మేడారం సమ్మక్క సారక్క జాతర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మేడారం సమ్మక్క సారక్క జాతర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, మార్చి 2024, గురువారం

మేడారం జాతర ఆదాయం 13 కోట్ల 25 లక్షలు

 గత జాతర కంటే కోటి రూపాయల 80 లక్షల ధనం 779 గ్రాముల బంగారం సమర్పించిన భక్తులు ముగిసిన హుండీలు లెక్కింపు

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహా జాతర హుండీల కానుకల ఆదాయం మొట్టమొదటిసారి 13 కోట్ల రూపాయలు దాటింది ఇప్పటివరకు జరిగిన జాతరలో ఇదే అత్యధిక ఆదాయంగా నమోదయింది 2022 జాతర కంటే మరో కోటి రూపాయల 80 లక్షల ఆదాయం పెరిగింది బంగారం వెండి కానుకలు కూడా పెరిగాయి మొత్తంగా వరంగల్లో వారం పాటు నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారం ముగిసింది ఈసారి జాతరలో 540 ఉండి ఏర్పాటు చేశారు ఫిబ్రవరి 29న లెక్కింపు మొదలుపెట్టగా కరెన్సీ నోట్లు నాణేల రూపంలో 13 కోట్ల 25 లక్షల 225100 వచ్చింది 2022 జాతరలో 517 హుండీలు ఏర్పాటు చేయగా 11 కోట్ల 45 లక్షల 34,526 రూపాయలు ఆదాయం వచ్చింది తాజాగా హుండీల ద్వారా 779 గ్రాముల 800 మిల్లి గ్రామంలో బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరాయ్ ఇతర దేశాలకు చెందిన 38 కరెన్సీ నోట్లు రాగా ఇందులో యూఎస్ డాలర్ 20072 కతారి 8 ఆస్ట్రేలియా 6 ఇంగ్లాండ్ 3 సింగపూర్ రెండు నోట్లు వచ్చాయి వీటిని ఫారం ఎక్స్చేంజిలో విలువ కట్టడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంలో కలవాలని ఉన్నట్లు అధికారులు తెలిపారు ఎండోమెంట్ శాఖా సొంత సిబ్బందితోపాటు మరో రెండు వందల మంది వాలంటీర్ల సహాయంతో వారం రోజుల్లో కౌంటింగ్ విజయవంతంగా పూర్తి చేసింది దేవాదాయశాఖ అకౌంట్లో ఉన్న మూడు బ్యాంకుల సిబ్బంది కౌంటింగ్ మిషన్లతో భారం పాటు ఇక్కడే డ్యూటీ చేశారు వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత మేడారం ఈవో రాజేంద్రన్ తెలిపారు




6, మార్చి 2024, బుధవారం

మేడారం జాతర ఆదాయం 12.7 కోట్లు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదాయం 12 కోట్ల 71 లక్షల 79280 రూపాయలు వచ్చింది. గతంలో కన్నా 26 లక్షల 29,5503 రూపాయలు ఎక్కువ వచ్చింది ప్రతి జాతరకు కోటి రూపాయలపైనే ఆదాయం పెరుగుతూ వస్తున్న ఈసారి మాత్రం అలా జరగలేదు. కాగా మేడారం నుండి లెక్కింపు మంగళవారం ముగిసింది భక్తుల నుంచి కానుకగా వచ్చిన ఎనిమిది వందల గ్రాముల బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండిని బ్యాంకులు భద్రపరిచారు

5, మార్చి 2024, మంగళవారం

76 హుండీల ద్వారా 93 లక్షలు

 కొనసాగుతున్న మేడారం హుండీలో లెక్కింపు ఇప్పటివరకు 481 హుండీలలో 11.25 కోట్ల ఇన్కమ్ చివరి దశకు వచ్చిన లెక్కింపు ప్రక్రియ

మేడారం మహా జాతర హుండీ ఆదాయం 11 కోట్ల 25 లక్షలకు చేరుకుంది ఆదివారం నాటికి 45 హుండీలను లెక్కించగా మొత్తం 10 కోట్ల 32 లక్షల మూడువేల రూపాయలు ఆదాయం వచ్చింది సోమవారం మరో 76 హుండీలను లెక్కించడంతో 93 లక్షల 67000 వచ్చాయి దీంతో ఇప్పటివరకు మొత్తం 481 లెక్కింపు పూర్తిగా 11 కోట్ల 25 లక్షల 70000 ఇన్కం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు తిరుగువారం కోసం ఉంచిన 22 హుండీలు సైతం సోమవారం హనుమకొండలోని టీటీడీకి చేరుకున్నాయి మొత్తం ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత మేడారం ఈఓ రాజేంద్రన్ తెలిపారు మేడారం హుండీల లెక్కింపు చివరి దశకు చేరుకుంది మొత్తం 540 ఉండేలా ఏర్పాటు చేయగా ఇంకా 59   హుండీలు లెక్కించాల్సి ఉంది

4, మార్చి 2024, సోమవారం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు

 సమ్మక్క తల్లి మా ఆయన బెట్టింగ్ మానేయాలి మా అక్క కొడుకు ఐఐటీ సీటు రావాలి ఫారిన్ పోవాలి అనుకున్న పిల్లతో పెళ్లి కావాలి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముదిరించాలి చిట్టీలు రాసి వండిలో వేసిన భక్తులు 10 కోట్లు దాటిన జాతర ఆదాయం హుండీలలో బయటపడుతున్న కోరికల చిట్టాలు

మేడారం గుండెలను తెరిచే కానుకను లెక్కిస్తుండగా వాటిలో భక్తుల కోరికల చిట్టాలు చిట్టీలు కుప్పలు తిప్పలుగా బయటపడుతున్నాయి మా ఆయన బెట్టింగ్ మానేయాలి మా అక్క కొడుకు ఐఐటీలో సీటు రావాలి అంటూ ఒక మహిళ కాగితంపై రాసి హుండీలో వేసింది ఫారిన్ పోవాలి అనుకున్న పళ్ళతో పెళ్లి కావాలి అంటూ ఒక యువకుడు సమకతలిని వేడుకుంటూ చిట్టి రాసి హుండీలో వేసిండు. ఈ కోరికల చిట్టిలను చూసి కౌంటింగ్ సిబ్బంది లెక్కింపును పర్యవేక్షిస్తున్న అధికారులు ఆశ్చర్యపోతున్నారు. హనుమకొండ టిటిడి కళ్యాణమండపంలో గురువారం నుంచి మేడారం హుండీలు లెక్కిస్తున్నారు ప్రతి హుండీలోనూ డబ్బు కానుకలతో పాటు ఇలాంటి చిట్టెలు బయటపడుతున్నాయి వీటితో పాటు అంబేద్కర్ ఫోటో ఉన్న నకిలీ వంద రూపాయలు నోట్లు కనిపించాయి వాటిపైన ప్రభుత్వం కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అనే డిమాండ్లు రాసి ఉన్నాయి కోరుకున్న ఉద్యోగం రావాలని కొందరు తమ బిడ్డల పెళ్లిళ్లు అయ్యేలా చూడాలని మరికొందరు వారిని వెళ్లే అవకాశం రావాలని ఇంకొందరు అనుకున్న అమ్మాయితో పెళ్లి కావాలని కొందరు చిట్టిలు రాశారు నాలుగు రోజుల్లో 10 కోట్ల రూపాయలు దాటిన ఆదాయం మేడారం మహా జాతర ఉండేలా కానుకల ఆదాయం పది కోట్ల రూపాయలు దాటింది లెక్కింపు గతానికి భిన్నంగా జెట్ స్పీడ్ తో సాగుతోంది జాతరలో అధికారులు 535 హుండీల ఏర్పాటు చేయగా హనుమకొండ టిటిడి కళ్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి గురు శుక్రవారాలలో 25 25 హుండీల ద్వారా ఆరు కోట్ల రూపాయల 13 లక్షల 75000 శనివారం 112 బాక్సులతో మూడు కోట్ల 46 లక్షల 61,000 కరెంటు రూపంలో ఆదాయం వచ్చింది ఆదివారం 88 హుండీలను తెరవగా 71 లక్షల 67 వేల కరెన్సీ వచ్చింది. దీంతో నాలుగు రోజుల మొత్తం ఆదాయం పది కోట్ల 32 లక్షల మూడు వేలకు చేరింది వచ్చిన మొత్తం ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత మేడారం ఈవో రాజేంద్రన్ తెలిపారు తిరుగువారం కోసం ఏర్పాటు చేసిన గుండెలను సోమవారం టిటిడికే తరలించనున్నట్లు ఆఫీసర్లకు తెలిపారు



3, మార్చి 2024, ఆదివారం

మేడారంలో 317 హుండీల లెక్కింపు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది గురువారం మొదలైన హుండీల లెక్కింపు ప్రక్రియ మరో రెండు రోజులపాటు కొనసాగుతున్నది జాతరలో మొత్తం 518 ఉండి ఉండగా వాటిని వరంగల్కు తరలించి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో భద్రపరిచి గుండెలను లెక్కిస్తున్నారు ఇప్పటివరకు 317 లెక్కించగా 9 కోట్ల 60 లక్షల 36వేల రూపాయలు ఆదాయం సమకూరింది మరో 2001 ఎక్కించాల్సి ఉంది మొదటి రోజున 114 లెక్కించగా మూడు కోట్ల 15 లక్షల 40 వేల రూపాయలు రెండవ రోజున 71 లెక్కించగా రెండు కోట్ల 98 లక్షల 35 వేల రూపాయలు ఆదాయం రాగా మూడవరోజు 112 ఎక్కించగా మూడు కోట్ల 46 లక్షల 61 వేల రూపాయల ఆదాయం వచ్చింది  మిగిలిన రెండు వందల ఒక్క హుండీల లెక్కింపు మరో రెండు రోజులలో పూర్తి కానున్నది

2, మార్చి 2024, శనివారం

రెండు రోజుల మేడారం హుండీల ఆదాయము ఆరు కోట్లకు పైగా

 రెండో రోజు కరెన్సీ కానుకలు రెండు కోట్ల 98 లక్షలు శుక్రవారం తెరిచిన హుండీలు 71 మొత్తం 535 లెక్కించినవి 205

మేడారం మహా జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది రెండో రోజున శుక్రవారం నాటికి ఆదాయం 6 కోట్ల 13 లక్షల 75 వేలకు చేరింది జాతరలో దేవాదాయ శాఖ అధికారులు 535 హుండీలను ఏర్పాటు చేయగా హనుమకొండ టిటిడి కళ్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి మిగతావి తిరుగుబాటు భక్తుల కోసం అక్కడే ఉంచారు గురువారం కౌంటింగ్ ప్రక్రియ మొదలవగా మొదటి రోజు 134 హుండీలలో మూడు కోట్ల 15 లక్షల 40000 ఇండియన్ కరెన్సీ వచ్చింది రెండో రోజున శుక్రవారం మధ్యాహ్నం నాటికి సమ్మక్క తల్లి గద్దె వద్ద ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు పూర్తయింది తర్వాత సార్లమ్మ హుండీలతో కలిపి 71 హుండీలను తెరవగా రెండు కోట్ల 98 లక్షల 35వేల రూపాయల ఆదాయం వచ్చింది మొత్తంగా రెండు రోజుల్లో ఆరు కోట్ల 13 లక్షల 75 వేల రూపాయలు వచ్చిందని అకౌంట్లో జమ చేశామని ఎండోమెంట్ ఆఫీసర్లు పేర్కొన్నారు



29, ఫిబ్రవరి 2024, గురువారం

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

 


మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు

గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ బందోబస్తు మధ్యన లెక్కింపు ప్రక్రియ మొదలైంది దేవాదాయ రెవిన్యూ శాఖల సిబ్బంది స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో  లెక్కింపు జరుగుతుంది

హుండీలో బంగారు తాళిబొట్లు ఫారిన్ కరెన్సీలతో పాటు ఫేక్ నోట్లను కూడా భక్తులు కానుకలుగా వేశారు 518 హుండీలలో ఒక్కో హుండీని ఓపెన్ చేస్తూ లెక్కిస్తున్నారు అనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను గురువారం ఎండోమెంట్ పోలీస్ మేడారం పూజారులు ప్రారంభించారు హుండీలలో విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటు చిల్లర కాయిన్స్ ను భక్తులు భారీగా వేశారు టన్నులకొద్దీ ఒడిబియ్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు కాగా మొదటి రోజు మూడు కోట్ల రూపాయల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపార మొదటిరోజు ఆదాయాన్ని అధికారులు ఎండోమెంట్ అకౌంట్ లో జమ చేశారు లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ డిప్యూటీ అడిషనల్ కమిషనర్లు శ్రీకాంతరావు సునీత పర్యవేక్షిస్తున్నారు

బంగారు భరిణలు వెండి ఉయ్యాలలు జాతరలో  చాలామంది భక్తులు తమ మొక్కులలో భాగంగా బంగారు వెండి ఆభరణాలను హుండీలలో వేశారు లెక్కింపు సమయంలో ప్రతి బాక్సులు బంగారు తాళిబొట్లు కుంకుమ భరణి కడియాలు బయటపడుతున్నాయి వెండితో చేసిన ఊయలలు సమ్మక్క సారలమ్మ తల్లుల కన్నుల రూపాలు నాగుపాము ముద్రలు ఇంటి బొమ్మలు తదితరాలు కానుకలుగా వచ్చాయి వాటిని ప్రత్యేక హుండీలో వేసి తాళాలు వేసి భద్రపరిచారు జాతరకు వచ్చిన కొందరు విదేశీ భక్తులతో పాటు ఇతర దేశాలకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన తెలంగాణ భక్తులు కూడా మొక్కల క్రింద ఫారిన్ కరెన్సీని హుండీలలో కానుకలుగా సమర్పించారు ఇలాంటి వందల కొద్ది నోట్లు బయటపడుతున్నాయి మరికొందరు భక్తులు డాన్స్ చేసిన పాత 500 రూపాయల నోట్లు వేశారు 2000 రూపాయల నోట్లు కూడా వేశారు అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన 100 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు హుండీలలో కనిపించాయి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని ఆ నోట్లపై రాశారు కదా మేడారం జాతరలో మొత్తం 535 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు 518 హుండీలు పూర్తిగా నిండాయి ఇందులో 482 ఐరన్ 34 క్లాత్ రెండు కోడి బియ్యం హుండీలు ఉన్నాయి ఇంకా తెలుగు వారం హుండీలు మండపానికి చేరుకోలేదు గురువారం 134 హుండీలను తెరిచారు

లెక్కింపు సిబ్బందికి డ్రెస్ కోడ్ కానుకల లెక్కింపులో మొత్తం 400 మంది సిబ్బంది పాల్గొన్నారు వీరిని మహిళా కానిస్టేబుల్ తో చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు లెక్కింపులో పాల్గొనేవారు చేతివాటం ప్రదర్శించకుండా అధికారులు సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేశారు మెయిన్ డోర్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటుచేసి తనిఖీలు చేశారు కానుకల రూపంలో వచ్చిన కరెన్సీని బ్యాంకర్లు తీసుకువచ్చిన కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు అమ్మవార్ల కానుక లెక్కించడానికి గతంలో రెండు వారాల సమయం పట్టగా ఈసారి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు

చిల్లర లెక్కింపు కోసం మిషన్లు జాతరలో భాగంగా భక్తులు వేసిన చిల్లర నాణేలతో చిన్నచిన్న డ్రమ్ములు నిండుతున్నాయి అయితే చిల్లర నాణేల లెక్కింపు అధికారులకు తలనొప్పిగా మారేది అయితే ఈసారి కాయిన్స్ లెక్కించడానికి ప్రత్యేకంగా మిషన్లు తయారు చేయించారు కాయిన్ సైజు ఆధారంగా నాణేలను ఆ మిషన్లను వేయగానే అవిసెపరేట్ అవుతున్నాయి దీంతో లెక్కించడానికి సులభం అవుతుంది. గతంలో భారీ మొత్తంలో వస్తున్న రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణేలను వేరుచేసి లెక్కించడానికి అదనంగా నాలుగు అయిదు రోజులు సమయం పట్టేది అదే సమయంలో భక్తులు మొక్కల రూపంలో వేసిన పచ్చని ఓడిబియ్యాన్ని జల్లెడ సాయంతో వేరు చేసి బస్తాల్లో నింపుతున్నారు



ఘనంగా తిరుగువారం ముగిసిన మేడారం

 మేడారం మహా జాతర ముగిసింది అత్యంత వైభవంగా కొనసాగిన జాతర బుధవారం తిరుగు వారం పండుగతో ముగిసింది ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం వనదేవతలకు వడ్డెలు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు గద్దెలు గ్రామంలోని గుడిని శుద్ధి చేశారు ఆడపడుచులు అలుకు పూతలతో రంగురంగుల ముగ్గులు వేసి అమ్మవార్ల గద్దెలను అందంగా అలంకరించారు డోలు వాయిద్యాలు నడుమ తల్లులకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు తిరుగుబారం రోజున కూడా తల్లులు ఇక్కడే కొలువుదీరి ఉంటారని నమ్మకంతో భక్తులు మేడారానికి పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తల్లులకు బంగారాన్ని సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు ఫిబ్రవరి 7న గుడి మెలిగే పండుగతో మొదలై 14న మండలిగే పండుగ 21 22 తేదీల్లో నా వనదేవతలు గద్దెలకు చేరడం 23న భక్తుల మొక్కులు 24న వనప్రవేశం కార్యక్రమాలు జరిగాయి



26, ఫిబ్రవరి 2024, సోమవారం

హనుమకొండకు మేడారం హుండీలు

 మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగియడంతో జాతర సమయంలో లక్షలాదిమంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా గద్దెల ప్రాంతంలో ఏర్పాటు చేసిన హుండీలో తల్లులకు సమర్పించిన కానుకలను లెక్కించడానికి దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సోమవారం ఆర్టిసి కార్గో బస్సులలో 512 హుండీలను హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజేంద్ర మాట్లాడుతూ ఈనెల 29 నుంచి హుండీల లెక్కింపు పకడబందీగా చేపట్టనున్నట్లు తెలిపారు



25, ఫిబ్రవరి 2024, ఆదివారం

తరలి వెళ్లిన వన దేవతలు

 


ముగిసిన మేడారం మహా జాతర వచ్చే బుధవారం తిరుగు వారం పండుగ

మేడారం మహా జాతర శనివారం రాత్రి దేవతల వన ప్రవేశం తో ముగిసింది నాలుగు రోజులుగా భక్తులకు దర్శనాలు ఇచ్చిన దేవతలను ఆదివాసి పూజారులు సంప్రదాయ బద్దంగా వన ప్రవేశం చేయించారు పూజారులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి సారాలమ్మను కన్నెపల్లి ఆలయంలో గోవిందరాజులు ఏటూరునాగారం మండలం కొండాయిలోని ఆలయంలో తిరిగి ప్రతిష్టించారు పగిడిద్దరాజుతో పూజారులు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల కు రాత్రి కాలినడకన బయలుదేరారు 60 కిలోమీటర్ల దూరం కొనసాగే వీరి పాదయాత్ర ఆదివారం ఉదయం చేరుకుంటుంది అత్యంత కీలకమైన సమ్మక్క వాన ప్రవేశం ఘట్టం శనివారం రాత్రి జరిగింది చిలకలగుట్ట వైపు బయలుదేరిన అమ్మకు మంత్రి సీతక్కతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కలెక్టర్ పార్టీ ఎస్పీ శబరి ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం పూజారిలో కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు వనంలోకి తీసుకెళ్లి వన ప్రవేశం ఘట్టాన్ని ముగించారు దీనితో ప్రధాన జాతర పరిసమాప్తమైనది ఈనెల 28న తిరుగువారం పండగ నిర్వహించనున్నారు జాతరకు వచ్చిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించార

సమ్మక్క సారలమ్మలకు ఈనెల 28న పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు మహా జాతర ముగిసిన తర్వాత ఇలా తిరుగువారం పండుగ సంప్రదాయ బద్దంగా నిర్వహిస్తామని జాతరకు వచ్చిన భక్తులు చల్లంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటామని పూజారులు తెలిపారు తిరుగువారం పండుగ సందర్భంగా బుధవారం మేడారం గ్రామస్తులు ఆదివాసీలు పూజారుల కుటుంబీకులు ఇళ్లకు ఇళ్ళను అలికి శుద్ధి చేస్తారు సమ్మక ప్రత్యేక పూజలు చేస్తారు మేడారంలోని సమ్మక్క కనేపల్లిలోని సరళమ్మ గుడి వద్ద అమ్మవార్లను దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటారు పూజారులు జాతర సమయంలో తమకు ఆహ్వానించిన బంధువులకు కొత్త వస్త్రాలు పెట్టి సాగనంపుతాడు మేడారం మహా జాతర తిరిగి 2026 మాఘమాసంలో జరగనున్నది

గద్దెని వీడి వన ప్రవేశం చేసినది ఇలా

ఐదు గంటల పది నిమిషములకు గోవిందరాజులు, ఐదు గంటల 30 నిమిషములకు పగిడిద్దరాజు, ఏడు గంటల 27 నిమిషములకు సమ్మక్క వన ప్రవేశం, 740 నిమిషములకు సారలమ్మ వన ప్రవేశం.

