Wednesday, 7 February 2024

తెలంగాణ కుంభమేళాకు వెళ్లాయి

మేడారంలో గుడి మెలిగతో శ్రీకారం వచ్చే బుధవారం మండే మీదే మహా జాతర ఆరంభానికి ఇవే కీలక ఘట్టాలు సమ్మక్క సారలమ్మలకు పూజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు పూర్తికాని రహదారులు జాతర ఏర్పాట్లు ఉత్సవ కమిటీ ఏర్పాటు పైన ఇంకా జరుగుతున్న ప్రయత్నాలు



మేడారం సమ్మక్క సారలమ్మలకు పూజలతో తెలంగాణ కుంభమేళాకు అంకురార్పణ జరిగింది ప్రతి రెండేళ్లకోసారి మార్గ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధవారం రోజుని ఈ మహా ఉత్సవం మొదలవుతుంది దానికి సరిగ్గా 14 రోజుల ముందు గుడి మెలిగే పండుగ జరుగుతుంది బుధవారం మేడారంలోని సమ్మక్క కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో పూజారులు తల స్నానాలు ఆచరించి తల్లుల ఆలయాలను శుద్ధిచేసి గుడి మెలిగే పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు మేడారంలో సమ్మక్క పూజారి సిద్ధబోయిన మణిందర్ ఇంటి వద్ద పూజారులు కంకణాలు కట్టుకోగా ఆడపడుచులు పసుపు కుంకుమలు పూజారులు వడ్డెలు పవిత్ర జలం ధూపం యాటతో డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క గుడికి చేరారు ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క గుడి ఈశాన్యం మూలన ఎట్టిగడ్డి ఉంచగా ఆడపడుచులు సమ్మక్క శక్తి పీఠాన్ని పసుపు కుంకుమలతో అలంకరించారు అనంతరం సమ్మక్క గుడి గుమ్మం బయట ముగ్గులు వేసి అందంగా అలంకరించగా పూజారులు అమ్మవారికి ధూప దీపాలు వెలిగించి పూజలు నిర్వహించి ఆటను నైవేద్యంగా సమర్పించారు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఇతర పూజారులతో కలిసి గుడి మెలిగే పండగ పూజలు నిర్వహించారు ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం ఆడపడుచులు సరళమ్మ గుడి ముందు ముగ్గులు వేసి అలంకరించారు బుధవారం సమ్మక్కకు బోనం పెట్టడం అనవాయతీ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈనెల 14న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు వనదేవతలు సమ్మక్క సారలమ్మ మండ మెలిగే పండుగ జరుగుతుంది

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మరో 13 రోజులే మిగిలి ఉంది ఆదివాసీ సంప్రదాయ బద్దంగా నిర్వహించే మహా జాతర ఈనెల 21 నుంచి 24 వరకు జరగనుంది ప్రతిసారి కనీసం నాలుగు నెలల ముందు నుంచే జాతర నిర్వహణ ఏర్పాట్లు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు గతేడా అది జూలైలో పంపిన ప్రతిపాదనలను మించి మొత్తం 21 శాఖలకు రెండు విడతల్లో 105 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది దాదాపుగా రెండు నెలలుగా సాగుతున్న పనులు చాలావరకు పూర్తి కావాల్సి ఉంది మంత్రులు సీతక్కొండ సురేఖ పున్నం ప్రభాకర్లు అధికారులతో విడతల వారీగా ఇప్పటికే నాలుగైదు సమీక్షలు నిర్వహించారు రహదారుల నిర్మాణం మరుగుదొడ్లు నీటి ట్యాంకులు క్యూ లైన్లు స్నాన ఘట్టాలు కళ్యాణ కట్టలు చెక్ డ్యాములు హోల్డింగ్ పాయింట్లు సీసీ కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్ డంప్ యార్డులు తదితర నిర్మాణాలు ప్రతిపాదనలో పేర్కొన్న ప్రకారం సంపూర్ణంగా పూర్తి కావాల్సి ఉంది కొందరు భక్తులు జాతరకు ముందుగానే ముక్కులు చెల్లిస్తున్న క్రమంలో ఇప్పటికే మేడారం వెళ్లే వాహనాలతో రహదారి రద్దీగా ఉంటుంది వచ్చేనెల 21 నుంచి 24 వరకు జరగనున్న జాతరకు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాకు చెందిన భక్తులు 365 వ జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలాల్లో అసంపూర్తి పనులతో ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి ములుగు జిల్లా మల్లంపల్లి వరకు 1089 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి నుంచి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట వరకు 32 కిలోమీటర్ల దూరం విస్తరణ పనులు పూర్తి కావాల్సి ఉంది

మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాట్లు ఎప్పుడూ నిర్లక్ష్యమే కనిపిస్తుంది 2012 వరకు సజావుగానే సాగిన 2014 జాతర నుంచి ధర్మకర్తల మండలి ఏర్పాట్లు ప్రతిసారి జాబ్మే జరుగుతుంది. 2014లో కోర్టు వివాదాల వల్ల ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయలేదు దీంతో అధికారుల పర్యవేక్షణలోని జాతర నిర్వహించారు 2016లో పునరుద్ధరణ కమిటీని నియమించారు 2018 మహా జాతరకు కాక లింగయ్యను చైర్మన్గా ధర్మకర్తల మండలి ఏర్పాటు చేశారు 2020 2022 జాతరల పునరుద్ధరణ కమిటీతో నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ధర్మకర్తల మండలి ఏర్పాటు చేస్తారని ఆదివాసీలు భావిస్తున్నారు షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం ప్రకారం ఆదివాసీలను నియమించాలని కూడా కోరుతున్నారు అయితే జాతరకు మరో 13 రోజులు ఉండగా ఇంకా ఆ కమిటీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు దీంతో ఈసారి మహా జాతర ధర్మకర్తల కమిటీ వేసి నిర్వహిస్తారా లేక పునరుద్ధరణ కమిటీతో నడిపిస్తారా అన్న చర్చ జరుగుతుంది..

No comments:

Post a Comment