తిరుమల శ్రీవారి సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తిరుమల శ్రీవారి సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2024, బుధవారం

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

 వాహన సేవలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ దంపతులు

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మల్లప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయం మాడవీధుల్లో వివా విహరించి భక్తులను కటాక్షించారు గరుడ వాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్ట్ ఎన్వి రమణ శివమాల దంపతులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో శ్రీ చిన్న జీయర్ టీటీడీ న్యాయాధికారి వై వీర్రాజు జిల్లా ప్రోటోకాల్ న్యాయమూర్తి ఎం గురునాథ్ ప్రోటోకాల్ మున్సిపన్ న్యాయమూర్తి పి కోటేశ్వరరావు శ్రీవారి  ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు




25, మార్చి 2024, సోమవారం

శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ

 శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను 22 మంది చిత్రకారులు వేయగా దీన్ని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పేరుతో తిరుపతికి చెందిన శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పుస్తకంగా రూపొందించింది ఈ పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గీసిన బొమ్మ కూడా ఈ పుస్తకంలో ఉండడం ఆ దేవదేవుడి కృపయా అన్నారు కాకా బ్రహ్మానందం ఆదివారం ఉదయం బిజెపి బ్రేకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు

ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

 తిరుమలలో ఐదు రోజులపాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి చివరి రోజు రాత్రి శ్రీ మల్లప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నాలుగు మాడవీధులలో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తిప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మల్లప్ప స్వామి వారి ఆశీనులై పుష్కరణలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు వేద పారాయణం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తిప్పోత్సవమ్ నేత్రపర్వంగా  సాగింది

22, మార్చి 2024, శుక్రవారం

వేడుకగా రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి తెప్పోత్సవం

 తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండో రోజు గురువారం రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి వారు తిప్పలపై భక్తులకు అభయం ఇచ్చారు ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడవీధులలో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తిప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరణలో ముమ్మార్లు వివరిస్తూ భక్తులను కటాక్షించారు వేదంగానం నాదం మధ్య అతిపోత్సవం వేడుకగా జరిగింది మూడోరోజు శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వారు తిరుచిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై ముమ్మార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు

24 25 తేదీలలో తుంబూరు తీర్థ ముక్కోటి

తిరుమల శ్రీ తుంబూరు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24 తేదీలలో ఘనంగా జరగనుంది తీర్థానికి విశేషంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ఇందులో భాగంగా తుమ్మూరు తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు 25వ తేదీ ఉదయం ఐదు నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు పాప వినాశనం వద్ద భక్తులకు అల్పాహారం అన్న ప్రసాదాలు తాగునీరు అందిస్తారు ప్రథమ చికిత్స కేంద్రాలు అంబులెన్స్ మందులు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండడంతో గుండే శ్వాస పోష సమస్యలు స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు భక్తులు వంట సామాగ్రి కర్పూరం అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది పోలీసు అటవీశాఖ టిటిడి విభాగం సమన్వయంతో భద్రత చర్యలు చేపట్టనున్నారు



19, మార్చి 2024, మంగళవారం

రేపటి నుంచి సాలకట్ల తిప్పోత్సవాలు

 తిరుమలలో శ్రీవారి సాలకట్ల తిప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 24 వరకు జరగనున్నాయి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరణలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇస్తారు తెప్పోత్సవాలు తొలిరోజు బుధవారం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమీపంగా శ్రీరామచంద్రమూర్తి తిప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు ఇక రెండో రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు మూడవరోజు శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వారు మూడుసార్లు పుష్కరణీ నీ చుట్టూ భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా శ్రీ మల్లప్ప స్వామి వారు నాలుగో రోజు ఐదు సార్లు చివరి రోజు 24న ఏడుసార్లు తిప్పపై పుష్కరణలో విహరించి భక్తులను కటాక్షిస్తారు ఈ తిప్పోత్సవాల కారణంగా ఈనెల 2021 వ తేదీలలో సహస్ర దీపాలంకార సేవ 22 23 24వ తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది



18, మార్చి 2024, సోమవారం

భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్లు జారీ

 ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసింది దీనితో వీఐపీ భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమలలోని జేఈవో కార్యాలయం రేణిగుంట విమానాశ్రయంలో 10500 చెల్లించిన వారికి శ్రీవాణి టికెట్లు అపరిమితంగా ఇస్తున్నట్లు అనధికార సమాచారం ఉన్నతాధికారుల ఆదేశాలతో తిరుమల జేఈవో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వరకు 72 విమానాశ్రయంలో 175 టికెట్లు జారీ చేశారు

17, మార్చి 2024, ఆదివారం

తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించరు

 ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టిటిడి వీఆర్వో విభాగం తెలిపింది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శనివారం నుంచి తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధి విధానాల మేరకు దర్శనం వసతి కల్పిస్తామని తెలిపింది

తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్ శనివారం దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు



14, మార్చి 2024, గురువారం

జూన్ నెల తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కోటా విడుదల 18న

 జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి హర్షిత సేవలు దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 18న సోమవారం ఉదయం 10:00 నుంచి 20న ఉదయం పదింటి వరకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది. లక్కీ డిప్ టికెట్లు పొందిన భక్తులు ఈనెల 22 మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది ఈనెల 21వ తేదీ ఉదయం పదింటికి కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ముంజలు సేవ సహస్ర దీపాలు అంక దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు పై సేవలు వర్చువల్ సేవ టికెట్లు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు జూన్ 19 నుంచి 21 వరకు జరగనున్న జేష్ఠభిషేకంలో పాల్గొనేందుకు 21న ఉదయం పదింటికి టికెట్లను అందుబాటులో ఉంచుతారు 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదులకోట విడుదల చేస్తారు మధ్యాహ్న 3 గంటలకు వృద్ధులు దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు 25న ఉదయం పదింటికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు టీటీడీ వెబ్సైట్లోనూ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది

Ttdevasthanams.ap.gov.in

10, మార్చి 2024, ఆదివారం

20 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

 తిరుమలలో శ్రీవారి సాలకట్ల తిప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 24 వ తేదీ వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరణీలో స్వామి అమ్మవార్లు విహరిస్తూ భక్తులను కనువిందు చేయనున్నారు తిప్పోత్సవాలలో తొలిరోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమీపంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరణీయులు మూడు చెట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు 21న రుక్మిణి సమేతంగా శ్రీ కృష్ణ స్వామి తిప్పలపై మూడుసార్లు విహరిస్తారు 22న శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు మూడు సార్లు పుష్కరిణి చుట్టూ చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదే విధంగా శ్రీ మలయప్ప స్వామి వారు 23న 5 సార్లు చివరి రోజు మార్చి 24వ తేదీ 7 సార్లు తిప్పపై పుష్కరణలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. కాగా తెప్పోత్సవాల కారణంగా ఈనెల 20 21 తేదీలలో సహస్ర దీపాలంకార సేవ ఈనెల 22 23 24 తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది

5, మార్చి 2024, మంగళవారం

శ్రీశైలం మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు

 స్థలం ఇస్తే 200 గదుల భవనం కడతాం అంటున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి గారు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున సమర్పించడం సంగతి తెలిసిందే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నాలుగో రోజైన సోమవారం మయూర వాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం మయూర వాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు శివ స్వాములతో శ్రీశైలం పోటెత్తింది భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం టిటిడి ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టిటిడి దేవస్థానం తరఫున 200 గదుల భవనం కడతామని ప్రకటించారు క్షేత్రంలో టీటీడీ సత్రం పాత పడడంతో వాటిని ఆధునికరిస్తామని చెప్పారు

3, మార్చి 2024, ఆదివారం

తిరుపతి లడ్డు ధరలు తగ్గించేది లేదు

 డయల్ యువర్ ఈవోలో ధర్మారెడ్డి వెల్లడి

తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు లడ్డు బరువు పరిమాణం ఏమాత్రం తగ్గలేదని రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తుడు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు దీనికి ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఉచితంగా అందిస్తున్నామని బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలలో తప్ప మిగిలిన సమయంలో భక్తులు కావలసినవి లడ్డూలు కొనుగోలు చేసుకోవచ్చు అని సూచించారు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

తిరుమలలో ఇక నిత్య సంగీతార్చన

 తిరుమల కాలినడక భక్తులకు నిత్య సంకీర్తన అర్చన

టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయము

తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల కోసం నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు స్థానిక అన్నమయ్య భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు తీర్మానాలను ఈవో ధర్మారెడ్డి తో కలిసి చైర్మన్ వెల్లడించారు అలిపిరి తిరుమల కాలినడక మార్గంలోని గాలిగోపురము ఏడవ మైలు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము మోకాళ్ళ మెట్టు వద్ద కళాబృందాలతో నిరంతరం సంకీర్తన అర్చన తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్యసంకీర్తనర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపార

శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయల విగ్రహాలు ఉన్న గుడి తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు తాపడంతో కొత్తవి ఏర్పాటు

శ్రీవారి వివాహ కానుకగా నాలుగు కోట్ల రూపాయలతో మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు 7 డిజైన్లలో తయారు చేసేందుకు నాలుగు ప్రముఖ బంగారు ఆభరణాలు తయారీ సంస్థలకు అనుమతి

చిన్నారులలో ధార్మిక నైతిక విలువలు పెంచడంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు తమిళం కన్నడ హిందీ ఆంగ్ల భాషలలో 98 లక్షల కాపీల ముద్రణకు మూడు కోట్ల 72 లక్షల రూపాయలు మంజూరు


తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు పై టీటీడీ రేటు వేసింది టీటీడీ ప్రభుత్వము అహోబిలం మఠము అర్చకులు జీయర్లపై రమణ దీక్షితులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్న టిటిడి నుంచి ఆయనను తొలగిస్తూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు పెంచుతూ పలక మండలి నిర్ణయం తీసుకున్నది శ్రీవారి ఆలయంలోని జయ విజయ ల వద్ద ఉన్న తలుపులకు ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు కాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు గాలిగోపురము ఆంజనేయస్వామి విగ్రహము మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకనుంచి నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు 4 కోట్ల రూపాయలతో నాలుగు ఐదు పది గ్రాముల తాళిబొట్టుల తయారీకి పాలకమండలి నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది ప్రతిఏటా ఫిబ్రవరి 24వ తేదీన టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

 శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి శనివారం దర్శించుకున్నారు ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి టీటీడి అధికారులు స్వాగతం పలికారు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు.



19, ఫిబ్రవరి 2024, సోమవారం

22న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం

 ఈనెల 22వ తేదీన తిరుపతి శ్రీనివాస మంగాపురం లని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టిటిడి అధికార వర్గాలు తెలియజేశాయి

తిరుమల శ్రీవారి ఆర్చిత సేవా టికెట్ల మే నెల కోటాను సోమవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనున్నది సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టిటిడి అధికారులు తెలిపారు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార కళ్యాణోత్సవం ఊంజల సేవ వర్చువల్ సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లు మధ్యాహ్నం   మూడు గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మే నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టిటిడి వెల్లడించింది మే నెల గదిలో కోటాను 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం రెండు గంటలకు పరకామణి సేవ టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

మే నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోట రేపు విడుదల

 



తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 19న ఉదయం 10 గంటలకు తిథి ఆన్లైన్లో విడుదల చేయనుంది సేవా టికెట్ల డిప్ కోసం ఈనెల 21న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు అదేరోజు లక్కీ డిప్ పొందిన టికెట్లు పొందిన భక్తులు మధ్యాహ్నం 12 గంటలకు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది ఈనెల 22న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లు మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ జారీ చేస్తారు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదులకోట మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోట విడుదల చేస్తారు 24న ఉదయం 10 గంటలకు మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్ల కోట మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదిలో బుకింగ్ విడుదల చేస్తారు మే 27న ఉదయం 11 కు తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోట మధ్యాహ్నం 12 కు నవనీత సేవా కోట మధ్యాహ్నం రెండు గంటలకు పరకామణి సేవా కోట విడుదల చేస్తారు సేవా టికెట్లు వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది

Ttdevasthanams.ap.gov.in


15, ఫిబ్రవరి 2024, గురువారం

రథసప్తమికి తిరుమలలో ఏర్పాట్లు

 


మినీ బ్రహ్మోత్సవాలుగా పిలవబడే రథసప్తమి వేడుకలను ఇప్పటికే తిరుమలగిరిలు ముస్తాబయ్యాయి రేపు ఉదయం నుంచి రాత్రి వరకు సప్తగిరి చూడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేయనున్నారు ఈ వాహన సేవలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తిరుమలకు తరలి రానున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో తిరువీధులలో గ్యాలరీలలో పలుచోట్ల భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు ఉదయం నుంచి రాత్రి వరకు వాహన సేవలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు గంటకొకసారి గ్యాలరీల వద్దకే అన్నపానీయాలు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఆలయం ఆడవీధుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా దాదాపు 300 మందికి పైగా సిబ్బందిని నియమించే గ్యాలరీలలోని ఏర్పాట్లను నిరంతరం మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు రేపు వేకువ జామున 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సంబరంభం రాత్రి 9 గంటలకు ముఖ్య అని ఉంది శ్రీనివాసులు తొలివాహనంగా సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇస్తారు అటు తర్వాత వరుసగా చిన్న శేష వాహనం గరుడ వాహనం హనుమంత వాహనం జరుగుతుంది మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య శ్రీవారి పుష్కరణలు చక్రత్ వరకు చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి ఇలా ఒకేరోజు శ్రీనివాసుడు సప్త వాహనాలపై విహరిస్తూ భక్తులను కరుణిస్తారు సూర్య జయంతి నాడు కోనేటి రాయుడు సప్త వాహనాల వైభవాన్ని తిలకించేందుకు ఇప్పటికే భక్తులు తిరుమల కొండపై చేరుకుంటుండడంతో సప్తగిరి ల పై భక్తుల సందడి నెలకొంది


14, ఫిబ్రవరి 2024, బుధవారం

16న 7 వాహనాలపై మలయప్ప దర్శనం

 సూర్య జయంతి సందర్భంగా ఈనెల 16న రథసప్తమని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది ఒకేరోజు స్వామి వారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో ఈ రథసప్తమిని అర్థ బ్రహ్మోత్సవం ఒకరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొంటున్నారు భక్తులకు అవసరమైన ఏర్పాటు చకచకా పూర్తి చేస్తున్నారు రథసప్తమి రోజున ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేశారు భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన టైమ్స్ లాట్లను పాటించని పక్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు ద్వారా దర్శనానికి పంపుతారు ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు గదుల కేటాయింపు కోసం సిఆర్ఓ జనరల్ కౌంటర్లు మాత్రమే పని చేస్తాయి ఎంబీసీడీ కౌంటర్లను మూసివేస్తారు వాహన సేవలు ఇలా శ్రీ మల్లప్ప స్వామి వారు ఉదయం ఐదున్నర నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనాలపై భక్తులకు దర్శనం ఇస్తారు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు, సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనంపై సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్ర ప్రభాహనంపై భక్తులకు కటాక్షిస్తారు రథసప్తమి నాడు శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం ముంజలు సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది రథసప్తమికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ మల్లికా గారికి తెలిపారు మంగళవారం టిటిడి సిబిఎస్ఓ నరసింహ కిషోర్ తో కలిసి ఆమె తిరుమల లో ఏర్పాట్లను పర్యవేక్షించారు



10, ఫిబ్రవరి 2024, శనివారం

తిరుమల హుండీ ఆదాయం 4.31 కోట్లు

 తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం సమకూరింది శుక్రవారం ఒక్కరోజే హుండే కానుకల ద్వారా నాలుగు కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చాయి స్వామివారిని 62,593 మంది భక్తులు దర్శించుకోగా 18517 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 8 గంటల సమయం వేచి చూడాల్సి వస్తున్నది తమిళ హీరో జయం రవి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు..



8, ఫిబ్రవరి 2024, గురువారం

తిరుమలలో విమానం చెక్కర్లు

 తిరుమలలో మరోసారి అపచారం జరిగింది శ్రీవారి ఆలయం పై విమానం చెక్కర్లు కొట్టింది గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆలయం పై విమానం తిరుగుతూ కెమెరాలకు చిక్కింది ఇటీవల ఆలయం పై తరచూ విమానాలు తిరుగుతున్నాయి ఆలయం పై విమానాలు తిరగడం ఆగమశాస్త్ర సంప్రదాయానికి విరుద్ధమని టిటిడి చెబుతున్నది నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమల ప్రకటించాలని అనేకసార్లు టీటీడీ కోరిన కేంద్ర విమానయాన శాఖ నేటికీ స్పందించరి టిటిడి తాజా ఘటనపై అధికారులను సమాచారం కోరింది అధికార యంత్రాంగం స్పందించి తిరుమల ఆలయ సమీపంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు



6, ఫిబ్రవరి 2024, మంగళవారం

విశ్వవ్యాప్తం హిందూ ధర్మం

 ముగిసిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు తిరుమలలో హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఇందుకు విస్తృత ప్రచారం చేయాలని ఇతర మతస్తులు స్వచ్ఛందంగా వస్తే హిందూ మతంలోకి స్వాగతించాలని తిరుమలలో జరిగిన ధార్మిక సదస్సు తీర్మానించింది తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజులపాటు జరిగిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది ఈ సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలతో చేసిన తీర్మానాలను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు శ్రీవారి దివ్య వైభవాన్ని సనాతన ధర్మాన్ని ప్రపంచవంతటా ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవిర్భావం జరిగిందన్నారు గతంలో తాను చైర్మన్గా ఉన్నప్పుడు నిర్వహించిన ధార్మిక సదస్సులు స్వామీజీలు చేసిన సూచనల మేరకు దళిత గోవిందం మత్స్యగోవిందం అర్చకులకు శిక్షణ కల్యాణమస్తు తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు మళ్ళీ ఇప్పుడు నిర్వహించిన ధార్మిక సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతులు చేసిన సూచనలతో పలు తీర్మానాలు చేశామని చెప్పారు ఇతర మతస్తులు ఎవరైనా హిందూమతంలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారికోసం తిరుమలలో ఒక ప్రాంగణం ఏర్పాటు చేయాలని పవిత్ర జలప్రోక్షణం తదితరాలు నిర్వహించి వారిని స్వాగతించాలని సదస్సులో తీర్మానం చేశారు శిథిలమైన దేవాలయాలను పునరుద్ధరణతో పాటు దేవాలయాలు లేని చోట హరిజన గిరిజన మత్స్యకార ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించడం అవసరమని తీర్మానం చేశారు గోమాతల సంరక్షణ వేద శాస్త్రాల పరిరక్షణ ఎంతో ముఖ్యమని అందరికీ అర్థమయ్యేలా ధర్మాన్ని ప్రచారం చేయాలని తీర్మానించారు హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ద్రవిడ వేదానికి తగిన ప్రోత్సాహం అవసరమని వివిధ పాఠశాలల్లో అమలులో ఉన్న పాఠ్య ప్రణాళికలు హిందూ ధర్మానికి పెద్ద పీట వేయాలని తీర్మానం చేశారు తెలుగు సంస్కృతంలో ఉన్న హిందూ ధర్మానికి సంబంధించి అంశాలు అర్థం చేసుకునేందుకు పిల్లలకు యువతకు ఆ రెండు భాషలు నేర్పించాలని ధర్మ ప్రచారం కోసం అన్ని ప్రచార ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని తీర్మానించారు ఇలాంటి ధార్మిక సదస్సులు ఏడాదికి ఒకసారి తిరుమల లేదా తిరుపతిలో నిర్వహించాలని గ్రామ జిల్లా స్థాయిలో కూడా తరచూ నిర్వహించాలని తీర్మానం చేశారు అన్ని ధార్మిక సంస్థలు అమలు చేయాలని తీర్మానించారు.