శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ

 శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను 22 మంది చిత్రకారులు వేయగా దీన్ని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పేరుతో తిరుపతికి చెందిన శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పుస్తకంగా రూపొందించింది ఈ పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గీసిన బొమ్మ కూడా ఈ పుస్తకంలో ఉండడం ఆ దేవదేవుడి కృపయా అన్నారు కాకా బ్రహ్మానందం ఆదివారం ఉదయం బిజెపి బ్రేకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు

19, మార్చి 2024, మంగళవారం

వన్నెల్ బీ లు వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ

 బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు సోమవారం ఉదయం ఉత్సవ మూర్తులు అభిషేకము నూతన వస్త్రాలంకరణ అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని గ్రామంలో ఊరేగించారు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కలను తీర్చుకున్నారు ఉత్సవాల సందర్భంగా ఆలయంలో హోమం దేవత ఆహ్వానం కలశపూజ వంటి పూజలు నిర్వహించారు మంగళవారం జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు

18, మార్చి 2024, సోమవారం

వన్నెల్ బి లో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

 బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం ఉత్సవ మూర్తులకు అభిషేకం మండలారాధన సుదర్శన యాగం పంచామృతాలతో అభిషేకం స్థాపితదేవతల భవనం చేపట్టారు ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలతో మొదటి రోజు ఉత్సవాలు నిర్వహించారు బ్రహ్మోత్సవాలలో భక్తులు గ్రామస్తులు పాల్గొని స్వామి వారికి పూజ నిర్వహించారు



17, మార్చి 2024, ఆదివారం

తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించరు

 ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టిటిడి వీఆర్వో విభాగం తెలిపింది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శనివారం నుంచి తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధి విధానాల మేరకు దర్శనం వసతి కల్పిస్తామని తెలిపింది

తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్ శనివారం దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు



15, మార్చి 2024, శుక్రవారం

జెండా బాలాజీ ఆలయ హుండీ లెక్కింపు

 నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం నందు ఉండే లెక్కింపు గురువారం ఆలయ కార్య నిర్వహణ అధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ లెక్కింపులో 54,710 నోట్ల రూపంలో నాణ్యాలు 5540 మొత్తం 60 వేల 250 వచ్చినవే అని ఆయన తెలిపారు ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ నిజామాబాద్ సహాయ కమిషనర్ నాయని సుప్రియ ఆధ్వర్యంలో జరిగిందని కార్యనిర్వాహణాధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జాలిగా గోపాల్ ధర్మకర్తలు వైరాముగౌడ్ పి నర్సింగరావు టి నాగభూషణం ఏ సంతోష్ వి నాగరాజు ఆలయ అర్చకులు ఈ నాగరాజు జూనియర్ అసిస్టెంట్ శివరాత్రి ఆంజనేయులు ఆలయ విష్ణు సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొన్నార



6, మార్చి 2024, బుధవారం

స్వర్ణగిరి వెంకటేశుడికి ప్రాణ ప్రతిష్ట

 



స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు బుధవారం భువనగిరి శివారులోని మానేపల్లి హిల్స్లో నిర్మించిన పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాల ప్రాణప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛారణలు హోమాధికతువులతో స్వామివారి పూజా కార్యక్రమాలు కనుల పండగ జరిగాయి కార్యక్రమానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు



3, మార్చి 2024, ఆదివారం

తిరుపతి లడ్డు ధరలు తగ్గించేది లేదు

 డయల్ యువర్ ఈవోలో ధర్మారెడ్డి వెల్లడి

తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు లడ్డు బరువు పరిమాణం ఏమాత్రం తగ్గలేదని రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తుడు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు దీనికి ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఉచితంగా అందిస్తున్నామని బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలలో తప్ప మిగిలిన సమయంలో భక్తులు కావలసినవి లడ్డూలు కొనుగోలు చేసుకోవచ్చు అని సూచించారు

వెంకటేశ్వర ఆలయంలో

 తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు శివ స్వాములు భక్తులు సిద్ధిరాములు గంగారం తదితరులు ఉన్నారు



తొర్లికొండ లో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు

 జక్రాంపల్లి మండలంలోని తొర్లుగొండ గ్రామంలో శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాలను భక్తులు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు అనంతరం స్వామివారి పల్లకిని భక్తులు కొండపై చుట్టూ ప్రదక్షిణ చేశారు ఆలయంలో భక్తులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు ఆలయం వద్ద భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు నూతనంగా నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులు గ్రామస్తులు విరాళాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విడిసి సభ్యులు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నార

1, మార్చి 2024, శుక్రవారం

అపురూప ఆలయంలో భారతి నృత్యానికేతన్ చిన్నారుల నృత్య ప్రదర్శన

 


అపురూప వెంకటేశ్వర స్వామి పుష్కర బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్దగల భారతి నృత్యానికేతన్ విద్యార్థులతో ప్రత్యేక నృత్య ప్రదర్శన చేయించినట్లు నాట్య గురువు సరోజ సుధీర్ గురువారం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మమ్మల్ని ఆహ్వానించిన దేవస్థానం కమిటీ వారికి విజయ విద్యాసంస్థల అధినేత్రి అమృతరతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు



మానేపల్లి హిల్స్ పై స్వరనగిరి

 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని మానేపల్లి హిల్స్ పై మానేపల్లి దంపతులు రామారావు విజయలక్ష్మి సారధ్యంలో నిర్మించిన స్వర్ణ గిరి పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రాణ ప్రతిష్ట ఆలయ ఉత్సవాల కోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు మానేపల్లి హిల్స్ అధినేత మానేపల్లి రామారావు ఆయన కుమారులు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణ తెలిపారు నుంచి ఆరు వరకు ఆరు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈనెల 6న వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 116కు జరిపించి అనంతరం శాంతి కళ్యాణంతో కార్యక్రమాలు సంపన్నం కానున్నట్లు తెలిపారు భువనగిరి పట్టణానికి పూత వేటి దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి అని నమ్మకలనం చేసి తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు అందరు సహాయ సహకారాలు కావాలని కోరారు నూతన ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ముందు రోజు బుధవారం ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మానేపల్లి హిల్స్ కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణ గిరి అని నామకరణం చేసిన కొండమీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తిన్నచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సుభిశాలంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉప ఆలయాలు నిర్మించినట్లు తెలిపారు. దేవాలయావరణలో మనోభీష్ట ఫలకం ప్రత్యేక ఆకర్షణ భక్తుల విన్నపాలు దీని ద్వారా స్వామివారికి అనుసంధానం అవుతాయని తెలిపారు ఈ సమావేశంలో ఆలయ రూపశిల్పి ప్రముఖ సపతి డిఎన్వి ప్రసాద్ వేద పండితులు కుటుంబ సభ్యులు ఉన్నారు

29, ఫిబ్రవరి 2024, గురువారం

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

 


మాకూరు మండల పరిధిలోని మామిడిపల్లి శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగాయి స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో దూపదీప నైవేద్యాలు కొనసాగాయి యాగశాల అర్చనలు భక్తులందరినీ ఆకట్టుకున్నాయి శ్రీవారి కల్యాణ మండపంలో రోజు కళా ప్రదర్శనలు పౌరాణిక నృత్య ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు చివరి రోజు పురస్కరించుకుని శాంతి పాఠము శ్రీ లక్ష్మీ నారాయణ ఎస్టి చక్రస్నానము సాయంకాల సమయంలో శ్రీ పుష్పయాగము పల్లకి సేవ సత్తాభరణం మహాదాసి నిర్వచనము వంటి కార్యక్రమాలు జరిగాయి మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అమృతలతో రమాదేవి రమాదేవి శ్రీనివాస్ రెడ్డి రమణారెడ్డి స్థానికులు పాల్గొన్నారు



27, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఘనంగా శ్రీవారి కల్యాణ మహోత్సవం

 మాకూరు మండల పరిధిలోని మామిడిపల్లి శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జరిగాయి అంతేకాకుండా సాయంకాల సమయంలో గరుడ వాహనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు జరిగాయి మధ్యాహ్న సమయంలో అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అమృతలతో ప్రభాదేవి రమాదేవి శ్రీనివాస్ రెడ్డి రమణారెడ్డి స్థానికులు తదితరులు పాల్గొన్నారు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

తిరుమలలో ఇక నిత్య సంగీతార్చన

 తిరుమల కాలినడక భక్తులకు నిత్య సంకీర్తన అర్చన

టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయము

తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల కోసం నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు స్థానిక అన్నమయ్య భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు తీర్మానాలను ఈవో ధర్మారెడ్డి తో కలిసి చైర్మన్ వెల్లడించారు అలిపిరి తిరుమల కాలినడక మార్గంలోని గాలిగోపురము ఏడవ మైలు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము మోకాళ్ళ మెట్టు వద్ద కళాబృందాలతో నిరంతరం సంకీర్తన అర్చన తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్యసంకీర్తనర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపార

శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయల విగ్రహాలు ఉన్న గుడి తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు తాపడంతో కొత్తవి ఏర్పాటు

శ్రీవారి వివాహ కానుకగా నాలుగు కోట్ల రూపాయలతో మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు 7 డిజైన్లలో తయారు చేసేందుకు నాలుగు ప్రముఖ బంగారు ఆభరణాలు తయారీ సంస్థలకు అనుమతి

చిన్నారులలో ధార్మిక నైతిక విలువలు పెంచడంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు తమిళం కన్నడ హిందీ ఆంగ్ల భాషలలో 98 లక్షల కాపీల ముద్రణకు మూడు కోట్ల 72 లక్షల రూపాయలు మంజూరు


తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు పై టీటీడీ రేటు వేసింది టీటీడీ ప్రభుత్వము అహోబిలం మఠము అర్చకులు జీయర్లపై రమణ దీక్షితులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్న టిటిడి నుంచి ఆయనను తొలగిస్తూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు పెంచుతూ పలక మండలి నిర్ణయం తీసుకున్నది శ్రీవారి ఆలయంలోని జయ విజయ ల వద్ద ఉన్న తలుపులకు ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు కాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు గాలిగోపురము ఆంజనేయస్వామి విగ్రహము మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకనుంచి నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు 4 కోట్ల రూపాయలతో నాలుగు ఐదు పది గ్రాముల తాళిబొట్టుల తయారీకి పాలకమండలి నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది ప్రతిఏటా ఫిబ్రవరి 24వ తేదీన టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు

అర్గుల్ లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు.

 జక్రాన్ పల్లి మండలం లోని ఆర్గుల్ గ్రామం లో ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం స్వామి వారి కి అభి షేకం, దీపా రాధన , తీర్థ ప్రసాదం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ వారం యజ్ఞం అగ్ని ప్రతిష్ట, బలి హరణం, తీర్థ ప్రసాదం వితరణ , ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.27 న స్వామి వారి కళ్యాణ మహోత్సవం,28 న సామూహిక కుంకుమార్చనలు, దొంగల దోపు కార్య క్రమం జరగనుంది.29 న జాతర, రథోత్సవం, మార్చ్ 1 న చక్ర తీర్థం,2 న స్వామి వారి నాగ వెల్లి, చక్ర స్నానం, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆచార్య తేజ చక్రవర్తుల ఆధ్వర్యం లో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఘనంగా బంగారు వెంకన్న జాతర

 ముప్ కాల్ మండలంలోని వెంచరియాల్ గ్రామంలో శనివారం బంగారు వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా నిర్వహించారు 19వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం రథోత్సవం జరిపారు ఉత్సవమూర్తులకు వేద పండితులు అభిషేకాలు అర్చనలు చక్రస్నానం చేయించారు స్వామివారి జాతరకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అన్నదానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

 శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి శనివారం దర్శించుకున్నారు ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి టీటీడి అధికారులు స్వాగతం పలికారు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు.



24, ఫిబ్రవరి 2024, శనివారం

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

 మామిడిపల్లి శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి పుష్కర బ్రహ్మోత్సవ ఉత్సవాలు కొనసాగాయి రెండవ రోజు పురస్కరించుకొని సభా ప్రార్ధన ఆరాధన పుణ్యాహవాచనము యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్ట శాంతి పాఠం భజారోహణము నివేదన నీరాజనం సాయంకాల సమయంలో సహస్రనామ స్తోత్ర పారాయణం సామూహిక లక్ష్మీనారాయణ కుంకుమార్చన పల్లకి సేవ హంస వాహనము పూర్ణాహుతి నివేదన నీరాజనం పంటి కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో చైర్మన్ అమృతలత శ్రీనివాస్ రెడ్డి రమణారెడ్డి ప్రధాన అర్చకులు స్థానికులు పాల్గొన్నారు



23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

22 ఎకరాల్లో స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం

 భువనగిరిలో నిర్మించిన మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ 6న చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట

మానేపల్లి కుటుంబం మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా భువనగిరిలోని మానేపల్లి హిల్స్లో నిర్మితమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవానికి నిర్వాహకులు అంతా సిద్ధం చేస్తున్నారు తమ సొంత స్థలమైన 22 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపట్టామని మార్చి ఒకటి నుంచి ఆరవ తేదీ వరకు మహా కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధినేత మానేపల్లి రామారావు తెలిపారువ తేదీ ఉదయం 116 నిమిషాలకు త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందని గురువారం హైదరాబాదులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆరోజు నుంచే భక్తుల దర్శనాలు మొదలవుతాయి అన్నారు స్థపతి డిఎన్ఏ ప్రసాద్ మాట్లాడుతూ లేదా విమాన గోపురం తో కూడిన గర్భాలయం 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం సిద్ధమైనట్లు వివరించార

4 అడుగుల ఎత్తైన రథంతో పాటు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ విగ్రహం శ్రీ లక్ష్మీనరసింహస్వామి భూవరాహస్వామి వకుల మాత ఉపాలయాలను నిర్మితమైనద తెలిపారు.

22, ఫిబ్రవరి 2024, గురువారం

ఘనంగా ఎదురుగుండా వెంకన్న రథోత్సవం

 మూడు జిల్లాల సరిహద్దులో ఎదురుగొండ పై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం బుధవారం భక్తుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగింది సిరికొండ మండలం తుంపల్లి శివారులో ఎదురుగొండ పై కొలువుదీరిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నిజమాబాద్ కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలో సరిహద్దులు అడవిలో మూడు రోజులుగా జాతర సాగుతోంది బుధవారం ఉదయం స్వామివారి కల్యాణోత్సవం జరిగింది సాయంత్రం రథోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగింది ఈ జాతరకు కామారెడ్డి సిరిసిల్ల నిజామాబాద్ జిల్లాలకు చెందిన భక్తులు హాజరై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని మొక్కులు చెప్పుకున్నారు. జాతరకు హాజరైన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సత్రంఏర్పాటు చేశారు