శివాలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శివాలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, మార్చి 2024, శుక్రవారం

శ్రీ ఏక చక్రేశ్వర శివాలయం హుండీ లెక్కింపు

 బోధన్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శివాలయంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం ఈ హుండీ లెక్కింపుని దేవాదాయ ధర్మా శాఖ వారి ఆదేశానుసారం జిల్లా ఇన్స్పెక్టర్ కమల ఈవో రవీందర్ గుప్తా జేఏవో రాములు ఆలయ చైర్మన్ కాలనీ హనుమంతరావు వారి పాలకమండలి ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ పోలీస్ సిబ్బంది పలువురు ప్రముఖుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దేవాదాయ ధర్మ శాఖ ఇన్స్పెక్టర్ కమల రవీందర్ గుప్తా ఆలయ చైర్మన్ కాలనీ హనుమంతరావు మాట్లాడుతూ భక్తుల కానుకల ద్వారా హుండీల మొత్తం మూడు లక్షల 6745 రూపాయలు ఆర్జిత సేవలు అభిషేకాల ద్వారా 4348 రూపాయలు మొత్తం ఎనిమిది లక్షల 393 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఇట్టి మొత్తాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖాతాలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు



10, మార్చి 2024, ఆదివారం

ఘనంగా శివపార్వతుల కల్యాణోత్సవం

 బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మారుమూల గ్రామం మానాలలో కొలువుదీరిన శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినోత్సవాలలో భాగంగా శనివారం శివపార్వతుల కల్యాణోత్సవం కనుల పండుగ ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు మధుపూర్ణ చందు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించగా ఆలయ కమిటీ అధ్యక్షుడు మూడారపు గంగారెడ్డి వీడీసీ చైర్మన్ గోపిడి రవీందర్ రెడ్డి కమిటీ పాలకవర్గ సభ్యులు స్వామివారి కల్యాణోత్సవ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు వీడిసి ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు



మల్లన్న ఆలయంలో పెద్దపట్నం

 



సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పెద్దపట్నం కళ్యాణం చేశారు శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటలకు మొదలై శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగింది స్వామి వారి పెద్దపట్నం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు ఆలయ ఒగ్గు పూజారులు పంచవన్ని రంగులతో నిలబయొక్క వరసల పట్నం వేసి స్వామివారికి యాదవ సంప్రదాయ కళ్యాణం జరిపించారు దర్బాలయం నుంచి వీరశైవ అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పెద్దపట్నం చుట్టూ ప్రదక్షిణలు చేసి పట్నం తొక్కడం ప్రారంభించారు అనంతరం భక్తులు మల్లన్నకు స్మరిస్తూ పట్నాన్ని విడతల వారీగా దాటారు



9, మార్చి 2024, శనివారం

శివుడికి వెండి కిరీటం బహుకరించిన ముస్లిం భక్తుడు

 మహాశివరాత్రి సందర్భంగా ఒక ముస్లిం భక్తుడు మతసామరస్యాన్ని చాటాడు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఎండి మౌలానా పట్టణంలోని శ్రీ భవాని శంకర మహాదేవాలయానికి శుక్రవారం ఆలయ కమిటీ సమక్షంలో 20వేల రూపాయల విలువైన వెండి కిరీటాన్ని బహూకరించారు ఆలయ పూజారి విశ్వనాథ శర్మ ప్రత్యేక పూజలు చేసి కిరీటాన్ని శివలింగానికి అలంకరించారు మౌలానా కుటుంబానికి పరమశివుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు



మే 10 నుండి కేదార్నాథ్ దర్శనం

 భక్తుల సందర్శనార్థం మే 10 నుంచి కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకొనున్నయని శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది ఉకీ మట్ లోని. ఓంకారేశ్వర ఆలయంలో బి కే టి సి చైర్మన్ అజేంద్ర అజయ్ ఈ విషయాన్ని వెల్లడించారు ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ప్రజలు కేదార్నాథ్ దర్శించుకుంటారు శీతాకాలంలో ఈ ఆలయం పూర్తిగా మూసివేస్తారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన అజయ్ గత యాత్ర సీజన్లో రికార్డ్ స్థాయిలో భక్తులు కేదార్నాథ్ సందర్శించినట్లు చెప్పారు ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలిపారు

జగమంతా జంగముడి సేవలు

 అరె ఓ జంగమ విభూది లిగమ అంటూ జగమంతా జంగముడి సేవలో తరించింది శైవాలయాలు శివ పంచాయతన ఆలయాలలో మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు వేలాది భక్తులతో కిక్కిరిసి కనిపించాయి గల్లీలలోని గుడి మొదలు ప్రసిద్ధ ఆలయం వరకు అన్ని చోట్ల పంచాక్షరి మంత్రం మార్మోగింది శుక్రవారం ఉదయం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు విశేష పూజలు కొనసాగాయి లింగోద్భవ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్త లోకం ఉత్సాహం ప్రదర్శించింది శివలింగాన్ని చూస్తూ భక్తులు తన్మయత్వంతో కైమోడ్ పులార్పించారు




7, మార్చి 2024, గురువారం

శివాలయం నూతన చైర్మన్ కు సన్మానం

 బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయం నూతన చైర్మన్గా ఎన్నికైన కర్నే హనుమంతరావును బుధవారం వీరశైవ లింగాయత్ జంగమ సమాజ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కర్ణ హనుమంతరావును చాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు సన్మానించిన వారిలో బాబాయప్ప వెంకటేశ్వర దేశాయ్ శ్యామ్ రావు శివకుమార్ అప్ప నర్సింగప్ప లక్ష్మణ్ పటేల్ అజయ్ కుమార్ శంకరప్ప ప్రభు అప్ప మాధవరావు పటేల్ నాగభూషణ్ లింగాయత్ సమాధి సభ్యులు జంగమ సమసభ్యులు తదితరులు పాల్గొన్నారు



భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

 మహాశివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాలలో దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ ఆదేశించారు జిల్లా కేంద్రం నీలకంఠేశ్వరాలయంలో బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు ఎండలు పెరుగుతున్న తరుణంలో భక్తుల కోసం చలువ పందిర్లు షామియానాలు మంచినీటి వసతి రక్షణ కోసం పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు ఆయా దేవాలయాల ఈవోలు పూజారులు సిబ్బంది సేవా సంస్థల ప్రతినిధులు పూజలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు ఆమె వెంట ఆ శాఖ పరిశీలకురాలు కమల ఈవో వేణు తదితరులు ఉన్నారు



మహాశివరాత్రికి వేములవాడలో ఏర్పాట్లు

 


మహాశివరాత్రి జాతరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబయింది గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ మహారాష్ట్ర చత్తీస్గఢ్ నుంచి సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాటు చేశారు జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాణ కోసం రాజన్న గుడి చెరువు మైదానంలో స్టేజిని రెడీ చేశారు వేములవాడ జాతర సందర్భంగా రాజరాజేశ్వర స్వామికి ఆటో టిటిడి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు వందలు ఉన్నాయి గురువారం రాత్రి టీటీడీ తరఫున అర్చకులు ఆఫీసర్లు రాజన్నకు పట్ట వస్త్రాలు సమర్పిస్తారు శుక్రవారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు ప్రత్యేకంగా వెయ్యి ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు ప్రత్యేకంగా హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు 1600 మంది పోలీసులు 640 కెమెరాలతో పహార కాస్తున్నారు కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు పూర్తి చేశారు



6, మార్చి 2024, బుధవారం

శివరాత్రి ఉత్సవాలకు నిధులు విడుదల

 మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ ఆలయాలలో నిర్వహించ ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది స్పెషల్ డెవలప్మెంట్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పథకం కింద ఉత్సవాల నిర్వహణకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కోటి మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గ మాత దేవాలయానికి రెండు కోట్లు విడుదల చేసింది

శ్రీశైలంలో వైభవంగా పుష్ప పల్లకి సేవ

 శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు బుధవారం ఉదయం భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు సాయంత్రం స్వామి అమ్మవార్ల పుష్ప పల్లకి ఉత్సవం శోభాయ మానంగా సాగింది



కాలేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలోని కాలేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో ఈనెల ఏడు నుంచి తొమ్మిది వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు



5, మార్చి 2024, మంగళవారం

అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం

 లక్ష్మణ చాందా మండలంలోని బాబాపూర్ గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మహాశివరాత్రి ఐదు రోజుల ముందు స్వామివారి కల్యాణ వేడుకలు నిర్వహించి నిత్య పూజలు నిర్వహిస్తారు. పేద మంత్రోచ్ఛారణల మధ్య ముత్తైదువల మహిళల నడుమ శివపార్వతుల కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి ఆలయం లోపల జరుగుతున్న స్వామివారి కల్యాణ వేడుకలు బయట ఉన్న భక్తులందరూ తిలకించేందుకు ఆలయ ఆవరణలో ఎల్ఈడి వాల్ స్క్రీన్ ఏర్పాటు చేసి స్వామివారి కల్యాణ వేడుకలను వీక్షించారp అనంతరం రథ గుడి వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి రథోత్సవాన్ని బయటకు తీశారు ఈ వేడుకలను వీక్షించేందుకు బాబాపూర్ నర్సాపూర్ కనకాపూర్ వడ్యాల్ కన్జర్ బోరిగం రాజాపూర్ తదితర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ వేడుకలను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భారీ భక్తజనం హాజరయ్యారు ఈనెల 8వ తేదీన శివరాత్రి వేడుకలు మూడు రోజులపాటు జాగారం సాగనుంది





యాదాద్రిలో నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆచార్యులు పూర్తి చేశారు పాంచానిక దీక్షతో చేపట్టే ఉత్సవాలలో మొదటి రోజైన మంగళవారం ఉదయం 10:30 గంటలకు స్వస్తి వాచనం జరిపిస్తారు ఆరవ తేదీన ధ్వజారోహణం భేరీ పూజ దేవత ఆహ్వానం అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏడవ తేదీ రాత్రి 7 గంటలకు రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఆలయ ఉత్తరం ఆడ వీధిలోని కళ్యాణ మండపంలో జరిపిస్తారు 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి అభిషేకాలు రాత్రి లింగోద్భావ కాలంలో మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం ,9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లక్ష బిల్వార్చన రాత్రి శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి రాత్రి డోలోత్సవం ఉంటాయి దీనితో వేడుకలు ముగుస్తాయి 

పూజలకు టికెట్లు 

రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే ఆయా పూజలలో పాల్గొని భక్తులు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఏడవ తేదీన నిర్వహించే శివకళ్యాణోత్సవంలో 516 రూపాయలు టికెట్ కొనుగోలు చేసి ఇద్దరు పాల్గొనవచ్చు 8వ తేదీ మహాశివరాత్రి రోజున జరిపే అభిషేకంలో 300 రూపాయల టికెట్ రాత్రి జరిగే శత రుద్రాభిషేకంలో 516 రూపాయలు టికెట్టు కొనుగోలు చేసి పూజల్లో పాల్గొనాల్సి ఉంటుంది ఇక తొమ్మిదవ తేదీన జరిగే లక్ష బిల్వార్చన పూజలు సైతం పాల్గొనేందుకు 516 రూపాయల టికెట్ కొనుగోలు చేయాలి

3, మార్చి 2024, ఆదివారం

రామలింగేశ్వర ఆలయంలో శిలాయుగపు ఆనవాళ్లు

 


మహబూబ్నగర్ జిల్లా మూసాపేట శివారులోని రామస్వామి గుట్టపై వెలసిన రామలింగేశ్వర ఆలయం చరిత్ర గొప్పదని ఆలయం వద్ద శిలాయుగపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు ఏమని శివనాగిరెడ్డి తెలిపారు ఆదివారం ఆయన ఆలయాన్ని సందర్శించి పురాతన కాలం నాటి శిథిలమైన శివాలయం సీతారాముని గృహ వీరభద్ర రామేశ్వర సరస్వతి అమ్మవారి ఆలయాలు నాటి శాసనాలు విగ్రహాలను పరిశీలించారు ఒక వెయ్యి 76 నాటి కళ్యాణ చాళుక్య చక్రవర్తి విక్రమాదిత్యని కాలంలో ఏర్పాటు చేసిన కన్నడ శాసనాన్ని వెలుగులోకి తెచ్చారు విజయనగరం కాలంలో నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయం శిఖరాలను పరిశీలించారు బొమ్మలు శిల తోరణాలను పరిశీలించిన వాటి చరిత్ర గురించి ఆలయ నిర్వహకులకు వివరించారు అదేవిధంగా ఆలయం గుట్ట కింద నాటి కాలంలో ఏర్పాటైన కోనేరును పరిశీలించి దాని అభివృద్ధికి సూచనలు చేశారు ఆలయాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేపట్టాల్సిన పనుల గురించి తపతి భీమవరపు వెంకటరెడ్డి తో కలిసి నిర్వహకులతో చర్చించారు అనుభవిజ్ఞులైన శిల్పులతో ఆలయ అభివృద్ధికి అంచనాల రూపొందిస్తామని ఏడాదిలోపు పనులు పూర్తయ్యేలా సహకరిస్తామని ప్రకటించారు రామలింగేశ్వర స్వామి ఆలయం చరిత్రను కాపాడితే టూరిస్ట్ ప్రాంతంగా వెలిగింది అవకాశము ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు


వైద్యనాథేశ్వరాలయంలో విశేష పూజలు

 కామారెడ్డి ఎస్ ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వెనుక గల లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ రోడ్డులో శ్రీ జయ దుర్గా సమేత వైద్యనాథేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ తెలిపారు శంఖంతో లింగాభిషేకం చేయడం ఇక్కడే ప్రత్యేకత అన్నారు

మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని కలెక్టర్కు ఆహ్వానం

 నవీపేట మండలంలోని నాలేశ్వర్ లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని గ్రామానికి చెందిన పలువురు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని కోరారు శనివారం వారి జిల్లా కేంద్రంలో కలెక్టర్లు కలిసి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు ఈనెల 8 9వ తేదీలలో నాలేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని వారు కలెక్టర్కు వివరించారు ఈ కార్యక్రమంలో బినోల సొసైటీ చైర్మన్ హనుమాన్లు మాజీ సర్పంచ్ సరిగా తదితరులు ఉన్నారు



2, మార్చి 2024, శనివారం

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

 మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలిరోజు వేద పండితులు అర్చకులు యాగశాల ప్రవేశం చేసి అంకురార్పణ చేశారు రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ భేరీ పూజ నిర్వహించి సకల దేవతలకు ఆహ్వాన సూచికగా ద్వజపతాకాన్ని ఆవిష్కరించారు శ్రీశైల ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఏడు రోజులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వీరయ్య స్వామి తెలిపారు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ దేవస్థాన ఈవో ఎస్వి నాగేశ్వరరావు ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి దంపతులు పాల్గొన్నారు స్వామివారు బృంగి వాహన సేవలో దర్శనమిస్తారు స్వామి అమ్మవార్లను అలంకరించి ఆలయ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తారు

వేములవాడ లో ఏడు నుంచి మహాశివరాత్రి పూజలు

 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈనెల 7 8 9 తేదీలలో నిర్వహించనున్నారు 7న రాత్రి టీటీడీ పట్ట వస్త్రాలు సమర్పిస్తుంది మహాశివరాత్రి రోజు ఎనిమిదిన తెల్లవారుజామున 12 గంటల నుంచి రెండున్నర గంటల వరకు పట్టణ ప్రజలకు సర్వదర్శనం ఉంటుంది తెల్లవారుజామున రెండున్నర గంటలనుండి మూడున్నర గంటల వరకు ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులకు దర్శన అవకాశం కల్పిస్తారు 3:30 నుంచి 3:40 నిమిషాల వరకు మంగళ వాయిద్యాల ప్రదర్శన 3:40 నుండి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ ఆలయ శుద్ధి 4:30 నుండి 6 గంటల వరకు ప్రాతఃకాల పూజ ఉంటుంది ఎనిమిదిన్నర గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శివదీక్ష స్వాములకు దర్శనం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మండపంలో మహా లింగార్చన రాత్రి 11:35కు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తాం



మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

 


ఆర్మూర్ మండలంలోని చేపూర్లో మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్లను శుక్రవారం ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ ఆవిష్కరించారు మహాశివరాత్రిని పురస్కరించుకొని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు ఈనెల ఐదున ఆగు స్వామి మహారాజచే ఆశీర్వాద తీర్థ ప్రసాదాలు 6న కుంకుమార్చన ఏడున గణపతి పూజ పుణ్యాహవాచనము స్వామివారి ఊరేగింపు నగరే డప్పు కళాబృందం వారిచే ప్రదర్శన ఎనిమిదిన శివపార్వతుల కల్యాణోత్సవం 9న అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీడిసి అధ్యక్షుడు రెక్కల గంగారెడ్డి కోశాధికారి దాసరి నాగరాజు తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బద్దం రాజు సురేష్ రుక్మాజి మాజీ ఎంపీటీసీ జల్లేపల్లి గంగాధర్ మాజీ సర్పంచ్ కుస్తాపురం గంగారెడ్డి శ్రీకాంత్ చరణ్ లింగ గౌడ్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు