నిత్య సందేహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిత్య సందేహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి

 బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి మంత్రసాధనకు ఆ సమయం ప్రశస్తమైనదని చెబుతారు ఎందుకు

తెల్లవారుజామున 320 నిమిషాల నుంచి 5:40 నిమిషాల మధ్య కాలాన్ని బ్రాహ్మణ ముహూర్తం అంటారు మనిషికి జ్ఞానాన్ని అందించే అద్భుత కాలం బ్రహ్మీ ముహూర్తం సాధారణంగా ప్రతిఘటకు గ్రహ హోరా మారుతుంది అంటే క్షితిజ రేఖ దగ్గర ఆగ్రహం కనిపిస్తుందని అర్థము హోరాకాలానికి అతిధివత అయిన గ్రహం మనం చేసే పనులను నిర్దేశిస్తుందని జ్యోతిష్యం చెబుతుంది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంపై ఏ గ్రహాల ప్రభావము ఉండదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరకు సైతం అతీతమైన సర్వచైతన్యమయమైన అమ్మవారి శక్తి మాత్రమే ఈ కాలంలో ప్రభావంతంగా ఉంటుంది ఆసక్తికి రూప గుణాలు ఉండవు అది శుద్ధ చైతన్యం కేవలం జ్ఞాన స్వరూపం అందుకే తెల్లవారుజామున నేర్చుకున్న విద్య హృదయానికి హత్తుకుంటుంది బాగా జ్ఞాపకం ఉంటుంది ఏకాగ్రత కుదురుతుంది వాక్ శుద్ధి కలుగుతుంది అందుకే చదువు కు జప సాధనలకు బ్రాహ్మీ ముహూర్తాన్ని మించింది లేదని పెద్దలు చెబుతుంటారు.

19, ఫిబ్రవరి 2024, సోమవారం

ఆంజనేయుడికి సింధూరం ఎందుకు ప్రీతి

 సింధూరం ఆంజనేయుడికి ప్రతిపాత్రం కావడం వెనుక రామాయణ గాథలు ఒక ఘట్టాన్ని కారణంగా చెబుతారు రామ రావణ సంగ్రామం జరిగే సమయంలో ఒక సందర్భంలో శ్రీరాముడు ఆంజనేయుడు భుజాలపై ఎక్కి యుద్ధం చేశాడు ఆ సమయంలో రావణుడు విసిరిన బాణాలు తరచుగా ఆంజనేయుడికి తగిలాయి హనుమా శరీరమంతా రక్తసిక్తమైంది అయినా ఏమాత్రం చెల్లించకుండా దృఢదీక్షతో నిలబడతాడు రాంబంటు రక్తంతో తడిసి ముద్దయిన హనుమదేహం పూచిన మోదుగ చెట్టు వలె ఉందని వాల్మీకి మహర్షి వర్ణించారు ఆనాటి సన్నివేశం హనుమకు ఎంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగించింది ఆంజనేయుడికి స్వామికార్యం తప్ప స్వకార్యం లేదు కదా అందుకే ఈనాటికి తిరుమల బ్రహ్మోత్సవాలు సహా అన్ని వైష్ణవాల ఉత్సవాలు విష్ణుమూర్తికి హనుమత్ వాహనం ఏర్పాటు చేసే సంప్రదాయం కనిపిస్తుంది ఇక అర్చనలో భాగంగా ఆంజనేయుడికి ఎర్రని సింధూరం ఆనాడు రామయ్య కోసం శరీరం రక్తసిక్తమైన వేళ తను పొందిన ఆనందం తలుపులు మెదిలి హనుమాన్ ఆనందిస్తాడట వెంటనే భక్తుల పట్ల ప్రసన్నుడు అవుతాడని పెద్దల మాట ఈ అభిప్రాయంతో ఆంజనేయుడికి సింధూరం పూసి ఆచారం లోకంలో ప్రచారం అయింది అంతేకాదు ఎర్రని రంగు పరాక్రమానికి పవిత్రతకు త్యాగానికి సంకేతం ఈ గుణాల సమ్మేళన మీ హనుమంతుడు కాబట్టి హనుమత్ అర్చనలు సింధూర పూజా ప్రత్యేకమైనదిగా నిలిచింది



24, మే 2021, సోమవారం

కొత్త వస్త్రానికి పసుపు ఎందుకు పెడతారు?

 ప్రతి మంచి పని లోనూ పసుపును విరివిగా వినియోగిస్తారు మనవాళ్ళు. శుభకార్యాలలో యజ్ఞ దీక్ష సమయాలలో వస్త్రాలను పసుపు నీళ్లలో ముంచి ఆర వే య డ ము ఆచారం. తడిపి ఆరవేసిన వస్త్రాలు ఇతరులకు ఇవ్వకూడదు .నూతన వస్త్రాలు ఇవ్వాలి. పసుపు నీళ్లతో తడిపితే ఆ వస్త్రాలు పా త వైపోతాయి. అందుకే పసుపు నీళ్లలో తడిపిన ఫలం కోసం ఇతరులకు కొత్తబట్టలు పెట్టేటప్పుడు పసుపు బొట్టు పెడతారు .ఇలా చేయడం మంగళకరంగా భావిస్తారు .పసుపు క్రిమిసంహారిణి .అనేక చేతులు మారి వచ్చే కొత్త బట్టల లో ఎటువంటి క్రిములు ఉన్నా పసుపు నివారిస్తుంది. అప్పటికప్పుడు కట్టుకున్న ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుంది

శుభకార్యం చేసిన తర్వాత దర్భలు, నువ్వులు తాకకూడదా?

 దర్భలు ఎప్పుడూ పవిత్రమైనవే. దర్భను తాకకూడదు అని చెప్పే సందర్భం ఒక్కటీ లేదు. అశుచి నుంచి మనల్ని బయటపడేసేది  దర్భయే. ఇంటిలో ఏదైనా పెద్ద శుభకార్యం చేసిన కొద్ది కాలానికే పెద్దలకు సంవత్సరీకాలు , త ద్ది నా లు పెట్టుకోవలసి వస్తే నువ్వులు తాకక పోవడం మాత్రం కనిపిస్తుంది .నువ్వుల కు బదులుగా వాడేవి ఏ వీ  సరైన ప్రత్యామ్నాయాలు కావు . పితృకార్యం చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వుల నేఉపయోగించాలి .అందులోనూ తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు నిర్వహించవలసి వచ్చినప్పుడు అస్సలు మానేయకూడదు.

గుడిలోనికి వెళ్లేముందు గడపకు ఎందుకు నమస్కరిస్తారు?

 గుడిలోనికి మాత్రమే కాదు ఇక్కడ గడప ఉన్నా నమస్కరించిన తరువాతే లోనికి వెళ్ళాలి .లక్ష్మీ దేవి గా భావిస్తాము. అందుకే  రోజు గడపన కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరిస్తాము. దేహ లీ దేహ పర్యంత స్థాన సంపర్క శోభితే మత్కర్మ పరి పూర్ణయ యతో భవే సదా మమ అనే మంత్రాన్ని చెబుతూ గడపకు నమస్కరించాలి .నేను ఆచరించిన కర్మలు పరిపూర్ణంగా సఫలం చేసుకోవడానికి కావలసిన సంస్కారాన్ని ప్రసాదించు తల్లి, నన్ను మంచివాడిగా చేయమని ఈ శ్లోకానికి అర్థం. మంచివాడిగా ఉంటే సమాజం తద్వారా దేశం ఉత్తమంగా తయారవుతాయి .సంస్కారాన్ని మనకు నేర్పేది గడప రూపంలోని లక్ష్మీదేవి .అందుకే గడపకు నమస్కరించాలి.

ఆలయాలలో నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా?

 అవసరం లేదు .పరిహార పూజలు జరిపించే సందర్భంలో మాత్రమే కొన్ని విధి నియమాలు ఉంటాయి. అటువంటి సందర్భం లేనప్పుడు నవగ్రహ దర్శనానంతరం కాళ్ళు కడుక్కుని అక్కరలేదు .ఆలయంలో అందరూ దేవి దేవతలను దర్శించినట్లు నవగ్రహాలను దర్శించుకోవచ్చు ,.తాకవచ్చు ,పూజించవచ్చు.

ఇంటిలో గర్భవతులు ఉన్నప్పుడు గృహప్రవేశం చేయవచ్చా?

 శాస్త్ర ప్రకారం ఇంట్లో గర్భవతులైన స్త్రీలు ఉన్నప్పుడు ఇంటి శంకుస్థాపన చేయకూడదు .గర్భవతిగా ఉన్న ఇల్లాలికి సహాయం చేయవలసిన పురుషుడు ఇంటి నిర్మాణంలో పడితే ఆమెకు పుట్టబోయే బిడ్డకు సరైన సేవ చేయలేడు వారిద్దరికీ అన్యాయం చేసినట్లు అవుతుంది .కాబట్టి ఇంటిలో గర్భవతులు ఉండగా గృహనిర్మాణ గృహప్రవేశం చేయకూడదు .అయితే ఇల్లు కట్టబడి ప్రారంభించిన తరువాత ఇల్లాలు నెల తప్పితే గృహనిర్మాణం, గృహప్రవేశం నిరభ్యంతరంగా చేయవచ్చు.

సంప్రదాయం అంటే ఏమిటి?

 ఆయము అంటే మన సంపాదన. మనం మాత్రమే వినియోగించుకుంటారు. దాయం అంటే ఒకే ఇంటి పేరు ఉన్న వాళ్ళు నలుగురు పంచుకునే వారసత్వపు ఆస్తి. ప్రదాయము అంటే ఎంత పంచుకున్న తరగని గొప్ప సంపద .అంటే మన విజ్ఞానం ఇంటి పేరు గోత్రం వంశ చారం వంటివి .సంప్రదాయం అంటే సమ్యక్ ప్రదాయం  వేలాది సంవత్సరాలు గడిచిపోయినా మానవుని ని జీవితానికి ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చేది సంప్రదాయమే .ఏ సందేశాన్ని ఆచరించడం వల్ల మానవుడు మెరుగైన ఫలితాలు పొందుతాడో అదే సత్సంప్రదాయం.

శ్రీ అంటే అర్థం ఏమిటి?

 ఓం కారం శ్రీకారం మంగళ వాచకాలు. శ్రీకారం తో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది .క్షేమము కలుగుతుంది. ఏ కార్యక్రమమైనా ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు అని అంటూ ఉంటాం .శ్రీ అనే శబ్దానికి లక్ష్మి మొదలైన అర్థాలు లు ఉన్నాయి .అలాగే శ్రీ ని స్త్రీ వాచకంగా గుర్తిస్తారు. సీత తో కూడిన రాముని శ్రీరాముడు అనాలని కొందరు చెబుతారు .మంత్ర సాధన లో కూడా శ్రీ బీజానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది .మొత్తంమీద శ్రీ అనేది గౌరవ పురస్సరంగా వాడే శబ్దం గా గుర్తించాలిి.

గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి

 ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభ కార్యాలు పండగలు నిర్వహించరు. మామిడి రావి జువ్వి మర్రి ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలు అంటారు. శుభకార్యాలలో వీటిని విరివిగా వాడతారు .తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది పండుగల వేళ పని ఒత్తిడిని శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణం. మామిడి కోరికలనూ తీరుస్తుందని భావిస్తారు .పర్వదినాలలో యజ్ఞ యాగాలలో ధ్వజారోహణం చేయడం ఆచారం .దానికి ప్రతీకగా తోరణాలు కట్టి ఆచారం వచ్చింది.

31, డిసెంబర్ 2011, శనివారం

జ్ఞానం లేని బ్రతుకు LIFE WITH OUT KNOWLEDGE

1. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నచోట ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుతుందా?

పిల్లలు సరైన సమయంలో కలగకపోతే 28 సార్లు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం చాలాచోట్ల చాలా కాలం నుండి ఉన్నది. దానికి వైద్య కారణం వెతికితే చిరంజీవి వంటి రావిచెట్టు పురుష అంశ కలది వేప చెట్టు స్త్రీ అంశ కలది ఈ రెండు కలిసిన ప్రదేశం వద్ద ప్రదక్షిణలు చేయడం వల్ల శరీరం వాటి నుంచి ఆమ్ల జణితము ఇట్టే గ్రహిస్తుంది గర్భదోషాలను అరికడుతుంది ఎక్కువ రోజులు ప్రదక్షిణం చేయడం ద్వారా వాటి పైనుంచి పడిన సూర్యకిరణాల వల్ల గర్భకోశ శక్తి పెరిగి సంతానవంతులయ్యే అవకాశం ఉంది 

2. మనిషి తప్పక తీర్చవలసిన రుణాలు ఏమిటి ?

పరిపూర్ణమైన ఆలోచనలతో ధర్మ సంబంధ గృహ సంబంధిత సుఖాలకై మానవజన్మ ఇచ్చినందుకు తోలుతా దేవ రుణాన్ని పూజలు యాగాల ద్వారా తీర్చాలి యజ్ఞ యాగాలు చేయడం ద్వారాచేయడం ద్వారా దేవరుణం తీరటం తో పాటు పరిసరాల్లోని అనేక క్రిముల వల్ల వ్యాపించే అంటురూగాలు సైతం దూరమవుతాయి ఆ తర్వాత నవ మాసాలు మోసి లాలించి పెంచి పెద్ద చేసిన తల్లి రుణాన్ని విద్యాబుద్ధులు నేర్పించి వివాహాది కార్యాలను చేసి ని ఇష్టానుసారంగా బతికే స్వేచ్ఛ ఇచ్చిన తండ్రి రుణాన్ని అనగా తల్లి తండ్రి ఋణాన్ని వయసు మళ్ళినప్పుడు వారు ఏ పని చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు అన్ని తానే అయి తీర్చుకోవాలి . ఆపై ఆచార్య రుణం అనగా సమస్త జ్ఞానాన్ని సభ్యత సంస్కారాలు నేర్పించిన గురువులు ఆచార్యదేవులను ధనం ద్వారా వినయం ద్వారా సేవించాలి తీర్చుకోవాలి

3 . దేవుడికి నైవేద్యం ఎందులో పెట్టాలి ?

బంగారం వెండి రాగి ఇత్తడి అలాగే మోదుగ ఆకుల్లో గాని అరటి ఆకులో గాని తామరాకులు గాని అదే కుదరకపోతే మట్టి పాత్రలోనైనా నైవేద్యం పెట్టాలి. స్టీలు గాజు వంటి వాటిల్లో నైవేద్యం పెట్టడం తగదు 

4 . జ్వరము నీరసము దగ్గు ఉన్నప్పుడు దిష్టి తీయగానే ఒకంత ఉపశమనం కలుగుతుంది ఎందుకు?

 నిప్పులు పళ్లెంలో పోసి ముఖానికి దగ్గరగా పెట్టి మూడుసార్లు మిరపకాయలతో ఉప్పుతో దిష్టి తీసి నిప్పుల మీద వేస్తారు అలా వేసిన తర్వాత వచ్చే పొగను పీల్చడం వల్ల అనగా సోడియం క్లోరైడ్ విడిపోయి సోడియం పెరాక్సైడ్ గా క్లోరిన్ గా మారిన వాటిని పిల్చడం వల్ల ముక్కు రంధ్రాల గుండా తీక్షణమైన వాయువు శరీరంలో ప్రవేశించటంతో శ్వాస మండలం రిలాక్స్ అవుతుంది. దానితో ఏదో తెలియని శాంతి కలుగుతుంది పెద్దలు పెట్టిన ఏ ఆచారంలో నైనా సంప్రదాయంలో నైనా ఎంతో జ్ఞానం ఉంది అలాగే దీనికి ప్రాధాన్యం ఉంది.



జంతువుల్లో కొన్నిటికి తోకాలుటాయి ఆ తోకల వలన
 అవి రెండు ప్రయోజనములను పొందుతుంటాయి వానిలో ఒకటి ఈగల మొదలైన వాటిని తోలుకోవడం రెండు మర్మస్థానాన్ని కప్పిపుచ్చుకోవడం కానీ కుక్క తోక విలక్షణమైనది అది పైన తెలిపిన రెండు కార్యాలకు కూడా ఉపయోగించదు అది వ్యర్థంగానే ఉంటుంది అన్నది నిజమే విజితమే జ్ఞానం లేని బ్రతుకును ధర్మము లేని విద్యను కుక్కతోకతో పోల్చి కొందరు చెప్పి ఉన్నారు కుక్క తోక ఎట్లు నిష్ప్రయోజనకరమైనదో జ్ఞానం లేని బ్రతుకు ధర్మాచరణ లేని విద్య నిరుపయోగమైనవే కాగలవు కాబట్టే జనులు పవిత్రమైన మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఆత్మ జ్ఞానాన్ని అలవర్చుకోవాలి తన జీవిత లక్ష్యాన్ని గూర్చి పెద్దల వద్ద చక్కగా తెలుసుకోవాలి ఆ లక్ష్యాన్ని సాధించడానికి అనవరత కృషిని సెల్ఫీ బ్రతుకును సార్ధకపరుచుకోవాలి ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నప్పటికీ ఆ విద్యతోపాటు ధర్మచరణ ఉన్నప్పుడే అది శోభిస్తుంది. రాణిస్తుంది అట్లు కానిచో ధర్మోద్ధరణకు పవిత్ర వ్యక్తిత్వానికి సచ్చిలానికి ఆ విద్య ఉపయోగపడక పోతే అది నిష్ప్రయోజనమే కాగలదు కాబట్టి మానవుడు ఎన్ని విజయాలు నేర్చుకున్నా ఎన్ని కళలు సంపాదించిన ఆ విద్యలకు కళలకు తపస్సును కూడా జోడించాలి సచ్చేలాన్ని కూడా అనుసంధించాలి అప్పుడే విద్యలు లోకంలో సార్ధకమవుతాయి శాశ్వత ప్రయోజనాన్ని సాధిస్తాయి ధర్మచరణ వల్ల క్రమంగా చిత్తశుద్ధి కలిగి ఆత్మానుభూతికి అవకాశం ఏర్పడుతుంది అటువంటి స్వస్వరూపానుభూతియే జీవితం యొక్క చర్మ లక్ష్యం అద్దానిని ధర్మాచరణతో కూడిన విద్యల వల్ల ఆచారకాలంలోనే మానవుడు పొందగలిగిన వాడు అవుతాడు 
విద్యాతపుభ్యం భూతాత్మ అనునట్లు విద్యతో పాటు తపస్సును సంపాదించి ధర్మాన్ని ఆచరించి జీవుడు కృతకృత్యుడు కావాలి శున : పుచ్చ మివ వ్యర్థం జీవితం విద్య యా వినా నగోపయతి గోప్యాంగం నివారయతి యక్షికాన్.