ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మండల కేంద్రమైన కుంటాలలోని శ్రీకృష్ణ ప్రాచీన దేవాలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా హరి ఓం సత్సంగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మహారాష్ట్రలోని చిక్కిలి గ్రామానికి చెందిన రెడ్డి మహారాజ్ భక్తుల గోపాలు ప్రవచనాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
25, మార్చి 2024, సోమవారం
3, మార్చి 2024, ఆదివారం
ఇస్కాన్ కు తొమ్మిది ఎకరాల మామిడి తోట విరాళము
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన కొండపావులూరి శ్రీనివాసరావు సుభాషిని దంపతులు తమ తొమ్మిదిన్నర ఎకరాల మామిడి తోటను ఇస్కాన్ సంస్థకు విరాళంగా అందజేశారు ఈ తోట విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుంది హైదరాబాదులో వ్యాపారం చేస్తున్న శ్రీనివాసరావు ఎన్నో ఏళ్లుగా శ్రీకృష్ణుడికి భక్తులు హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ సంస్థలు సభ్యునిగాను ఉన్నారు నవీపేట మండలంలోని శాఖాపూర్ గ్రామ జీవ శివారులోని తమ మామిడి తోటను ఆదివారం ఇసుకనుకు అందజేశారు ఈ మామిడి తోటలో త్వరలో ఇస్కాన్ మందిరం వృద్ధాశ్రమం గోషాల ఏర్పాటు అవుతాయని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు అలాగే హనుమాన్ ఫారంలో తమ సొంత డబ్బు లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని శ్రీనివాసరావు తన తండ్రి వెంకటేశ్వరరావు పేరిట విరాళంగా ఇచ్చారు
1, మార్చి 2024, శుక్రవారం
పూరి జగన్నాథ రత్న బాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ
పూరి జగన్నాథ రత్నభాండగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ
ప్రఖ్యాత పూరి క్షేత్రంలోని జగన్నాథ ఆలయంలో అమూల్యమైన ఆభరణాలతో తరతరాలుగా భద్రపరిచిన రత్న భాండాగారంపై కొన్నిళ్లుగా చర్చ జరుగుతుంది మూసి ఉన్న ఈ రత్న భాండాగారం తెరవడానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగిన ఫలించలేదు తాళాలు కూడా అదృశ్యం కావడం తర్వాత అవి లభించడం అనుమానాలకు దారి తీసింది విలువైన ఆభరణాలు ఉన్నాయో ఇంతవరకు జాబితా తయారు కావడం కానీ వాటిని లెక్క కట్టడం కాని జరగలేదు ఈ నేపథ్యంలో రత్న భాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉన్నత స్థాయి కమిటీని నియమించింది సుప్రీంకోర్టు మాజీ జడ్జి అర్జిత్ వర్షాయత్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం వెల్లడించారు అనేక దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఈ రత్న బాండాగారంలోని ఆభరణాలు ఇతర విలువైన వస్తువుల జాబితా తయారు చేయడానికి వాటిని పర్యవేక్షించడానికి ఒడిశా హైకోర్టు ఆదేశాలపై ఈ కమిటీని నెలకొల్పినట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు ఈ కమిటీలు మాజీ సుప్రీం జడ్జి జస్టిస్ అర్జిత్ ప్రశాంత్ తో పాటు ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ రమాకాంత పాండ రైస్ చైర్మన్గా నియామకమయ్యారు అలహాబాద్ బ్యాంక్ మాజీ సీఎం డి డాక్టర్ బిదు భూషణ్ సమల్ చార్టర్డ్ అకౌంటెంట్ ఏకే సభకు పూరి రాజ వంశీకులు గజపతి దివ్య సింగదేవ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధిగా దుర్గాప్రసాద్ దాస్ మహాపత్ర మాధవ చంద్ర మహాపాత్ర జగనాత్కార్ గణేష్ మేకప్ సేవకులుగా పూరీ కలెక్టర్ శ్రీ జగన్నాథ్ ఆలయ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ నియామకమయ్యారు
22, ఫిబ్రవరి 2024, గురువారం
శ్రీకృష్ణుని గుడి నిర్మాణానికి భూమి పూజ
నసురుల్లాబాద్ మండల పరిధిలో మైలారం గ్రామంలో యాదవ శ్రీకృష్ణుని గుడి కోసం భూమి పూజ చేయడంతో బుధవారం యాదవ సంఘం పెద్దమనుషులు నాయకులు భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైలారం సొసైటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్ మాజీ ఎంపిటిసి మహేందర్ బొట్ట రమేష్ యాదవ్ మేకల రాములు యాదవ్ ధార లక్ష్మయ్య యాదవ్ ఆనంద్ యాదవ్ దడిగే పెద్ద గంగారం జరిగే భూమయ్య చింటూ సాయిలు యాదవ సంఘం పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నార
భక్తిశ్రద్ధలతో హోమం
నిజామాబాద్ నగరంలోని శ్రీకృష్ణ గీతా భవన్ వేడుకలలో భాగంగా హోమం ఘనంగా నిర్వహించారు కమిటీ అధ్యక్షులు శని శెట్టి కిషన్ గుప్తా ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ముందుగా భగవద్గీత పారాయణం ఉపనిషత్తు పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం 9 హోమ గుండాలతో నవగ్రహ శాంతి హోమం భగవద్గీత చండీ హోమం మృత్యుంజయ హోమం నిర్వహించారు తిరుపతి లలితా పీఠం స్వరూపానందగిరి ప్రవచనాలు నిర్వహించారు శశికాంత్ జోషి కృష్ణానంద స్వాముల వారు ప్రవచనాలు వినిపించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోటగిరి కిషన్ గుప్తా కోశాధికారి నూకల లక్ష్మీనారాయణ గుప్తా ఉపాధ్యక్షులు కోవూరు గుండయ్య పాల్గొన్నారు
ఘనంగా వేణుగోపాల స్వామి జాతర
మాక్లోర్ మండలంలోని ముల్లంగి బొంకన్పల్లి రెండు గ్రామాల ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి జాతర ఘనంగా నిర్వహించారు ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు పూజలు నిర్వహించే స్వామివారి ఊరేగింపు జరిపారు అనంతరం యజ్ఞం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వీరేందర్రావు వైస్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
15, ఫిబ్రవరి 2024, గురువారం
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీకృష్ణ మందిరం 19వ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెల్లవారుజామున స్వామివారిని తీరకప్పులతో అందంగా అలంకరించి ప్రభాతభేరి ధ్వజారోహణము గోపూజ గీతా పారాయణం స్వామివారికి ప్రత్యేక పూజలు క్షీరాభిషేకం యజ్ఞము గణపతి పూజ పుణ్యాహవాచనము లక్ష్మీ సుదర్శన హోమము మంత్రపుష్పము భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆశ్రమ కమిటీ ప్రతినిధులు వార్షిక నివేదిక నిత్య పూజా పతకాన్ని భక్తులకు వివరించారు సాయంత్రం స్వామివారి పల్లకి సేవ రాత్రి ఆలయంలో భిక్కనూరు రాజంపేట దోమకొండ మండలాలకు చెందిన భజన మండలి సభ్యులతో భజన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు




