అమ్మవారి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమ్మవారి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మార్చి 2024, మంగళవారం

మాందాపూర్ లో పెద్దమ్మ పండుగ

 బిబిపేట మండలంలోని మాందాపూర్ గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి పండుగను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు మంగళవారం గ్రామ దేవత అయిన పోచమ్మకు బోనాలు బుధవారం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం బోనాలు సమర్పిస్తారు గురువారం బండ్ల ప్రదర్శన తిరుగు బోనాలు అన్న ప్రసాద వితరణ ఒగ్గు కథలు ఉంటాయని తెలిపారు

18, మార్చి 2024, సోమవారం

మెంట్ రాజు పల్లి లో బోనాల ఊరేగింపు

 డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామంలో ఆదివారం పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు బోనాలు ఉన్నాయి వేద్యాలు సమర్పించుకున్నారు ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కలు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు



ఘనంగా ఆలయ వార్షికోత్సవం

 నవీపేట మండలంలోని బీనోలలో ముత్యాలమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం యజ్ఞం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం మహిళలు తలపై బోనాలను ఎత్తుకుని ఆలయానికి తరలి వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు పాడిపంటలు చల్లగా ఉండాలని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు



7, మార్చి 2024, గురువారం

మేడారం జాతర ఆదాయం 13 కోట్ల 25 లక్షలు

 గత జాతర కంటే కోటి రూపాయల 80 లక్షల ధనం 779 గ్రాముల బంగారం సమర్పించిన భక్తులు ముగిసిన హుండీలు లెక్కింపు

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహా జాతర హుండీల కానుకల ఆదాయం మొట్టమొదటిసారి 13 కోట్ల రూపాయలు దాటింది ఇప్పటివరకు జరిగిన జాతరలో ఇదే అత్యధిక ఆదాయంగా నమోదయింది 2022 జాతర కంటే మరో కోటి రూపాయల 80 లక్షల ఆదాయం పెరిగింది బంగారం వెండి కానుకలు కూడా పెరిగాయి మొత్తంగా వరంగల్లో వారం పాటు నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారం ముగిసింది ఈసారి జాతరలో 540 ఉండి ఏర్పాటు చేశారు ఫిబ్రవరి 29న లెక్కింపు మొదలుపెట్టగా కరెన్సీ నోట్లు నాణేల రూపంలో 13 కోట్ల 25 లక్షల 225100 వచ్చింది 2022 జాతరలో 517 హుండీలు ఏర్పాటు చేయగా 11 కోట్ల 45 లక్షల 34,526 రూపాయలు ఆదాయం వచ్చింది తాజాగా హుండీల ద్వారా 779 గ్రాముల 800 మిల్లి గ్రామంలో బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరాయ్ ఇతర దేశాలకు చెందిన 38 కరెన్సీ నోట్లు రాగా ఇందులో యూఎస్ డాలర్ 20072 కతారి 8 ఆస్ట్రేలియా 6 ఇంగ్లాండ్ 3 సింగపూర్ రెండు నోట్లు వచ్చాయి వీటిని ఫారం ఎక్స్చేంజిలో విలువ కట్టడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంలో కలవాలని ఉన్నట్లు అధికారులు తెలిపారు ఎండోమెంట్ శాఖా సొంత సిబ్బందితోపాటు మరో రెండు వందల మంది వాలంటీర్ల సహాయంతో వారం రోజుల్లో కౌంటింగ్ విజయవంతంగా పూర్తి చేసింది దేవాదాయశాఖ అకౌంట్లో ఉన్న మూడు బ్యాంకుల సిబ్బంది కౌంటింగ్ మిషన్లతో భారం పాటు ఇక్కడే డ్యూటీ చేశారు వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత మేడారం ఈవో రాజేంద్రన్ తెలిపారు




2, మార్చి 2024, శనివారం

శ్రీ భగలాముఖి అమ్మవారి క్యాలెండర్ ఆవిష్కరణ

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని స్వయంసిద్ధ క్షేత్రంగా వెలసిల్లిన శ్రీ భగలాముఖి అమ్మ వారి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రతినెల రెండవ అష్టమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి కటాక్షానికి పాత్రులు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్ ఆతిమాముల రామకృష్ణ గుప్త ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ఎర్రం విజయ్ ఐవిఎఫ్ యువజన విభాగం రాష్ట్రం ఉపాధ్యక్షుడు కొండ శైలేందర్ ఎస్ఆర్కే కళాశాల ప్రిన్సిపాల్ అమృత దత్తాద్రి పబ్బ వేణులు పాల్గొనడం జరిగింది



కన్నుల పండుగగా సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం

 


మద్నూర్ మండల కేంద్రంలోని సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ జరిగింది మూడు రాష్ట్రాల భక్తులు తరలివచ్చారు తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ప్రతి ఏడాది మహాశివరాత్రికి ముందు శుక్రవారం ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తారు.

ఆలయ నిర్వాహకురాలు సంతోషి యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి అధ్యక్షుడు కళ్యాణానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు కుంకుమార్చన పూర్తికాగానే యజ్ఞ కార్యక్రమం ప్రారంభించారు సాయంత్రం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కల్యాణానంద స్వామీజీ మాట్లాడుతూ భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయం గొప్పదని ఆలయాలను దర్శించుకుని భక్తులు కోరిన కోర్కెలు తీర్చుకుంటారని గుర్తు చేశారు నీటి యువత పాఠ్యాంశ సంస్కృతిని అవలంబించి భారత సంస్కృతిని మరిచిపోతుందని తల్లితండ్రులు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేయాలని అన్నారు ఆలయాలకు తీసుకెళ్లి ఆలయ విశిష్టతను తెలియజేయాలని గుర్తు చేశారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సంస్కృతి సాంప్రదాయాల విలువలు గుర్తిస్తే వాటిని దూరం చేసుకోవచ్చని తెలిపారు కార్యక్రమానికి కాయ రాష్ట్రాల తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడింది


1, మార్చి 2024, శుక్రవారం

మద్నూర్ లో సంతోషిమాత వార్షికోత్సవ వేడుకలు

 ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు సంతోషిమాత వార్షికోత్సవాలు మద్దూర్లో నిర్వహిస్తారు అందులో భాగంగా నేటి శుక్రవారం సంతోషిమాత వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు పూజారి సంతోషి తెలిపారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆలయ ఆవరణంలో గణపతి నవగ్రహాల పూజ కుంకుమ పూజ యజ్ఞం ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు

29, ఫిబ్రవరి 2024, గురువారం

అమ్మవారి సేవలు

 నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆర్ అండ్ బి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి మోహన్ నాయక్ దర్శించుకున్నారు వీరికి ముందుగా స్థానిక మాజీ సర్పంచ్ డి లక్ష్మణరావు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి మోహన్ నాయక్ పూజ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వీరి కాలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామంలోని బొర్రా గణేశా ఆలయం నుండి మహాలక్ష్మి ఆలయం శ్రీ పాప హరేశ్వర ఆలయం శ్రీ దత్తాత్రేయ ఆలయం నుండి సరస్వతి అమ్మవారి ఆలయం వరకు బైపాస్ సీసీ రోడ్డు రహదారి కొరకై ప్రత్యేకంగా ఆరు కోట్ల రూపాయల నిధులతో పనులు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఈ పనులు పూర్తయితే బాసర మండల కేంద్రానికి వచ్చే గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు



కన్నుల పండుగ విగ్రహ ప్రతిష్టాపన

 లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో గణపతి శ్రీ వీరభద్ర సమేత భద్రకాళీ దేవి శివలింగం నంది విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలుకుట శ్రీ మంగి రాములు మహారాజ్ వేద పండితులు యోగేష్ స్వామీల ఖర కమలములచే కన్నుల పండుగ నిర్వహించారు ఉదయం నుండి యంత్ర ప్రతిష్ట కళ్యాణం ఉత్సవం కాలన్యాసం నేత్రోన్ మలను స్వామివారి అలంకరణ సర్వదర్శనం మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా రాములు మహారాజు మాట్లాడుతూ గణపతి వీరభద్ర సమేత శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రజల ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆశీస్సులంతా చేశారు అనంతరం భక్తుల సౌకర్యార్థం కమ్మనైన వంటకాలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురోహితులు విశ్వనాథ శాస్త్రి పృథ్వి స్వామి వికాస్ స్వామి నిఖిల్ స్వామి లేడీస్ పెద్దలు మహిళలు యువత యువకులు పాల్గొన్నారు



మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

 


మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు

గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ బందోబస్తు మధ్యన లెక్కింపు ప్రక్రియ మొదలైంది దేవాదాయ రెవిన్యూ శాఖల సిబ్బంది స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో  లెక్కింపు జరుగుతుంది

హుండీలో బంగారు తాళిబొట్లు ఫారిన్ కరెన్సీలతో పాటు ఫేక్ నోట్లను కూడా భక్తులు కానుకలుగా వేశారు 518 హుండీలలో ఒక్కో హుండీని ఓపెన్ చేస్తూ లెక్కిస్తున్నారు అనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను గురువారం ఎండోమెంట్ పోలీస్ మేడారం పూజారులు ప్రారంభించారు హుండీలలో విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటు చిల్లర కాయిన్స్ ను భక్తులు భారీగా వేశారు టన్నులకొద్దీ ఒడిబియ్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు కాగా మొదటి రోజు మూడు కోట్ల రూపాయల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపార మొదటిరోజు ఆదాయాన్ని అధికారులు ఎండోమెంట్ అకౌంట్ లో జమ చేశారు లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ డిప్యూటీ అడిషనల్ కమిషనర్లు శ్రీకాంతరావు సునీత పర్యవేక్షిస్తున్నారు

బంగారు భరిణలు వెండి ఉయ్యాలలు జాతరలో  చాలామంది భక్తులు తమ మొక్కులలో భాగంగా బంగారు వెండి ఆభరణాలను హుండీలలో వేశారు లెక్కింపు సమయంలో ప్రతి బాక్సులు బంగారు తాళిబొట్లు కుంకుమ భరణి కడియాలు బయటపడుతున్నాయి వెండితో చేసిన ఊయలలు సమ్మక్క సారలమ్మ తల్లుల కన్నుల రూపాలు నాగుపాము ముద్రలు ఇంటి బొమ్మలు తదితరాలు కానుకలుగా వచ్చాయి వాటిని ప్రత్యేక హుండీలో వేసి తాళాలు వేసి భద్రపరిచారు జాతరకు వచ్చిన కొందరు విదేశీ భక్తులతో పాటు ఇతర దేశాలకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన తెలంగాణ భక్తులు కూడా మొక్కల క్రింద ఫారిన్ కరెన్సీని హుండీలలో కానుకలుగా సమర్పించారు ఇలాంటి వందల కొద్ది నోట్లు బయటపడుతున్నాయి మరికొందరు భక్తులు డాన్స్ చేసిన పాత 500 రూపాయల నోట్లు వేశారు 2000 రూపాయల నోట్లు కూడా వేశారు అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన 100 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు హుండీలలో కనిపించాయి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని ఆ నోట్లపై రాశారు కదా మేడారం జాతరలో మొత్తం 535 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు 518 హుండీలు పూర్తిగా నిండాయి ఇందులో 482 ఐరన్ 34 క్లాత్ రెండు కోడి బియ్యం హుండీలు ఉన్నాయి ఇంకా తెలుగు వారం హుండీలు మండపానికి చేరుకోలేదు గురువారం 134 హుండీలను తెరిచారు

లెక్కింపు సిబ్బందికి డ్రెస్ కోడ్ కానుకల లెక్కింపులో మొత్తం 400 మంది సిబ్బంది పాల్గొన్నారు వీరిని మహిళా కానిస్టేబుల్ తో చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు లెక్కింపులో పాల్గొనేవారు చేతివాటం ప్రదర్శించకుండా అధికారులు సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేశారు మెయిన్ డోర్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటుచేసి తనిఖీలు చేశారు కానుకల రూపంలో వచ్చిన కరెన్సీని బ్యాంకర్లు తీసుకువచ్చిన కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు అమ్మవార్ల కానుక లెక్కించడానికి గతంలో రెండు వారాల సమయం పట్టగా ఈసారి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు

చిల్లర లెక్కింపు కోసం మిషన్లు జాతరలో భాగంగా భక్తులు వేసిన చిల్లర నాణేలతో చిన్నచిన్న డ్రమ్ములు నిండుతున్నాయి అయితే చిల్లర నాణేల లెక్కింపు అధికారులకు తలనొప్పిగా మారేది అయితే ఈసారి కాయిన్స్ లెక్కించడానికి ప్రత్యేకంగా మిషన్లు తయారు చేయించారు కాయిన్ సైజు ఆధారంగా నాణేలను ఆ మిషన్లను వేయగానే అవిసెపరేట్ అవుతున్నాయి దీంతో లెక్కించడానికి సులభం అవుతుంది. గతంలో భారీ మొత్తంలో వస్తున్న రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణేలను వేరుచేసి లెక్కించడానికి అదనంగా నాలుగు అయిదు రోజులు సమయం పట్టేది అదే సమయంలో భక్తులు మొక్కల రూపంలో వేసిన పచ్చని ఓడిబియ్యాన్ని జల్లెడ సాయంతో వేరు చేసి బస్తాల్లో నింపుతున్నారు



భక్తిశ్రద్ధలతో మహాకుంభాభిషేకం

 


నిజామాబాద్ నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మొట్టమొదటిసారి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా మహా కుంభాభిషేకం గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ పురోహితులు వేలేటి గౌరీ శంకర శర్మ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా గురువారం గురు వందనం ప్రాతఃకాల ఆవాహిక దేవత పూజ అమ్మవారికి విషెశ అభిషేకాలు వేద పారాయణం తదితర కార్యక్రమాలు

భక్తిశ్రద్ధలతో నిర్వహించారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సాయంత్రం భక్తిశ్రద్ధలతో మహాకుంభాభిషేకం ఉత్తర నిరాజనం యజమాను ఆశీర్వచనం ఆచార్య రుత్విక్ సన్మానము విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేకం పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ విగాల నగర మేయర్ దండోనీతో కిరణ్ పాల్గొనే అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,  సత్య ప్రకాష్ సుదం రవిచందర్ దండు చంద్రశేఖర్ ముచ్కూర్ నవీన్ తడకల శ్రీను పాల్తి రవికుమార్ కోవూరు జగన్ చిదుర శ్రీనివాస్ కస్ప సంపత్ గారి పల్లి ప్రవీణ్ పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు నరసయ్య సెక్రటరీ ఎనుగందుల మురళి కార్పొరేటర్ ధర్మపురి సాయి సత్యపాల్ బిల్లా మహేష్ నీలగిరి రాజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ గుప్త ప్రధాన కార్యదర్శి రవికుమార్ గుప్త కోశాధికారి రాఘవేంద్ర గుప్తా ఉపాధ్యక్షుడు నరేంద్ర గుప్తా రాజేందర్ గుప్తా రుక్మిణి ప్రసాద్ గుప్త కరుణాకర్ గుప్తా చంద్రశేఖర్ గుప్త శంకర్ తదితరులు పాల్గొన్నారు



అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్టాపన

 


బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప మఠంలో గురువారం అన్నపూర్ణాదేవి గణపతి విగ్రహం నవగ్రహాల విగ్రహాలను ప్రతిష్టించారు మఠం పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప స్వామి కమల ఖడ్గం హానేగా మఠం పీఠాధిపతుల సమక్షంలో ప్రత్యేక పూజలు హోమాలు యజ్ఞం పాలాభిషేకం చేసి విగ్రహాల ప్రతిష్టాపన చేశారు అన్నపూర్ణాదేవి మందిరం ముందు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొని పూజలు చేసే ముక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప స్వామి మాట్లాడుతూ ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దైవభక్తి పెంపొందించుకోవాలన్నారు అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మఠాధిపతులు మల్లికార్జున స్వామి శంకరాలింగ వివాచార్య కాంగ్రెస్ విఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

ఘనంగా తిరుగువారం ముగిసిన మేడారం

 మేడారం మహా జాతర ముగిసింది అత్యంత వైభవంగా కొనసాగిన జాతర బుధవారం తిరుగు వారం పండుగతో ముగిసింది ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం వనదేవతలకు వడ్డెలు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు గద్దెలు గ్రామంలోని గుడిని శుద్ధి చేశారు ఆడపడుచులు అలుకు పూతలతో రంగురంగుల ముగ్గులు వేసి అమ్మవార్ల గద్దెలను అందంగా అలంకరించారు డోలు వాయిద్యాలు నడుమ తల్లులకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు తిరుగుబారం రోజున కూడా తల్లులు ఇక్కడే కొలువుదీరి ఉంటారని నమ్మకంతో భక్తులు మేడారానికి పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తల్లులకు బంగారాన్ని సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు ఫిబ్రవరి 7న గుడి మెలిగే పండుగతో మొదలై 14న మండలిగే పండుగ 21 22 తేదీల్లో నా వనదేవతలు గద్దెలకు చేరడం 23న భక్తుల మొక్కులు 24న వనప్రవేశం కార్యక్రమాలు జరిగాయి



భగవంతుడిని ఏమని అడగాలి

 వివేకానంద యుక్త వయసులో ఉండగా తండ్రి విశ్వనాథ దత్త హఠాత్తుగా కన్నుమూశారు ఒక్కసారిగా కుటుంబం పేదరికంలో కురుకుపోయింది పెద్ద కుమారుడైన వివేకానందుడే ఆధారమయ్యాడు పట్టభద్రుడైన ఆయనకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు అలాంటి క్లిష్ట పరిస్థితులలో గురువు పరమహంస వద్దకు వెళ్లి బాధపంచుకున్నాడు అప్పుడు ఆయన సమీపానే ఉన్న దక్షిణేశ్వర కాళి ఆలయం వైపు చూపిస్తూ ఇవాళ మంగళవారం ఈరోజున అమ్మవారిని ఏది కొడితే అది అనుగ్రహిస్తుంది వెళ్లి ప్రార్థించు అన్నాడు ఆ సాయంత్రం వివేకానంద మందిరానికి వెళ్లి అమ్మను ప్రార్థించారు తిరిగి వచ్చాక రామకృష్ణుడు అమ్మ ఏమన్నది అని అడిగారు అరే అడగటం మర్చిపోయాను అని వివేకానంద మదనపడ్డారు. సరే మళ్ళీ వెళ్ళు అన్నారు పరమహంస ఈసారి అదే పద్ధతి మూడోసారి స్వామీజీ ఖాళీ ఆలయానికి వెళ్లి వచ్చాక ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కనిపించారు పరమహంసను ఉద్దేశించి జగన్ మాతను డబ్బు కావాలని ఎలా అడగగలను? అలా చేస్తే మహారాజు దగ్గరకు వెళ్లి గుమ్మడికాయ అడిగినట్లు ఉంటుంది నిస్వార్ధ ప్రేమతో భక్తితో అమ్మను అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని ప్రార్థించాను అన్నారు వివేకానంద కానీ అమ్మవారి కృప గురువుగారి ఆశీస్సులు ఫలంగా అప్పటినుంచి వివేకానంద కుటుంబానికి ఎలాంటి లోటు రాలేదు అవసరమైన వసతులకు ఇబ్బంది కలగలేదు

28, ఫిబ్రవరి 2024, బుధవారం

వైభవంగా రేణుక జమదగ్నిలా కళ్యాణం

 


భిక్కనూరు మండల కేంద్రంలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారి కళ్యాణం నేత్రపర్వంగా కొనసాగింది అమ్మవారి కల్యాణాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ జమదగ్నిల ఉత్సవ విగ్రహాలను పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి కళ్యాణం నిర్వహించారు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు అక్కడ జరిగిన కళ్యాణ మహోత్సవములు భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అమ్మవారికి మహిళలు ఒడిబియ్యం పోసి ముక్కులు తీర్చుకున్నారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి కళ్యాణాన్ని పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.