 ఆనవాయితీ ప్రకారం తోలుతగా గోవిందరాజులు పగిడిద్దరాజులను గద్దెల మీద నుంచి సాగనంపుతారు వారు వెళ్లగానే సమ్మక్క వన ప్రవేశ కార్యక్రమం ఉంటుంది చివరిగా సార్లలమ్మని తీసుకెళ్తారు.




24, ఫిబ్రవరి 2024, శనివారం

తల్లుల వద్దకు తండోప తండాలుగా జనం

 జనసంద్రంలో మహా జాతర. నేడు దేవతల వన ప్రవేశం. చివరి అంకానికి చేరిన మహోత్సవం.

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శుక్రవారం కోలాహారంగా జరిగింది. జాతరలో మూడో రోజు దేవతలను గద్దెలపై కొలువు తీరడంతో భక్తకోటి దర్శనాలకు బారులు తీరారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి తల్లుల దర్శనానికి తరలివచ్చారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రముఖులు కూడా రావడంతో సాధారణ దర్శనానికి రెండు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఎత్తు బంగారాల మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రైవేటు వాహనాలు మేడారానికి రావడంతో ములుగు జిల్లా తడువాయి మేడారం మధ్యలో సాయంత్రం ట్రాఫిక్ స్తంభించింది. శనివారం పౌర్ణమి కావడం, జాతర తుది ఘట్టానికి చేరను ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసి పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్ళనున్నారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణతో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజారులు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది .అమ్మలను దర్శించుకున్న భక్తకోటి మేడారంలో సమ్మక్క సారలమ్మలను శుక్రవారం రాత్రి వరకు ఒక కోటి 20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సాయంత్రం గద్దెల వద్ద భక్తు ల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆమె మంచె పై ఎక్కి అక్కడి నుంచి భక్తులకు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి జాతర ముందు వరకు 50 లక్షల మంది జాతర సమయంలో 70 లక్షల మంది భక్తులు  అమ్మలను దర్శించుకున్నారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇంత పెద్ద జాతరను కేంద్రం కుంభమేళాకు సమానంగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు .శుక్రవారం అమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే జాతరకు కావలసిన సదుపాయాలకు ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించాలని సూచించినట్లు ఆమె వెల్లడించారు. జాతర ముగిసిన వెంటనే మేడారంలో అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి సీఎం ద్వారా రాహుల్ గాంధీ కి అంది  స్తామని వివరించారు.



23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమ్మక్క దర్శనం భక్తజన పరవశం

 మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గజ్జపై కొలువు తీరడంతో మేడారం మురిసిపోయింది చిలకలగుట్ట మీద నుంచి కుంకుమ భరణి రూపంలో అమ్మను ఆదివాసి పూజారులు తీసుకొచ్చే ఘట్టం ఆద్యంతం భరితంగా సాగింది ఇప్పటికే శారదమ్మ సహా వనదేవతలంతా కొలువుదీరి ఉండడం భక్తులు పెద్దమ్మగా కొలిచే సమ్మక్క కూడా గత పైకి చేరడంతో జాతరకు నిండితనం వచ్చింది మూడుసార్లు కాల్పులతో ఘన స్వాగతం సమ్మక్క ఆగమైన ఘట్టం గురువారం మొత్తం కొనసాగింది తెల్లవారుజాముని మేడారానికి సమీపంలోని పడిగాపూర్ సమీపంలోని అడవికి వెళ్ళిన పూజారిన ఎదురుగా ఊరేగింపుగా గద్దెల వద్దకు చేర్చారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పూజారులు సిద్దపోయిన మునీందర్ మహేష్ లక్ష్మయ్య జగ్గారావు వడ్డే కొక్కెర కృష్ణయ్య తదితరులు చిలకలగుట్ట పైకి వెళ్లి రహస్య పూజలు నిర్వహించారు చిలకలగుట్ట మీద నుంచి కిందికి వచ్చే సమయంలోనే సమ్మక్కని దర్శించుకునేందుకు తండోపతండాలుగా జనం తరలివచ్చారు. ఆ తల్లి రాక కోసం వేయి కళ్ళతో వేచి చూశారు. మంత్రి సీతక్క దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ కలెక్టర్ త్రిపాఠి దనప కలెక్టర్ శ్రీజ ఉత్సవ కమిటీ చైర్మన్ అల్లం లచ్చు పటేల్ ముఖ్య అధికారులు నిర్వహణ కమిటీ సభ్యులు సాయంత్రం నాలుగు గంటల నుంచి గుట్ట కింద వేచి ఉన్నారు. సాయంత్రం పూజా క్రితువులు పూర్తయ్యాక 650 ఒక్క నిమిషములకు పూజారులు బుట్ట దేవతుండగా ఎస్పి శబరిష్ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్క వైభవంగా స్వాగతం పలికారు అమ్మవారి ఊరేగింపు గుట్ట దిగిన తర్వాత మరోసారి గాల్లోకి  కాల్పులు జరిపారు అందమైన ముగ్గుల మధ్య అమ్మవారి ఊరేగింపు చిలకాల గుట్ట కింద నుంచి గద్దెల వరకు దాడి దారి పొడవున భక్తులు వేసిన అందమైన ముగ్గుల మధ్య అమ్మ వారి ఊరేగింపు కొనసాగింది చలపెయ్య చెట్టు వద్దనుకున్న పూజా మందిరంలో ఊరేగింపులు ఆపి అమ్మవారికి కాసేపు విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో మరోసారి ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు ధూపదీప నైవేద్యాలు సమర్పించాక మళ్ళీ మొదలైన ఊరేగింపు మేడారం గజ్జల వరకు కొనసాగింది ఈ క్రమంలో దారికి ఇరువైపులా వేలాదిగా బారులు తీరిన భక్తులు జై సమ్మక్క అంటూ జయ జయ ద్వారాలు చేశారు ఎదురుకోళ్లు సమర్పిస్తూ నిండుకుండలతో నీలారబోస్తూ హారతులు పట్టారు పూజారులు గద్దెల వద్దకు చేరుకునే ముందు క్యూ లైన్లను నిలిపివేశార

రాత్రి 9 గంటల 23 నిమిషాల సమయంలో డోలి వాయిద్యాలతో జాతర ప్రాంగణమంతా దద్దరిల్లుతుండగా భక్తిపారవేశంలో మహిళలు నూతనలు చేస్తుండగా పుణ్య గడియల్లో సమ్మక్క అమ్మవారిని పూజారిని గద్దె పైన ప్రతిష్టించారు.

22, ఫిబ్రవరి 2024, గురువారం

సారలమ్మ ఆగమనం పులకించే మేడారం

 







భక్తకోటి జయజయ ద్వారా మధ్య మేడారం మహా జాతర బుధవారం ప్రారంభమైనది మొదటి రోజు కీలక ఘటమైన సారాలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది కన్నెపల్లి నుంచి సరళమ్మ అమ్మవారిని ఆదివాసి పూజారులు డోలు వాయిద్యాలతో తోడుకొని వచ్చి పెద్దలపై ప్రతిష్టించారు పగిడిద్దరాజు గోవిందరాజులను గద్దెలపై కొలువు తీర్చారు సరళమ్మను కొలువు తీర్చే క్రతువు ఉదయమే ప్రారంభమైంది అంతకన్నా ముందు కన్నెపల్లికి చెందిన ఆడపడుచులు మేడారం గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు వేశారు సాయంత్రం 5 గంటలకు మంత్రి సీతక్క తో పాటు కలెక్టర్ త్రి పార్టీ ఎస్పీ శబరి కన్నేపల్లి చేరుకున్నారు అక్కడి ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం ఏడు గంటల 41 నిమిషాలకు సార్లమ్మ ప్రతిరూపమైన మంటతో పూజారులు మేడారం బయలుదేరారు దీవెనల కోసం ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో వరం పట్టిన మహిళలు భక్తులు ముత్యాలతో సరళమ్మకు స్వాగతం పలికారు వేల మంది ఆదివాసి యువత భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవునా రక్షణ కల్పించారు కన్నెపల్లి వాసుల అమ్మవారికి మంగళ హారతులు సమర్పించారు ఆదివాసీలు సంప్రదాయ దుస్తులతో ముత్యాలు చేస్తూ అమ్మవారిని అనుసరించారు

ఊరేగింపు జంపన్న వాగు దాటే ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు అక్కడి నుంచి ఊరేగింపు నేరుగా మేడారంలోని సమ్మక్క ఆలయం వద్దకు చేరుకోగా అక్కడి పూజారులు ఆహ్వానం పలికారు పూజలు నిర్వహించిన అనంతరం అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు గోవిందరాజులతో కలిసి చారలమ్మను గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చారు ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషముల తర్వాత గద్దెలపై ప్రతిష్టించారు.

జాతర మొదటి రోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి రాష్ట్రం తో పాటు ఏపీ చత్తీస్గడ్ మహారాష్ట్ర నుంచి జనం తరలి రావడంతో మేడారం పరిసరాలు వనమా జనమా అన్నంతగా మారిపోయాయి వేల మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్ లోకి కిరిసిపోయాయి కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం మేడారానికి రానున్నట్లు అధికారులు తెలిపారు

నేడు సమ్మక్క ప్రతిష్ట జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం గురువారం జరగనుంది చిలకలగుట్ట పైనుంచి కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికారాలు లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించనున్నారు సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు

పెద్దల దగ్గర వరకు బస్సులు సజ్జన మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులు ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు బస్సులు అమ్మవార్ల గద్దెలకు కత్తి సమీపం వరకు వెళతాయని తెలిపారు మహాలక్ష్మి పథకంతో జాతరకు వచ్చే ప్రయాణికులు గణనీయంగా పెరుగుతారని అనుగుణంగా 6000 బస్సులు నడుపుతున్న వారికి సౌకర్యం కలగకూడదని ఏ నిర్ణయం తీసుకున్నామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


అమ్మలను స్మరిస్తూ తరిస్తూ

 మేడారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది భక్తి భావంతో పులకరించి పోతోంది జయ జయ దానాలతో మారుమోగుతోంది అటు జంపన్న వాగులో స్నానాలు ఇటు అమ్మల దర్శనానికి బారులు తొలిరోజు బుధవారం ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైనది గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు జంపన్నలు భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నార

అమ్మవార్ల దర్శనానికి లక్షలాదిగా తరలివస్తున్నారు దర్శనాలు కొనసాగుతున్నాయి ఇండియన్ అగ్రిటెక్ సంస్థ లక్ష్యనీటి సీసాలు స్వచ్ఛందంగా భక్తులకు అందజేసింది మేడారంలో మంత్రి దాన్సరి అనసూయ సీతక్కచేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు మేడారంలో పర్యావరణం దెబ్బతినకుండా కాలుష్య నియంత్రణ మండలి వ్యర్ధాలు చెత్త నిర్వహణ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయల పై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది కేంద్ర జౌళి శాఖ హరిత హోటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన కళలు చేతివృత్తుల ప్రదర్శనను మంత్రి సీతక్క ప్రారంభించారు పెద్ద సంఖ్యలో చిన్నారులు పెద్దలు తప్పిపోతున్నారు వీరిని గుర్తించేందుకు తప్పిపోయిన వ్యక్తుల గుర్తింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు


21, ఫిబ్రవరి 2024, బుధవారం

సమ్మక్క సారలమ్మ జాతరకు వేళాయె




 జాతరకు ప్రత్యేక బస్సులు

 తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర లోపల కొన్ని భక్తులు సందర్శకుల కోసం రాష్ట్ర పర్యాటక సంస్థ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది నాలుగు రోజుల పాటు ఉదయం 6:30 గంటలకు సికింద్రాబాద్ యాత్రి నివాస్ బషీర్బాగ్ సెంటర్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి ఏసీ నాన్ ఏసీ వోల్వో బస్సులు బయలుదేరుతాయని పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ నాయుడు తెలిపారు ఈ బస్సుల్లో వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినట్లు వివరించారు దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో పర్యాటకులకు వరంగల్ వేయి స్తంభాల గుడి పరిసర ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు తెలుగు ప్రయాణంలో రాత్రి పదిన్నర గంటలకు హైదరాబాద్ చేరుకోవచ్చని అన్నారు ఒక రోజులోని దర్శనం పూర్తిచేసుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పర్యటన ప్రత్యేక బస్సులను వినియోగించుకోవచ్చని సూచించారు మేడారం జాతర బస్సులో చార్జీలు ఈ విధంగా ఉన్నాయి పెద్దలకు 1800 రూపాయలు పిల్లలకు 1440 ఏసీ మినీ బస్సులో కైతే పెద్దలకు 1600 రూపాయలు పిల్లలకు 1280 నాన్ ఎసి బస్సులోనైతే పెద్దలకు 1200 రూపాయలు పిల్లలకు 950 రూపాయలు ఛార్జీలుగా నిర్ణయించారు.





తల్లుల రాక కోసం ముస్తాబైన మేడారం నేడు కన్నెపల్లి వెన్నెల సారలమ్మ పూసుకుండ్ల నుంచి పగిడిద్దరాజు కొండాయి నుంచి గోవిందరాజుల రాక సమ్మక్క సారలమ్మ తల్లి రాకకు విస్తృత ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క




కోట్లాదిమంది భక్తుల కొంగుబంగారం ఆదివాసీల ఇలవేల్పులు భక్తికి విశ్వాసాలకు ప్రతీకైన మేడారం సమ్మక్క సారలమ్మ ప్రధాన జాతరకు సరళమ్మ రాకతో అంకురార్పణ జరుగుతోంది తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం తల్లుల రాక కోసం ముస్తాబయింది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర నాగ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తారు ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తడువాయి మండలం మేడారంకు గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర విశ్వవ్యాప్తమైంది మన దేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా తో పాటు యావత్ భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు ఈసారి మేడారం జాతరకు రెండు కోట్ల మంది భక్తులు వచ్చి తల్లులను దర్శించుకోబోతున్నారు అందుకు అనుకూలంగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది తల్లులు కొలువుదీరే మేడారంతో పాటు కన్నెపల్లిలోని సార్లమ్మ గుడి గళ్ళలోని పగిడిద్దరాజు గుడి కొండాయిలోని గోవిందరాజుల గుడిని అందంగా ముస్తాబు చేశారు తల్లులు రాకకు సంబంధించిన ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆదివాసి సంప్రదాయాలకు వివాదం కలగకుండా అన్నింటిని అధికారులకు ఎక్కడికి అక్కడ సూచనలు చేస్తూ తానే స్వయంగా వెళుతున్నారు

కన్నెపల్లి నుంచి సారలమ్మ

మేడారం గ్రామానికి పశ్చిమ వైపున జంపన్న వాగుకు అవతల ఉన్న కన్నెపల్లి గ్రామంలోని సారాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలను సరళమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య నేతృత్వంలో సారలమ్మను ఆదివాసి గిరిజన సంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు బుధవారం సాయంత్రం పూజా కార్యక్రమాలు అనంతరం సరళమ్మను తన తల్లి సమ్మక్క వద్దకు పంపిస్తారు కన్నెపల్లిలోని ప్రతి గడప తొక్కుతూ అందరి అనుమతితోనే మేడారం వెళ్తుండగా చీర శారీలతో పాటు పసుపు కుంకుమ ఇచ్చి సాగనంపుతారు కన్నెపల్లి నుంచి వస్తూ మార్గమధ్యంలో సంపెంగ వాగు జంపన్న వాగు వద్ద తమ్ముడు జంపన్న ముద్దాడుతూ ప్రశ్నలతో ఒకరినొకరు పలకరింపులు చేసుకుంటూ తన బాగోగులు తల్లి సమ్మక్క తండ్రి పగిడిద్దరాజుకు చెప్పమంటూ జంపన్న అక్క సారల అమ్మకు చెప్పి సాధారణంగా సాగనంపుతారు సారలమ్మ గద్దెపై కొలువు తీరడంతో జాతర ప్రారంభమవుతుంది

ఆడబిడ్డ రాక కోసం భక్తుల ఎదురుచూపులు


  ఆదివాసీల ఆరాధ్య దైవమైన  సమ్మక్క సారలమ్మల జాతరలో భక్తుల కొంగుబంగారంగా కన్నెపల్లి వెన్నెలగా పిలిచే ఆదివాసీల ఆడబిడ్డ సారలమ్మ రాక కోసం మేడారం ఎదురుచూస్తోంది సారాలమ్మను కన్నెపల్లి నుంచి నడచ్ వస్తున్న గా కనులారా చూడాలని భక్తులు వేల కళ్ళతో ఎదురుచూస్తున్నారు 

పునుగండ్ల నుంచి పగిడిద్దరాజు

సమ్మక్క గద్దల పైకి రాకకు ముందే   పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగండ్ల గ్రామం నుండి పగిడిద్దరాజు ప్రధాన పూజారులు వెనక రాజేశ్వర్ పెనక సురేందర్ ఆధ్వర్యంలో సోమవారం బయలుదేరి కాలినడకన వస్తున్నారు గోవిందరావుపేట మండలం కర్లపల్లి వద్ద బస చేసి వేలు బాగా పడిగాపూర్ పరిసరాలకు చేరుకుంటారు సార్ ఎల్లమ్మ గద్దెలపై కొలువు తీరడానికి ముందే వచ్చి పగిడిద్దరాజు గద్దెలపై కొలువు తీరుతారు 


కొండాయి నుంచి గోవిందరాజులు


ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలోని గోవిందరాజుల ఆలయంలో ప్రధాన పూజారి దెబ్బ గట్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం ఉదయమే ప్రారంభమై సాయంత్రానికి కొండాయి నుంచి అడవి మార్గం నుంచి కాలినడకని తీసుకొచ్చి వచ్చిండా మేడారంలోని గద్దెపై ప్రతిష్టిస్తారు

తల్లుల రాక కు విస్తృత ఏర్పాట్లు 


ఫిబ్రవరి 21 నుంచి జరిగే ప్రధాన జాతరకు ప్రభుత్వం అధికారం విస్తృత ఏర్పాట్లు చేశారు మేడారంలోని సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం కన్నెపల్లి నుంచి పగిడిద్దరాజును కొండాయ నుంచి గోవిందరాజులను తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గురువారం సమ్మక్కొని తీసుకొచ్చి ఎందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు జాతరలో ఆదివాసి గిరిజన సంప్రదాయాలకు ఎక్కడ విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ములుగు జిల్లా కలెక్టర్ నాగారం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు జాతరలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాతర సజావుగా సాగేందుకు గతంలో జాతరలో పనిచేసిన ఇద్దరు సీనియర్ అధికారులు ఆర్మీ కృష్ణా ఆదిత్య అభిలాష సురభి రంగారెడ్డి జిల్లా అదన కలెక్టర్ ప్రతిమ సింగ్ హనుమకొండ అదనపు కలెక్టర్ రాధిక గుప్తాను నియమించారు

తెలుగులో రాకలో భాగస్వామ్యం అవుతున్న మంత్రి సీతక్క

  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తున్న మంత్రి సీతక్క  దగ్గర ఉండి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ పకిడిత రాజు గోవిందరాజులను తీసుకువచ్చే సందర్భంలో అన్ని ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పూజ కార్యక్రమాలలో పాల్గొని దగ్గరుండి తీసుకొచ్చేవారు ఈసారి జాతర కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి హోదాలో సీత కన్నీటిని తానే స్వయంగా నిర్వహిస్తున్న విషయం తెలిసింది రెండు రోజులు ముందుగానే సీతక్క గంగారం మండలం పూనుగండ్ల నుంచి పకిడిత రాజు తీసుకురావడానికి వెళ్లారు అక్కడ పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే బుధవారం ఏటూరు నాగారం మండలం కొండయి కూడా వెళ్లి  . అక్కడ పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే బుధవారం ఏటూరునాగారం మండలం కొండాయి కూడా  వెళ్లి గోవిందరాజుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోవిందరాజులను తీసుకొస్తారు బుధవారం కన్నెపల్లి గ్రామం నుంచి సార్లమ్మ గుడిలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని దగ్గరుండి తీసుకొస్తారు గురువారం కూడా చిలకలగుట్టపై నుంచి సమ్మక్క గద్దల పైకి తీసుకొచ్చి ప్రధాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొంటారు.



1946లో ఆదాయం 17వేల రూపాయలు మాత్రమే

ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఆదాయం స్వాతంత్రానికి ముందటి ఏడాది 1946వ సంవత్సరంలో రూపాయలు 17173 1958లో రెవెన్యూ రికార్డులో చేరిన ఈ జాతరను సుమారు 100 ఏళ్ల క్రితం నిజాం ప్రభుత్వం గుర్తించింది అప్పటికే 15,000 మందికిపైగా భక్తులు తల్లులు దర్శించుకునే వారట అప్పటి జనాభాతో పోలిస్తే అతి ఎక్కువ సంఖ్యలో హాజరైనట్టే కదా నిజాం పోషణ్ సోషల్ సర్వీస్ డిపార్ట్మెంట్ జాతరను పర్యవేక్షించగా 10 ఎకరాల భూమిని జాతర కోసం కేటాయించి ములుగు తహసిల్దార్ ద్వారా భక్తులకు సౌకర్యాలు కల్పించేవారు జంపన్న వాగుతోపాటు మల్లన్న గుంట చెరువును భక్తులు వినియోగించుకునేవారు అప్పటికి జాతర బయ్యక్కపేటలోని జరిగేది ములుగు తహసిల్దార్ అనుమతితో నియమించిన కమిటీ జాతర ఆదాయ వ్యాయాలతో పాటు జాతరలో పనిచేసిన వారి వాటాలను నిర్ణయించేది పెద్ద తాటి మొద్దులను గద్దెల చుట్టూ పాతి ప్రజలను కట్టడం చేసేవారు భక్తులు హుండీలు అనా పైసలకంటే ఎక్కువ వేసేవారు కాదు మొక్కుబడులకే ప్రాధాన్యం ఉండేది దీంతో జాతర నిర్వహించడం కోయ గిరిజనులకు కష్టమైంది పీవీ నరసింహారావు హయాంలో 1970లో జాతరను దేవాదాయ శాఖ పరిధిలో చేర్చారు రోజుకు 14 రూపాయలు ఇస్తూ అక్కడి ఉపాధ్యాయులని వాలంటీర్లుగా నియమించేవారు 1980లో బాపురెడ్డి కలెక్టర్గా ఉన్న సమయంలో విశేష ప్రచారం లభించిన మేడారం జాతరను 1996లో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర జాతరగా గుర్తించింది ప్రస్తుతం ఈ జాతర ప్రపంచానికి ఆకర్షణీయంగా మారింది
అరచేతిలో మేడారం ఈసారి జాతరలో ఆధునిక టెక్నాలజీ వినియోగం ద్రోన్లతో భక్తుల రద్దీ ట్రాఫిక్ పర్యవేక్షణ మై మేడారం గైడ్ యాప్ లు అన్ని విశేషాలు సమాచారం మార్కెట్కి ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు సమస్య తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు
తెలంగాణ కుంభమేళా గిరిజన ఆదివాసి జాతర ఆయన మేడారం జాతర ఈ ఏడాది ఆధునిక టెక్నాలజీతో అరచేతిలో ఇమిడిపోతుంది గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పోలీసులు వివిధ విభాగాల అధికారులు స్మార్ట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు జాతర సమయంలో ఎక్కడ ఏమి జరిగినా వెంటనే తెలిసిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నారు గద్దెల వద్ద భక్తుల రద్దీ ప్రైవేట్ వాహనాల రాకపోకలు ట్రాఫిక్ జామ్ కాకుండా క్రమబద్ధీకరణ పార్కింగ్ స్థలాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా నెట్వర్క్ రూపొందించుకున్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సమ్మక్క సారలమ్మల దర్శనం సాఫీగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలుపుతున్నారు ఈసారి జాతరలో వినియోగిస్తున్న టెక్నాలజీ ప్రత్యేకతలను ఒకసారి గమనించినట్లయితే సీసీ కెమెరాలు నిజాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతర పరిసరాలు 500 సీసీ కెమెరాలు 15 డ్రోన్లు రాకెట్ల ద్వారా భక్తుల రద్దీ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు సీసీ కెమెరాలు గద్దెలకు సమీపంలోని ఐటీడీఏ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు ఇక్కడ నుంచి అధికారులు పర్యవేక్షణ చేస్తుంటారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అందుబాటులో ఉంటాయి జాతరలో ఎనిమిది జోన్లుగా 42 సెక్టార్స్గా విభజించి ప్రతి జోన్లు నోడల్ అధికారి జోనల్ అధికారి సెక్టోరల్ అధికారి విధుల్లో ఉంటారు సమ్మక్క సారలమ్మ వెబ్సైట్ ప్రారంభమయ్యే నాటి నుంచి ముగిసే వరకు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయని వివరాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని మేడారం జాతర వెబ్సైట్లో పొందుపరిచారు 21న బుధవారం సారాలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెకు రావడం గురువారం సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరడం శుక్రవారం మొక్కులు శనివారం తల్లుల వన ప్రవేశం కార్యక్రమాలను చూసుకోవచ్చు జాతర ఫోటోలు సమాచారాన్ని సైట్లో పొందుపరిచారు ఫోటో గ్యాలరీలు మీడియా సమాచారం అందుబాటులో ఉంటుంది భక్తుల రద్దీ వాహనాల రాకపోకలను డ్రోన్ కెమెరాల ద్వారా గమనించి వాహనాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ద్విచక్ర వాహనాల ద్వారా నిరంతరం గస్తీ నిర్వహిస్తూ వాహనాలను నిర్మిత పార్కింగ్ ప్రదేశాలకు మళ్ళి ఇస్తున్నారు
భక్తులకు రహదారులు పార్కింగ్ స్థలాలు తల్లుల గద్దెల ప్రాంగణ సమాచారం క్షణంలో తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కలెక్టర్ ఆధ్వర్యంలో మహిమేడారం గైడ్ యాప్ ను రూపొందించారు ఈ యాప్ ఆన్లైన్ ఆఫ్లైన్లోనూ పని చేస్తుంది. స్మార్ట్ఫోన్ ప్లే స్టోర్ లోకి వెళ్లి మై మేడారం గైడ్ యాప్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలాంటి సమాచారం ఎంటర్ చేయకుండానే ఇది జిపిఎస్ ద్వారా లొకేషన్ షేరింగ్ తో పని చేస్తుంది. తాగునీటి సౌకర్యం ఉన్నచోటు మీకు ఎంత దూరంలో ఉందో చూపెడుతుంది వైద్యం పార్కింగ్ మూత్రశాలలు మరుగుదొడ్లు స్నాన ఘట్టాలు తప్పిపోయిన వారి సమాచార కేంద్రాలు అగ్నిమాపక శాఖ సర్వీసులు ఇలా సమస్త సమాచారం ఈ యాప్ ద్వారా పొందవచ్చు గతంలో రూపొందించిన యాప్ కు భిన్నంగా మై మేడారం గైడ్ యాప్ ను తయారు చేశరు
.


19, ఫిబ్రవరి 2024, సోమవారం

మేడారం రూట్ మ్యాప్

 







పగిడిద్దరాజు మేడారం పయనం

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యావల గడ్డ నుంచి సమ్మక్క భర్త ఇలవేల్పు పగిడిద రాజు మేడారం పైన మయ్యాడు ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పగిడిద్దరాజును వంశీయులు తీసుకెళ్లడం అనవాయతి సోమవారం పకిడిత రాజు గర్భగుడి వద్ద పడగలు జెండాలు ఆభరణాలకు వడ్డేలు ప్రత్యేక పూజలు చేశాక గద్దెలపైకి చేర్చారు మంగళవారం సాయంత్రం వరకు మేడారంలోని జంపన్న వాగు వద్దకు కాలినడకన చేరుకుని అక్కడే బసు చేస్తారు బుధవారం కొండాయిగూడెం నుంచి వచ్చే గోవిందరాజు కన్నెపల్లి నుంచి వచ్చే సారాలమ్మతో పాటు పగిడిద్దరాజును గద్దెల పైకి చేరుస్తారు జంపన్న వాగుకు చేరిన లక్నవరం నీళ్లు మేడారం జాతరకు వచ్చే భక్తులు పుణ్యా స్నానాలు చేసేందుకు వీలుగా లక్నవరం నుంచి నీటిని విడుదల చేయగా సోమవారం జంపన్న వాగు కు చేరుకుంది శివసత్తులు జంపన్న వాగులో మునిగి పూనకాలతో ఊగిపోయారు అందులో స్నానం చేస్తే సర్వరోగ పోతాయని భక్తుల విశ్వాసం




మేడారం జనసంద్రం

 సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఆదివారం లక్షరాది మంది భక్తుల రాకతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి సమీపంలో పెద్ద ఎత్తున గుడారాలు వెలిశాయి జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు తల్లులను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ దర్శించుకున్నారు గత రెండు నెలల కాలంలో 50 లక్షల మంది భక్తులు మేడారం సందర్శించినట్లు ఎస్పీ తెలిపారు

గైడ్ గా మై మేడారం యాప్ అందుబాటులో వసతుల వివరాలు యాప్ ఆవిష్కరించిన మంత్రి సీతక్క కలెక్టర్

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు జాతర సౌకర్యాలు చరిత్ర గురించి ఆన్లైన్లో సెల్ ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం మై మేడారం యాప్ను అందుబాటులోకి తెచ్చింది ఇది భక్తులకు ఓ గైడ్గా పని చేయనుంది నాటి ఎడ్ల బండి నుంచి గాలి మోటార్ వరకు వచ్చిన సౌకర్యాలతో పాటు ఈనెల 21 నుంచి 24 వ తేదీ వరకు జరిగే జాతర విశేషాలు ముఖ్యమైన ఘట్టాల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ మేరకు శనివారం మంత్ర సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్టిపి శబరిష్ మై మేడారం యాప్ను ఆవిష్కరించారు ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా మై మేడారం గైడ్ 2024 అనే పేరుతో అందుబాటులో ఉంటుంది యాప్ ద్వారా జాతరలోని తాగునీటి కేంద్రాలు వైద్య శిబిరాలు పార్కింగ్ ప్రాంతాలు మరుగుదొడ్లు స్నాన ఘట్టాల వివరాలు తప్పిపోయిన వారి కోసం మైకుల ద్వారా పిలిచే కేంద్రాలు ఫైర్ ఇంజన్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు

జంపన్న వాగు చరిత్ర కలిగిన సమ్మక్క తనయుడు సారాలమ్మ తమ్ముడు జంపన్నకు ప్రభుత్వ లాంఛనాలతో జాతర నిర్వహించడం జంపన్న వాగు జాతరలో ప్రత్యేక ఆదరణ కలిగి ఉంది భక్తులు ముందుకు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించాక తల్లులు దర్శనానికి వెళ్తారు సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజులకు మాత్రమే దేవాదాయ శాఖ అధికారులు జాతర నిర్వహిస్తున్న నేపథ్యంలో తడవాయి మండలం కన్నెపల్లికి చెందిన పోలిబోయిన సత్యం ఆయన తమ్ముడు శ్రీనివాస్ కుమారుడు సురేష్ కలిసి సుమారు రెండు లక్షలకు పైగా ఖర్చులతో జంపాలని సంపెంగ వాగు బొడ్డున గద్దెపై చేర్చి జాతర నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించి జంపన్న జాతరను నిర్వహించాలని పోలేబోయిన వంశీయులు కోరుతున్నారు జంపన్న రాకతోనే జాతర షురూ మేడారం మహా జాతర ప్రారంభానికి ముందు జంపన్నను పోలేకపోయిన వంశీయులు గద్దెకు తీసుకురావడం మనవాయితీ 2024 మహా జాతరకు ఫిబ్రవరి 20న మంగళవారం సాయంత్రం జంపన్న గద్య పైకి చేరనున్నాడు ఆ తర్వాత 21న సార్ వాళ్ళ అమ్మ 22న సమ్మక్క దేవతలు గద్దెకు చేరుకుంటారు జంపన్న గద్యం చేరాక బుధవారం సార్లమ్మ జంపాలని పలకరించుకుంటూ వాగు నీళ్లలో నడుచుకుంటూ గద్ద పైకి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది




18, ఫిబ్రవరి 2024, ఆదివారం

గిరిజన జాతరకు హెలికాప్టర్

 నేడు సేవల షురూ హనుమకొండ నుంచి అందుబాటులోకి మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యటకశాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ టాక్సీ హెలికాప్టర్ ను నడుపుతుంది ఈ సేవలు నేటి ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి అనుమకొండలోని సెయింట్ గాబ్రియల్ స్కూల్ మైదానం నుంచి మేడారం వరకు సేవలందిస్తుంది. చార్జీలు ఇలా ఒక్కో ప్యాసింజర్ అప్ అండ్ డౌన్ కు విఐపి దర్శనం 289 రూపాయలు జాతరలో ఏరియల్ రైడ్ ఒక్కొక్కరికి 4,800 బుకింగ్ ఇలా హెలికాప్టర్ టికెట్ బుకింగ్ ఇతర వివరాల కోసం 7483433752 అండ్ 9400399 999సెల్ నెంబర్లలో సంప్రదించవచ్చు ఆన్లైన్లో

Info@helitaxi.com  ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు ఈ సేవలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యాటక శాఖ పర్యవేక్షణలో కొనసాగుతాయి



భక్తుల ఇంటికి బంగారం

 ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకు చేరవేత ఈనెల 25 వరకు అవకాశం

ఆదిలాబాద్ రీజియన్ లోని డిపోల ఎగ్జిక్యూటివ్ లో నంబర్లు ఆదిలాబాద్ ఉట్నూర్ 9154298531 నిర్మల్ బైంసా 9154298547 ఆసిఫాబాద్ 9154298547 మంచిర్యాల 9154298541,9154298552,9154298553