Monday 26 February 2024

ఈ నెల 27 న మహా కుంభాభిషేకం

 నిజామాబాద్ నగరంలో నీ కన్యకా పరమేశ్వరి ఆలయం లో మొట్ట మొదటి సారిగా మహా కుంభాభిశేకం కార్య క్రమం ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్య క్రమానికి శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వారి మంగళ శాసనముల తో మహా కుంభా భిషేకం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ పురోహితులు వెలేటి గౌరీ శంకర్ శర్మ తెలిపారు . ఈ మహా కుంభాభిశేక మహోత్సవం ఈ నెల 27 వ తేదీ మంగళ వారం నుండి 29 వ తేదీ గురు వారం వరకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం, కిషన్ గంజ్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాత ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ ఆర్య వైశ్య సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment