వాన పడకపోతే దేవుణ్ణి నిందించడం ఎక్కడైనా విన్నామా? కర్ణాటక రాష్ట్రంలో విజయనగరం జిల్లా హోస పేటె గ్రామంలో ఇలాంటి ఆచారం ఉంది. పట్టణ శివారులోని కాటమయ్య ఆలయానికి సాధారణ రోజుల్లో భక్తులెవరూ వెళ్ళరు. సరైన సమయంలో వర్షాలు కురవక పోతేనే ఆ ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఈ ఏడాది ఇంకా వాన చుక్క లేకపోవడంతో స్థానికులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి , దేవుడిపై తిట్ల వర్షం కురిపిస్తూ ప్రదక్షిణలు చేశారు. ఇలా చేస్తే కాటమయ్య వర్షాలు కురిపిస్తాడని పూర్వం నుంచి విశ్వసిస్తున్నారు. ప్రదక్షిణ పూర్తయిన గంట తర్వాత పట్టణంలో ఒక మోస్తరు వర్షం పడడం విశేషం.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి