఉన్న మనస్సును మన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.

జీవితం ఒక శారీరకమైన రాకపోకలతోనే పరిమితమైంది కాదు.అది చాలా విశాలమైనది.

వేదాంతపరంగా చెప్పే కాలనిర్ణయం వేరుగా ఉంటుంది.ఒక బండరాయిపైన ,ఇంటికప్పుపైనుంచి రోజూ ఒక్కొక్క బొట్టుగా నీరు పడుతుంటే కొంత కాలానికి రాయి అరిగిపోవడం చూస్తం.

ఒక భక్తుడు రోజూ సాష్టాంగ ప్రణామం చేసి,తన నుదురును నేలపైన ఆనిస్తుంటే కొన్ని సంవత్సరాలకు సొట్టపడటం చూసాను.దానివల్ల అభ్యాసానికి ఎంత విలువుందో తెలుస్తుంది.

మృదువైన నీటి బిందువు రాయిలో మార్పు తీసుకురాగలిగినప్పుడు ,చంచలంగా ఉన్న మనస్సుకు శిక్షణనిచ్చి నిశ్చలంగా చేసినట్లైతే సత్యంలోనికి అది తప్పకుండా చొచ్చుకుపోగలుగుతుంది.

గొప్ప గురువులు అనబడే వారందరిచేతా ' ఓర్పుగా ఉండి,మెలకువగా ఉండి,కష్టపడు,నీవు జయించుతావు ' అని చెప్పబడింది.

ఓటమికి ఆధ్యాత్మిక జీవితంలో స్థానమే లేదు.ఎన్నిసార్లు ఓటమి కలిగినా చివరికి జయిస్తావు.

                              ---- స్వామి రంగనాథానందజీ .

Sunday 14 May 2017

గణపతి ముందు గుంజిళ్లు ఎందుకు తీస్తారు? / GANAPATHI MUNDU GUNJILLU. ENDUKU THEESTHAARU.



ఒకనాడు శ్రీ మహా విష్ణువు శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్లాడు.విష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని వినాయకుడు చూశాడు.అది తళ తళ మెరుస్తూ ఉండడంతో అది ఎంతో నచ్చింది.వెంటనే ఆకతాయితనంతో దానిని తన తొండంతో తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు.ఇవ్వమని ఎంత బతిమాలినా ససేమిరా అన్నాడు.ఎంతమంది ఎంతలా అడిగినా మన బాల గణపతి వినలేదు.దీనితో విష్ణువు ఉపాయంతో గణపతిని నవ్వించాలని అనుకున్నాడు.అందుకోసం ఆయన గుంజిళ్లు తీశాడు.దాంతో బాల వినాయకుడు చేతిలో చక్రం వదిలేసి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ మురిసిపోయాడు.గణపతికి గుంజిళ్లు తీస్తే ఇష్టమని ఈ కథ చెబుతారు.అందుకే భక్తులు గణపతి దర్శనానికి వెళ్ళినప్పుడు గుంజిళ్ళు తీయడం ఆనవాయితీ అయింది.

Friday 12 May 2017

VIDYA YE NIJAMAINA ABHARANAM.


KOPANNI JAYINCHI CHUDU


BHAKTHI YOGAM.


PADIMANDIKI SAHAYAPADALANNADE MAHANEEYULA BODHA.


BHAKTHULU KORINANDUNE RAMANAVATHARAM.


ఆలయానికి వెళ్లినప్పుడు పాటించాల్సిన నియమాలు / ALAYANIKI VELLINAPUDU PATINCHALSINA NIYAMALU.


అలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజ స్థంభానికి నమస్కారం చేసి ,వీలును,ఆలయ వైశాల్యాన్ని బట్టి 3,5,7,9,11 లేదా గరిష్టంగా 40 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి.ఒకసారి ప్రదక్షిణ పనికి రాదు.వైష్ణవాలయం ఐతే గరుత్మంతుడికి ,శివాలయం ఐతే నందికేశ్వరుడికి నమస్కరించాలి.తర్వాత ద్వారపాలకులకు దండం పెట్టుకోవాలి.అటు పిమ్మట భగవంతుని భక్తులైన అనగా వైష్ణవాలయం ఐతే ఆళ్వారులకు,శివాలయంలో అయితే నాయనారులకు నమస్కరించాలి.తరువాత అమ్మవారికి,స్వామివారికి నమస్కారం చేయాలి.భగవంతుడిని మనసారా ధ్యానించాలి.

నిద్ర లేవగానే భూమికి ఎందుకు వందనం చేయాలి? / LEVAGANE BHOOMIKI VANDANAM YENDUKU CHEYALI?


ఉదయం నిద్ర లేవగానే చేతిని నేలకు తాకించి వందనం చేయాలి.ఎందుకంటే నిద్ర పోతున్నవారి శరీరంలో పొటెన్షియల్ ఎనర్జీ ప్రవహిస్తుంటుంది.అది కాస్తా మనం నిద్ర మేల్కొని లేచి నిలబడినపుడు కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది.నిద్రపోతున్నప్పటి ఎనర్జీ స్వచ్చమైనది  కాదు.కావున లేవగానే మనం మొదలు చేతితో భూమిని కాసేపు తాకడం వల్ల శరీరంలో ఉన్న అశుద్ధ శక్తి చేతి ద్వారా బయటకు పోయి స్వచ్చమైన శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది.అందుకే మన పూర్వీకులు నిద్రలేవగానే మొదట చేతిని భూమికి ఆనించి ఉంచాలని ఆ తరువాతే పాదాలను భూమికి తాకించాలని చెప్పడం జరిగింది.మన దిన చర్యలో భాగంగా ఈ నియమాన్ని పాటించినట్లైతే మనలో అనుకూలమైన శక్తి చేరుతుంది.

Thursday 11 May 2017

JNANAM SHEELAM DHYANAM


BRAHMANANDA PRADATHA MAHALAKSHMI.


SPASHTATHA KORINA ARJUNUDU.


పూజలో కొబ్బరికాయ పండితే మంచిదా కాదా ?/ POOJA LO KOBBARIKAYA PANDITHE MANCHIDA KADA?


కొబ్బరి కాయ కుళ్ళింది, పాడైంది అనడం కంటే పండింది అనడం సమంజసం.ఎందుకంటే కాయ పండుతుంది, పండు కుళ్ళుతుంది.దేవుడికి కొట్టిన కొబ్బరి కాయ పండితే మన కోరిక పండిందని , దేవుడు వరమిచ్చాడని అర్థం.కొబ్బరి కాయ పండిందని మరో కాయ తెచ్చి కొట్టదం అంటే దేవుడిచ్చిన వరాన్ని కాదన్నట్లే.

SADVASTHUVE SATHYAM


BHAKTHI SANGITHA BHAVA JHARI ANNAMACHARYUDU.


BAGUNDALANTE BOUDDHA GURUVULA VUNDALI.


BHAKTHE HRUDAYAM.


దేవాలయాల్లో గంటలు ఎందుకు కొడతారు? / DEVALAYALLO GANTALU YENDUKU KODATHARU?



ప్రతి ఆలయంలో గంటలు ఉంటాయి.ఈ గంటలు కొట్టడం వల్ల అసలు ఉపయోగం , అర్థం ఏమిటి అని అలోచిస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.అవి ఏమిటంటే గంటలు కొట్టదం వల్ల మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి.గంటను 7 సార్లు కొడితే మన శరీరంలో ఉన్న 7 చక్రాలు ఉత్తేజం చెందుతాయి.అంతే కాకుండా మెదడు కుడి,ఎడమ భాగాలు రెండు కొంతసేపు ఏకమౌతాయి.దీనివల్ల మన మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది.అలాగే ఏకాగ్రత సైతం పెరుగుతుంది.గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నిర్మూలించబడతాయి.

Monday 8 May 2017

ఆలయాల్లో కొబ్బరి కాయ ఎందుకు కొట్టాలి? / ALAYALLO KOBBARIKAYA YENDUKU KOTTALI?


దేవాలయాలకు వెళ్లిన ప్రతీ భక్తుడు దేవాలయంలో ప్రత్యేకంగా కొబ్బరి కాయను కొడతారు.కొబ్బరి కాయ కొట్టినట్లైతే మోక్షం లభిస్తుంది అని భక్తులు భావిస్తారు.అందుకోసం దేవాలయాలకు వెల్లిన భక్తులు ఖచ్చితంగా దేవాలయంలోని గర్భ గుడిలో లేదా బయట కొబ్బరి కాయను కొట్టి మొక్కు తీర్చుకుంటారు.ఆలయంలో కొబ్బరి కాయ కొట్టినట్లైతే భగవంతుడి కృప ఉంటుందని భావించి ప్రతీ భక్తుడు దేవాలయాల్లో కొబ్బరి కాయలు కొడతారు.కొట్టిన కొబ్బరి కాయను దేవాలయంలోనే తీర్థ ప్రసాదంగా స్వీకరిస్తారు.

JANMA SAAPHALYAM