Tuesday 30 January 2024

కొండ గట్టు అంజన్న ఆదాయం రెండింతలు

 కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది ఆలయ ప్రాంగణంలోని షాపులకు అధికారులు సోమవారం వేలంపాట నిర్వహించగా నిర్వాహకులు పోటీపడ్డారు ప్రధానంగా కొబ్బరికాయల విక్రయం కొబ్బరి చిప్పల సేకరణ టెండర్లకు తీవ్ర పోటీ నెలకొంది గత ఏడాది వేలంపాట ద్వారా రూపాయలు రెండు కోట్ల 64 లక్షల ఆదాయం రాగా ఈసారి మూడు కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది టెండర్ను 45 లక్షలకు దక్కించుకోగా ఈసారి 80 లక్షలకు దక్కించుకున్నారు 94 లక్షలు గా ఉన్న కొబ్బరికాయల షాపు టెండర్ ఈసారి ఒక కోటి 37 లక్షలకు చేరింది వీటితోపాటు కిరాణా పూలు పండ్లు కూల్డ్రింక్స్ హోటళ్లను గతంలో కంటే రెండింతలు పెట్టి దక్కించుకున్నారు వేలంపాటలో అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఈవో వెంకటేష్ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు.




No comments:

Post a Comment