Friday 27 July 2018

మన శ్శాంతిని ,మనో జయాన్ని కోరువారు జపించవలసిన నర నారాయణ మంత్రం

మన శ్శాంతిని ,మనో జయాన్ని కోరువారు జపించవలసిన నర నారాయణ మంత్రం.

ఓం నమో భగవతే ఉపశమశీలాయ
ఉపరత అనాత్మ్యాయా నమో అకించిన విత్తాయ
రుషి రుషభాయ నరనారాయణాయ
పరమహంస పరమ గురవే
ఆత్మ రామాధిపతయే నమో నమ ఇతి

ఈ మంత్రం జపించుట వలన మనశ్శాంతి, మనో నిగ్రహం,మనో జయం కలగడమే కాక, భక్తి శ్రద్ధలతో జపించటం వలన కోపాన్ని ,కోరికలను గెలవవచ్చు.అంతే కాక విద్యా బుద్ధులు ,సత్ప్రవర్తన అలవడుతాయి.లోక కళ్యాణ కాంక్ష కలిగిన వారు ముఖ్యంగా ఈ మంత్రాన్ని జపించాలి.
మంత్రమూలం - శ్రీమద్భాగవతం లోని పంచమ స్కంధం

మంత్ర జప విధానం - ప్రాత:కాలమునే లేచి స్నానాదులు ముగించుకుని పరిషుద్ధమైన వస్త్రాలు ధరించి లలాటమున తిలకం దిద్దుకుని పూజా మందిరంలో దీపారాధన చేసి తమ నిత్య కృత్యములైన సంధ్యా వందనాది కార్యక్రమాలను ముగించుకుని నిశ్చలమైన పరిశుద్ధమైన మనస్సుతో తమ తమ శక్తి కి అనుగుణంగా మంత్రాన్ని జపించాలి.

No comments:

Post a Comment