Monday 26 February 2024

తిరుమలలో ఇక నిత్య సంగీతార్చన

 తిరుమల కాలినడక భక్తులకు నిత్య సంకీర్తన అర్చన

టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయము

తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల కోసం నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు స్థానిక అన్నమయ్య భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు తీర్మానాలను ఈవో ధర్మారెడ్డి తో కలిసి చైర్మన్ వెల్లడించారు అలిపిరి తిరుమల కాలినడక మార్గంలోని గాలిగోపురము ఏడవ మైలు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము మోకాళ్ళ మెట్టు వద్ద కళాబృందాలతో నిరంతరం సంకీర్తన అర్చన తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్యసంకీర్తనర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపార

శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయల విగ్రహాలు ఉన్న గుడి తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు తాపడంతో కొత్తవి ఏర్పాటు

శ్రీవారి వివాహ కానుకగా నాలుగు కోట్ల రూపాయలతో మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు 7 డిజైన్లలో తయారు చేసేందుకు నాలుగు ప్రముఖ బంగారు ఆభరణాలు తయారీ సంస్థలకు అనుమతి

చిన్నారులలో ధార్మిక నైతిక విలువలు పెంచడంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు తమిళం కన్నడ హిందీ ఆంగ్ల భాషలలో 98 లక్షల కాపీల ముద్రణకు మూడు కోట్ల 72 లక్షల రూపాయలు మంజూరు


తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు పై టీటీడీ రేటు వేసింది టీటీడీ ప్రభుత్వము అహోబిలం మఠము అర్చకులు జీయర్లపై రమణ దీక్షితులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్న టిటిడి నుంచి ఆయనను తొలగిస్తూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు పెంచుతూ పలక మండలి నిర్ణయం తీసుకున్నది శ్రీవారి ఆలయంలోని జయ విజయ ల వద్ద ఉన్న తలుపులకు ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు కాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు గాలిగోపురము ఆంజనేయస్వామి విగ్రహము మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకనుంచి నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు 4 కోట్ల రూపాయలతో నాలుగు ఐదు పది గ్రాముల తాళిబొట్టుల తయారీకి పాలకమండలి నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది ప్రతిఏటా ఫిబ్రవరి 24వ తేదీన టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు

No comments:

Post a Comment