27, ఫిబ్రవరి 2024, మంగళవారం

వైభవంగా వడ్యాల్ రేణుక ఎల్లమ్మ జాతర

లక్ష్మణ చాంద మండలంలోని వడియాల్లో కొలువుదీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మంగళవారం మంగళరంగ వైభవంగా జరిగింది ఉదయమే అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు అమ్మవారి కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే జాతర మహోత్సవ వేడుకలు జరగగా వడియాలు కనకాపూర్ గ్రామాలను ప్రజలే కాకుండా మామడా వివిధ మండలాల ప్రజలు సైతం హాజరై అమ్మవారిని దర్శించుకుని ముక్కలు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మామడా లక్ష్మణ చాంద్ర మండలాల గౌడ కుల సంఘాల నాయకులు ఏర్పాట్లు పర్యవేక్షించారు అలాగే నిర్మల్ డిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ నేత కూచాడి శ్రీహరి రావు హాజరై ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వారితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు


నేడు రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

 లక్ష్మణ చాందా మండలంలోని వడియాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ నీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు గత వారం రోజుల నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి లక్ష్మణ చందా మామడ మండలాల గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే ఈ రేణుక ఎల్లమ్మ మాత ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి ఈ వారం రోజుల నుండి ప్రతిరోజు మాటకు ప్రత్యేక పూజ కార్యక్రమాలతోపాటు ఆలయ ప్రాంగణంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గత 25వ తేదీ ఆదివారం పోచమ్మ బోనాలు ఎల్లమ్మ చరిత్ర కథలు సోమవారం పుట్టదని ఎల్లమ్మ బోనాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా నేడు 27వ తేదీ మంగళవారం రోజు వేద పండితులతో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంతో పాటు నాగవెల్లి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు రేణుకా మాత కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ని వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ రేణుక ఎల్లమ్మ మాత ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం అమ్మవారి కళ్యాణ శుభ సందర్భంగా భక్తులకు ఎలాంటి సహకార్యాలకు ఇబ్బందులు కలగకుండా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రాంగణంలో టెంట్లు తాగునీటి వసతి తదితర అన్ని సౌకర్యాలను సమకూర్చారు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని లక్ష్మణ చందా మామడ గౌడ కుల సంఘాల సభ్యులు కోరారు



అమ్మవారి సన్నిధిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

 బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సోమవారం భారత ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారి మనుమడు విరాట్ కో అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు అంతకుముందు వీరికి ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు ఆలయ ఈవో విజయరామారావు అర్చకులు అమ్మవారి ప్రసాదాలను ఆశీర్వచనాలను అందజేశారు



26, ఫిబ్రవరి 2024, సోమవారం

హనుమకొండకు మేడారం హుండీలు

 మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగియడంతో జాతర సమయంలో లక్షలాదిమంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా గద్దెల ప్రాంతంలో ఏర్పాటు చేసిన హుండీలో తల్లులకు సమర్పించిన కానుకలను లెక్కించడానికి దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సోమవారం ఆర్టిసి కార్గో బస్సులలో 512 హుండీలను హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజేంద్ర మాట్లాడుతూ ఈనెల 29 నుంచి హుండీల లెక్కింపు పకడబందీగా చేపట్టనున్నట్లు తెలిపారు



ఈ నెల 27 న మహా కుంభాభిషేకం

 నిజామాబాద్ నగరంలో నీ కన్యకా పరమేశ్వరి ఆలయం లో మొట్ట మొదటి సారిగా మహా కుంభాభిశేకం కార్య క్రమం ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్య క్రమానికి శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వారి మంగళ శాసనముల తో మహా కుంభా భిషేకం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ పురోహితులు వెలేటి గౌరీ శంకర్ శర్మ తెలిపారు . ఈ మహా కుంభాభిశేక మహోత్సవం ఈ నెల 27 వ తేదీ మంగళ వారం నుండి 29 వ తేదీ గురు వారం వరకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం, కిషన్ గంజ్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాత ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ ఆర్య వైశ్య సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.