Tuesday 5 March 2024

శ్రీశైలం మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు

 స్థలం ఇస్తే 200 గదుల భవనం కడతాం అంటున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి గారు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున సమర్పించడం సంగతి తెలిసిందే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నాలుగో రోజైన సోమవారం మయూర వాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం మయూర వాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు శివ స్వాములతో శ్రీశైలం పోటెత్తింది భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం టిటిడి ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టిటిడి దేవస్థానం తరఫున 200 గదుల భవనం కడతామని ప్రకటించారు క్షేత్రంలో టీటీడీ సత్రం పాత పడడంతో వాటిని ఆధునికరిస్తామని చెప్పారు

No comments:

Post a Comment