భగవంతుడు జ్యోతి స్వరూపుడు.అందులో దీపం లక్ష్మీ స్వరూపం.ప్రతి ఇంట్లో పూజా మందిరంలోనూ , తులసి చెట్టు వద్ద ఉదయం , సంధ్యా సమయంలో దీపాలు వెలిగించాలి.ఇలా చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది.ఉదయమైతే దీపం వెలిగించాక ఆ దీపానికి పసుపు ,కుంకుమ ,గంధం ,పువ్వులు సమర్పించాలి.అదే విశేష పూజలు జరిగినప్పుడు నైవేద్యం కూడా సమర్పించాలి.దీపారాధన తరువాతనే పూజ ప్రారంభించాలి.నిత్య దీపారాధనతో సకల శుభఫలితాలు కలుగుతాయి.దీపాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశగా ఉంచి వెలిగించాలి.వత్తి కూడా తూర్పు లేదా ఉత్తరం వైపు చూడాలి.అశౌచం , సూతకం ఏర్పడ్డప్పుడు ఆయా పరిమిత దినాల వరకే దీపం వెలిగించవద్దు.ఆ తర్వాత దీపం వెలిగించవచ్చు.
No comments:
Post a Comment