వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల తిరుపతికి పోటెత్తతున్న భక్తుల రద్దీని టీటీడీ సమర్థంగా ఎదుర్కొంటుంది. ఒకప్పుడు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో పడిగాపులు కాసిన సామాన్య భక్తులు ఇప్పుడు ఏడు ఎనిమిది గంటలలోనే స్వామిని దర్శించుకుంటున్నారు .వీఐపీ బ్రేక్, సిఫార్సులేఖల రద్దు, కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ద్వారా క్యూ లైన్ ల నిరంతర పర్యవేక్షణతో టిటిడి ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సర్వదర్శనానికి వచ్చే భక్తుల నిరీక్షణ సమయం 8 గంటల దాటకుండా అధికారులు చర్యలు చేపట్టారు .ఒక దర్శనం కోసం మరో స్లాట్ దర్శనాన్ని ఆపకుండా ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ,సిసి కెమెరాలు ద్వారా ఎప్పటికప్పుడు మాడవీధులు, క్యూ కాంప్లెక్స్ లను పర్యవేక్షిస్తున్నారు. స్లాటేడ్ సర్వదర్శనం రెండు నుంచి మూడు గంటల లోపు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండున్నర గంటల లోపు పూర్తవుతుంది .శనివారం లక్ష మందికి పైగా భక్తులు వచ్చినప్పటికీ దర్శన సమయం 13 గంటలకు మించకుండా అదుపు చేయగలిగారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
6, మే 2026, బుధవారం
3, మే 2026, ఆదివారం
శ్రీవారి దర్శనానికి 14 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కావడంతో పాటు వారాంతం కావడంతో తిరుమల వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది .శ్రీవారి ఆలయ ప్రాంతంలో పాటు మాడవీధులు, లడ్డు కేంద్రం ,అఖిల అండం, ప్రధాన కూడళ్లు ,రిసెప్షన్ కౌంటర్లు, కళ్యాణ కట్టలు రద్దీగా కనిపిస్తున్నాయి. కాలినడక మార్గాలలో రద్దీ తగ్గలేదు .వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు లోని 31 కంపార్ట్మెంట్లు ,నారాయణ గిరిలోని తొమ్మిది షెడ్లు నిండిపోయి క్యూ లైన్ శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయం మధ్య వరకు వ్యాపించింది. వీరికి దర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతుంది.
తిరుపతిలో రెడ్డి భవనం నిర్మాణానికి కోటి రూపాయలు
తిరుపతిలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవన నిర్మాణం కోసం పి పి రెడ్డి గ్రూపు చైర్మన్, యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పన్నాల పర్వతాలు రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. రెడ్డి సంఘం ప్రతినిధులు మురళీకృష్ణారెడ్డి, మల్రెడ్డి రామిరెడ్డి ,వినయ్ కుమార్ రెడ్డి, గూడూరు నరోత్తం రెడ్డి, కొలను మహేందర్ రెడ్డి తదితరులు సమక్షంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వారు పర్వతాల రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అఖిల భారత రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో అధునాతన సౌకర్యాలతో ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవనం నిర్మించనున్న విషయం తెలిసింది.
2, మే 2026, శనివారం
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆ లయం శుక్రవారం రాత్రి వైశాఖమాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి వారు గరుడనిపై ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు .పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సి వి ఎసవో మురళీకృష్ణ ,తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఆలయ పేష్కార్ లోకనాథం, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రవేశాలు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026 27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగేండ్ల డిప్లమా ,రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సులకు ఈనెల 4 నుండి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు .పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు .దరఖాస్తులను కళాశాలలో నేరుగా పొందవచ్చు .పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20వ తేదీ సాయంత్రంలోగా అందజేయాలి. ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టిటిడి లక్ష రూపాయలను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి కోర్సు పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా స్వయం ఉపాధి అవసరాల నిమిత్తం అందజేస్తుంది. వివరాలకు శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ టిటిడి, అలిపిరి రోడ్డు ,తిరుపతి.. ఫోన్ నెంబర్ 0877 2264637 ను సంప్రదించాలి. వెబ్సైట్ www.tirumala.org
తిరుమలలో సర్వదర్శనానికి 14 గంటలు
తిరుమలేష్ ని సర్వదర్శనానికి శుక్రవారం భక్తుల రద్దీ పెరిగినది. శుక్రవారం సాయంత్రానికి టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగరి షెడ్లు నిండిపోయాయి .దీనితో స్వామివారి దర్శనానికి 14 గంటలు పట్టనున్నది. విఐపి బ్రేక్ దర్శనాలు, తిరుపతిలో స్లాటేడ్ సర్వదర్శనాలు ,టోకెన్లు రద్దుచేసి తిరుమలలోని సర్వదర్శనానికి అనుమతించడంపై ఈనెల 6న ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
9 నుంచి తిరుచానూరు నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
నాందేడ్ నుంచి తిరుచానూరు నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ అయిన తర్వాత.. మొదటిసారిగా ఆ ఎక్స్ప్రెస్ రైలు 17633 ఈనెల 9వ తదీన నిజామాబాద్ పెద్దపల్లి మీదుగా నడవనున్నది. 10న తిరుచానూరు నాందేడ్ 17634 ఎక్స్ప్రెస్ నడుస్తుంది దీనికి సంబంధించిన ఉత్తర్వును దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం విడుదల చేశారు.
1, మే 2026, శుక్రవారం
పుష్కరిణి నీటితో శ్రీవారి చిత్రం
పుష్కరిణి నీటితో శ్రీవారి చిత్రం.. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక యువకుడు గురువారం నాడు తన కళా ప్రతిభతో భక్తిని వ్యక్తం చేశాడు. తమిళనాడులోని తిరువూరుకు చెందిన మోహన్ ప్రభువు అనే భక్తుడు గత పది సంవత్సరాలుగా పెయింటింగ్ చేస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు.
శ్రీవారి పుష్కరిణి నీటిని ఉపయోగించి సుమారు మూడు గంటల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ వాటర్ పెయింటింగ్ రూపొందించాడు. అతని భక్తిని కళా నైపుణ్యాన్ని చూసిన పలువురు భక్తులు ప్రశంసించారు.
27, మార్చి 2024, బుధవారం
శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
వాహన సేవలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ దంపతులు
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మల్లప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయం మాడవీధుల్లో వివా విహరించి భక్తులను కటాక్షించారు గరుడ వాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్ట్ ఎన్వి రమణ శివమాల దంపతులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో శ్రీ చిన్న జీయర్ టీటీడీ న్యాయాధికారి వై వీర్రాజు జిల్లా ప్రోటోకాల్ న్యాయమూర్తి ఎం గురునాథ్ ప్రోటోకాల్ మున్సిపన్ న్యాయమూర్తి పి కోటేశ్వరరావు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు
25, మార్చి 2024, సోమవారం
శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ
శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను 22 మంది చిత్రకారులు వేయగా దీన్ని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పేరుతో తిరుపతికి చెందిన శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పుస్తకంగా రూపొందించింది ఈ పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గీసిన బొమ్మ కూడా ఈ పుస్తకంలో ఉండడం ఆ దేవదేవుడి కృపయా అన్నారు కాకా బ్రహ్మానందం ఆదివారం ఉదయం బిజెపి బ్రేకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు
ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుమలలో ఐదు రోజులపాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి చివరి రోజు రాత్రి శ్రీ మల్లప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నాలుగు మాడవీధులలో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తిప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మల్లప్ప స్వామి వారి ఆశీనులై పుష్కరణలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు వేద పారాయణం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తిప్పోత్సవమ్ నేత్రపర్వంగా సాగింది
22, మార్చి 2024, శుక్రవారం
వేడుకగా రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి తెప్పోత్సవం
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండో రోజు గురువారం రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి వారు తిప్పలపై భక్తులకు అభయం ఇచ్చారు ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడవీధులలో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తిప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరణలో ముమ్మార్లు వివరిస్తూ భక్తులను కటాక్షించారు వేదంగానం నాదం మధ్య అతిపోత్సవం వేడుకగా జరిగింది మూడోరోజు శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వారు తిరుచిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై ముమ్మార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు
24 25 తేదీలలో తుంబూరు తీర్థ ముక్కోటి
తిరుమల శ్రీ తుంబూరు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24 తేదీలలో ఘనంగా జరగనుంది తీర్థానికి విశేషంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ఇందులో భాగంగా తుమ్మూరు తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు 25వ తేదీ ఉదయం ఐదు నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు పాప వినాశనం వద్ద భక్తులకు అల్పాహారం అన్న ప్రసాదాలు తాగునీరు అందిస్తారు ప్రథమ చికిత్స కేంద్రాలు అంబులెన్స్ మందులు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండడంతో గుండే శ్వాస పోష సమస్యలు స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు భక్తులు వంట సామాగ్రి కర్పూరం అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది పోలీసు అటవీశాఖ టిటిడి విభాగం సమన్వయంతో భద్రత చర్యలు చేపట్టనున్నారు
19, మార్చి 2024, మంగళవారం
రేపటి నుంచి సాలకట్ల తిప్పోత్సవాలు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తిప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 24 వరకు జరగనున్నాయి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరణలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇస్తారు తెప్పోత్సవాలు తొలిరోజు బుధవారం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమీపంగా శ్రీరామచంద్రమూర్తి తిప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు ఇక రెండో రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు మూడవరోజు శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వారు మూడుసార్లు పుష్కరణీ నీ చుట్టూ భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా శ్రీ మల్లప్ప స్వామి వారు నాలుగో రోజు ఐదు సార్లు చివరి రోజు 24న ఏడుసార్లు తిప్పపై పుష్కరణలో విహరించి భక్తులను కటాక్షిస్తారు ఈ తిప్పోత్సవాల కారణంగా ఈనెల 2021 వ తేదీలలో సహస్ర దీపాలంకార సేవ 22 23 24వ తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది
18, మార్చి 2024, సోమవారం
భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్లు జారీ
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసింది దీనితో వీఐపీ భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమలలోని జేఈవో కార్యాలయం రేణిగుంట విమానాశ్రయంలో 10500 చెల్లించిన వారికి శ్రీవాణి టికెట్లు అపరిమితంగా ఇస్తున్నట్లు అనధికార సమాచారం ఉన్నతాధికారుల ఆదేశాలతో తిరుమల జేఈవో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వరకు 72 విమానాశ్రయంలో 175 టికెట్లు జారీ చేశారు
17, మార్చి 2024, ఆదివారం
తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించరు
ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టిటిడి వీఆర్వో విభాగం తెలిపింది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శనివారం నుంచి తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధి విధానాల మేరకు దర్శనం వసతి కల్పిస్తామని తెలిపింది
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్ శనివారం దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు
14, మార్చి 2024, గురువారం
జూన్ నెల తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కోటా విడుదల 18న
జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి హర్షిత సేవలు దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 18న సోమవారం ఉదయం 10:00 నుంచి 20న ఉదయం పదింటి వరకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది. లక్కీ డిప్ టికెట్లు పొందిన భక్తులు ఈనెల 22 మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది ఈనెల 21వ తేదీ ఉదయం పదింటికి కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ముంజలు సేవ సహస్ర దీపాలు అంక దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు పై సేవలు వర్చువల్ సేవ టికెట్లు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు జూన్ 19 నుంచి 21 వరకు జరగనున్న జేష్ఠభిషేకంలో పాల్గొనేందుకు 21న ఉదయం పదింటికి టికెట్లను అందుబాటులో ఉంచుతారు 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదులకోట విడుదల చేస్తారు మధ్యాహ్న 3 గంటలకు వృద్ధులు దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు 25న ఉదయం పదింటికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు టీటీడీ వెబ్సైట్లోనూ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది
Ttdevasthanams.ap.gov.in
10, మార్చి 2024, ఆదివారం
20 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తిప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 24 వ తేదీ వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరణీలో స్వామి అమ్మవార్లు విహరిస్తూ భక్తులను కనువిందు చేయనున్నారు తిప్పోత్సవాలలో తొలిరోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమీపంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరణీయులు మూడు చెట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు 21న రుక్మిణి సమేతంగా శ్రీ కృష్ణ స్వామి తిప్పలపై మూడుసార్లు విహరిస్తారు 22న శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు మూడు సార్లు పుష్కరిణి చుట్టూ చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదే విధంగా శ్రీ మలయప్ప స్వామి వారు 23న 5 సార్లు చివరి రోజు మార్చి 24వ తేదీ 7 సార్లు తిప్పపై పుష్కరణలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. కాగా తెప్పోత్సవాల కారణంగా ఈనెల 20 21 తేదీలలో సహస్ర దీపాలంకార సేవ ఈనెల 22 23 24 తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది
5, మార్చి 2024, మంగళవారం
శ్రీశైలం మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు
స్థలం ఇస్తే 200 గదుల భవనం కడతాం అంటున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి గారు
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున సమర్పించడం సంగతి తెలిసిందే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నాలుగో రోజైన సోమవారం మయూర వాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం మయూర వాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు శివ స్వాములతో శ్రీశైలం పోటెత్తింది భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం టిటిడి ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టిటిడి దేవస్థానం తరఫున 200 గదుల భవనం కడతామని ప్రకటించారు క్షేత్రంలో టీటీడీ సత్రం పాత పడడంతో వాటిని ఆధునికరిస్తామని చెప్పారు
3, మార్చి 2024, ఆదివారం
తిరుపతి లడ్డు ధరలు తగ్గించేది లేదు
డయల్ యువర్ ఈవోలో ధర్మారెడ్డి వెల్లడి
తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు లడ్డు బరువు పరిమాణం ఏమాత్రం తగ్గలేదని రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తుడు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు దీనికి ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఉచితంగా అందిస్తున్నామని బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలలో తప్ప మిగిలిన సమయంలో భక్తులు కావలసినవి లడ్డూలు కొనుగోలు చేసుకోవచ్చు అని సూచించారు
26, ఫిబ్రవరి 2024, సోమవారం
తిరుమలలో ఇక నిత్య సంగీతార్చన
తిరుమల కాలినడక భక్తులకు నిత్య సంకీర్తన అర్చన
టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయము
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల కోసం నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు స్థానిక అన్నమయ్య భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు తీర్మానాలను ఈవో ధర్మారెడ్డి తో కలిసి చైర్మన్ వెల్లడించారు అలిపిరి తిరుమల కాలినడక మార్గంలోని గాలిగోపురము ఏడవ మైలు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము మోకాళ్ళ మెట్టు వద్ద కళాబృందాలతో నిరంతరం సంకీర్తన అర్చన తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్యసంకీర్తనర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపార
శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయల విగ్రహాలు ఉన్న గుడి తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు తాపడంతో కొత్తవి ఏర్పాటు
శ్రీవారి వివాహ కానుకగా నాలుగు కోట్ల రూపాయలతో మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు 7 డిజైన్లలో తయారు చేసేందుకు నాలుగు ప్రముఖ బంగారు ఆభరణాలు తయారీ సంస్థలకు అనుమతి
చిన్నారులలో ధార్మిక నైతిక విలువలు పెంచడంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు తమిళం కన్నడ హిందీ ఆంగ్ల భాషలలో 98 లక్షల కాపీల ముద్రణకు మూడు కోట్ల 72 లక్షల రూపాయలు మంజూరు
తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు పై టీటీడీ రేటు వేసింది టీటీడీ ప్రభుత్వము అహోబిలం మఠము అర్చకులు జీయర్లపై రమణ దీక్షితులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్న టిటిడి నుంచి ఆయనను తొలగిస్తూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు పెంచుతూ పలక మండలి నిర్ణయం తీసుకున్నది శ్రీవారి ఆలయంలోని జయ విజయ ల వద్ద ఉన్న తలుపులకు ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు కాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు గాలిగోపురము ఆంజనేయస్వామి విగ్రహము మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకనుంచి నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు 4 కోట్ల రూపాయలతో నాలుగు ఐదు పది గ్రాముల తాళిబొట్టుల తయారీకి పాలకమండలి నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది ప్రతిఏటా ఫిబ్రవరి 24వ తేదీన టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు






