Thursday 29 February 2024

శివ మల్లన్న స్వామి ఆలయ నూతన ఉత్సవ కమిటీ బాధ్యత స్వీకరణ

 కాగజ్నగర్ మండలంలోని ఇస్గాం సమీపంలో శ్రీ శివ మల్లన్న స్వామి ఆలయ ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా తెలిపారు ఈ కమిటీలో చైర్మన్గా మైలారం మురళీధర్ను ఎన్నుకోవడం జరిగిందని కమిటీ సభ్యులుగా ఎమ్మాజీ శారద హరిప్రసాద్ సోనీ శృంగవరపు ప్రసాద్ జరుపుల తిరుపతి రాంఠంకి సత్తయ్యలను ఎన్నుకోవడం జరిగింది అని తెలిపారు గురువారం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులని నియామక పత్రాలను కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మైలారపు మురళీధర్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా శివ మల్లన్న స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయుటకు కమిటీ సభ్యులతో కలిసి సాయి శక్తుల కృషి చేస్తానని అన్నారు ఆలయ ఆవరణలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని త్వరలోనే వచ్చే మహాశివరాత్రి జాతరకు ముందే మరొక దొడ్ల నిర్మిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ కొమరం భీం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుల్భం చక్రపాణి రావి మురళీకృష్ణ కోటయ్య రవి కాగజ్నగర్ పురపాలక కౌన్సిలర్ రాజేందర్ శ్రీనివాస్ ఐహిత శ్రీనివాస్ కొల్లూరు సతీష్ అనంతుల సురేష్ మైలారపు శ్రీధర్ కొలిపాక చంద్రశేఖర్ సందీప్ శివ తోట వినోద్ కోడిపేక సంతోష్ వాసవి సేవా అధ్యక్షులు కంభంపాటి సంతోష్ తోడూరి సతీష్ రాచకొండ సురేష్ భోగ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment