Tuesday 27 February 2024

వైభవంగా వడ్యాల్ రేణుక ఎల్లమ్మ జాతర

లక్ష్మణ చాంద మండలంలోని వడియాల్లో కొలువుదీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మంగళవారం మంగళరంగ వైభవంగా జరిగింది ఉదయమే అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు అమ్మవారి కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే జాతర మహోత్సవ వేడుకలు జరగగా వడియాలు కనకాపూర్ గ్రామాలను ప్రజలే కాకుండా మామడా వివిధ మండలాల ప్రజలు సైతం హాజరై అమ్మవారిని దర్శించుకుని ముక్కలు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మామడా లక్ష్మణ చాంద్ర మండలాల గౌడ కుల సంఘాల నాయకులు ఏర్పాట్లు పర్యవేక్షించారు అలాగే నిర్మల్ డిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ నేత కూచాడి శ్రీహరి రావు హాజరై ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వారితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు


No comments:

Post a Comment