Sunday 10 March 2024

అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణం

 భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామి ఆలయ ఉత్సవాలను యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉత్సవాలలో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముత్యాల పందిరిలో మల్లికార్జున స్వామి గొల్ల కేతమ్మ మేడాలమ్మ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు అంతకుముందుగా స్వామివారి ఉత్సవా విగ్రహాలను యాదవ సంఘం ప్రతినిధులు ఊరేగించారు అనంతరం పెద్ద ఎత్తున అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి తిప్పాపూర్ తో పాటు మండలంలోని అయా గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యాదవ సంఘం ఆధ్వర్యంలో జాగ్రత్తలు తీసుకున్నారు మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజలు నిర్వహించారు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఆయా గ్రామాలకు చెందిన భజన మండలిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భజన కార్యక్రమాన్ని నిర్వహించారు కాకా మండలంలోని కాచాపూర్ లో గల వీరేశ్వర స్వామి ఆలయంలో అన్న పూజ పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దోమకొండలో ఘనంగా చక్కెర తీర్థం మండల కేంద్రంలోని శివరాం మందిరాలయంలో శనివారం చక్కర తీర్థం జాతర ఘనంగా జరిగింది మండలంలోని ముత్యంపేట సంగమేశ్వర అంచనూర్ గొట్టిముక్కుల లింగంపల్లి సీతారాంపల్లి తో పాటు విక్నూరు మాచారెడ్డి విబిపేట మండలాలకు చెందిన భక్తులు శివరాం మందిరాలయంలో పూజ నిర్వహించి చక్కెర తీర్థంలో పాల్గొన్నారు. ఉదయం చక్కెర తీర్థం నా కబాలి అవబ్ద స్నానం పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు ఘనంగా దక్షయజ్ఞం సదాశివ నగర్ మండలంలోని శివాలయాల వద్ద ఉదయం పెద్ద ఎత్తున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు పూజారులు భక్తులు శివనామ స్మరణతో అగ్నిగుండాల ప్రవేశం చేశారు అనంతరం భగవంతుని సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడంతో భక్తులు ఉపవాస దీక్ష వరమించారు

No comments:

Post a Comment