విరాళాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విరాళాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మార్చి 2024, శనివారం

శివుడికి వెండి కిరీటం బహుకరించిన ముస్లిం భక్తుడు

 మహాశివరాత్రి సందర్భంగా ఒక ముస్లిం భక్తుడు మతసామరస్యాన్ని చాటాడు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఎండి మౌలానా పట్టణంలోని శ్రీ భవాని శంకర మహాదేవాలయానికి శుక్రవారం ఆలయ కమిటీ సమక్షంలో 20వేల రూపాయల విలువైన వెండి కిరీటాన్ని బహూకరించారు ఆలయ పూజారి విశ్వనాథ శర్మ ప్రత్యేక పూజలు చేసి కిరీటాన్ని శివలింగానికి అలంకరించారు మౌలానా కుటుంబానికి పరమశివుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు



7, మార్చి 2024, గురువారం

మేడారం జాతర ఆదాయం 13 కోట్ల 25 లక్షలు

 గత జాతర కంటే కోటి రూపాయల 80 లక్షల ధనం 779 గ్రాముల బంగారం సమర్పించిన భక్తులు ముగిసిన హుండీలు లెక్కింపు

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహా జాతర హుండీల కానుకల ఆదాయం మొట్టమొదటిసారి 13 కోట్ల రూపాయలు దాటింది ఇప్పటివరకు జరిగిన జాతరలో ఇదే అత్యధిక ఆదాయంగా నమోదయింది 2022 జాతర కంటే మరో కోటి రూపాయల 80 లక్షల ఆదాయం పెరిగింది బంగారం వెండి కానుకలు కూడా పెరిగాయి మొత్తంగా వరంగల్లో వారం పాటు నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారం ముగిసింది ఈసారి జాతరలో 540 ఉండి ఏర్పాటు చేశారు ఫిబ్రవరి 29న లెక్కింపు మొదలుపెట్టగా కరెన్సీ నోట్లు నాణేల రూపంలో 13 కోట్ల 25 లక్షల 225100 వచ్చింది 2022 జాతరలో 517 హుండీలు ఏర్పాటు చేయగా 11 కోట్ల 45 లక్షల 34,526 రూపాయలు ఆదాయం వచ్చింది తాజాగా హుండీల ద్వారా 779 గ్రాముల 800 మిల్లి గ్రామంలో బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరాయ్ ఇతర దేశాలకు చెందిన 38 కరెన్సీ నోట్లు రాగా ఇందులో యూఎస్ డాలర్ 20072 కతారి 8 ఆస్ట్రేలియా 6 ఇంగ్లాండ్ 3 సింగపూర్ రెండు నోట్లు వచ్చాయి వీటిని ఫారం ఎక్స్చేంజిలో విలువ కట్టడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంలో కలవాలని ఉన్నట్లు అధికారులు తెలిపారు ఎండోమెంట్ శాఖా సొంత సిబ్బందితోపాటు మరో రెండు వందల మంది వాలంటీర్ల సహాయంతో వారం రోజుల్లో కౌంటింగ్ విజయవంతంగా పూర్తి చేసింది దేవాదాయశాఖ అకౌంట్లో ఉన్న మూడు బ్యాంకుల సిబ్బంది కౌంటింగ్ మిషన్లతో భారం పాటు ఇక్కడే డ్యూటీ చేశారు వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత మేడారం ఈవో రాజేంద్రన్ తెలిపారు




6, మార్చి 2024, బుధవారం

మేడారం జాతర ఆదాయం 12.7 కోట్లు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదాయం 12 కోట్ల 71 లక్షల 79280 రూపాయలు వచ్చింది. గతంలో కన్నా 26 లక్షల 29,5503 రూపాయలు ఎక్కువ వచ్చింది ప్రతి జాతరకు కోటి రూపాయలపైనే ఆదాయం పెరుగుతూ వస్తున్న ఈసారి మాత్రం అలా జరగలేదు. కాగా మేడారం నుండి లెక్కింపు మంగళవారం ముగిసింది భక్తుల నుంచి కానుకగా వచ్చిన ఎనిమిది వందల గ్రాముల బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండిని బ్యాంకులు భద్రపరిచారు

5, మార్చి 2024, మంగళవారం

76 హుండీల ద్వారా 93 లక్షలు

 కొనసాగుతున్న మేడారం హుండీలో లెక్కింపు ఇప్పటివరకు 481 హుండీలలో 11.25 కోట్ల ఇన్కమ్ చివరి దశకు వచ్చిన లెక్కింపు ప్రక్రియ

మేడారం మహా జాతర హుండీ ఆదాయం 11 కోట్ల 25 లక్షలకు చేరుకుంది ఆదివారం నాటికి 45 హుండీలను లెక్కించగా మొత్తం 10 కోట్ల 32 లక్షల మూడువేల రూపాయలు ఆదాయం వచ్చింది సోమవారం మరో 76 హుండీలను లెక్కించడంతో 93 లక్షల 67000 వచ్చాయి దీంతో ఇప్పటివరకు మొత్తం 481 లెక్కింపు పూర్తిగా 11 కోట్ల 25 లక్షల 70000 ఇన్కం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు తిరుగువారం కోసం ఉంచిన 22 హుండీలు సైతం సోమవారం హనుమకొండలోని టీటీడీకి చేరుకున్నాయి మొత్తం ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత మేడారం ఈఓ రాజేంద్రన్ తెలిపారు మేడారం హుండీల లెక్కింపు చివరి దశకు చేరుకుంది మొత్తం 540 ఉండేలా ఏర్పాటు చేయగా ఇంకా 59   హుండీలు లెక్కించాల్సి ఉంది

4, మార్చి 2024, సోమవారం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు

 సమ్మక్క తల్లి మా ఆయన బెట్టింగ్ మానేయాలి మా అక్క కొడుకు ఐఐటీ సీటు రావాలి ఫారిన్ పోవాలి అనుకున్న పిల్లతో పెళ్లి కావాలి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముదిరించాలి చిట్టీలు రాసి వండిలో వేసిన భక్తులు 10 కోట్లు దాటిన జాతర ఆదాయం హుండీలలో బయటపడుతున్న కోరికల చిట్టాలు

మేడారం గుండెలను తెరిచే కానుకను లెక్కిస్తుండగా వాటిలో భక్తుల కోరికల చిట్టాలు చిట్టీలు కుప్పలు తిప్పలుగా బయటపడుతున్నాయి మా ఆయన బెట్టింగ్ మానేయాలి మా అక్క కొడుకు ఐఐటీలో సీటు రావాలి అంటూ ఒక మహిళ కాగితంపై రాసి హుండీలో వేసింది ఫారిన్ పోవాలి అనుకున్న పళ్ళతో పెళ్లి కావాలి అంటూ ఒక యువకుడు సమకతలిని వేడుకుంటూ చిట్టి రాసి హుండీలో వేసిండు. ఈ కోరికల చిట్టిలను చూసి కౌంటింగ్ సిబ్బంది లెక్కింపును పర్యవేక్షిస్తున్న అధికారులు ఆశ్చర్యపోతున్నారు. హనుమకొండ టిటిడి కళ్యాణమండపంలో గురువారం నుంచి మేడారం హుండీలు లెక్కిస్తున్నారు ప్రతి హుండీలోనూ డబ్బు కానుకలతో పాటు ఇలాంటి చిట్టెలు బయటపడుతున్నాయి వీటితో పాటు అంబేద్కర్ ఫోటో ఉన్న నకిలీ వంద రూపాయలు నోట్లు కనిపించాయి వాటిపైన ప్రభుత్వం కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అనే డిమాండ్లు రాసి ఉన్నాయి కోరుకున్న ఉద్యోగం రావాలని కొందరు తమ బిడ్డల పెళ్లిళ్లు అయ్యేలా చూడాలని మరికొందరు వారిని వెళ్లే అవకాశం రావాలని ఇంకొందరు అనుకున్న అమ్మాయితో పెళ్లి కావాలని కొందరు చిట్టిలు రాశారు నాలుగు రోజుల్లో 10 కోట్ల రూపాయలు దాటిన ఆదాయం మేడారం మహా జాతర ఉండేలా కానుకల ఆదాయం పది కోట్ల రూపాయలు దాటింది లెక్కింపు గతానికి భిన్నంగా జెట్ స్పీడ్ తో సాగుతోంది జాతరలో అధికారులు 535 హుండీల ఏర్పాటు చేయగా హనుమకొండ టిటిడి కళ్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి గురు శుక్రవారాలలో 25 25 హుండీల ద్వారా ఆరు కోట్ల రూపాయల 13 లక్షల 75000 శనివారం 112 బాక్సులతో మూడు కోట్ల 46 లక్షల 61,000 కరెంటు రూపంలో ఆదాయం వచ్చింది ఆదివారం 88 హుండీలను తెరవగా 71 లక్షల 67 వేల కరెన్సీ వచ్చింది. దీంతో నాలుగు రోజుల మొత్తం ఆదాయం పది కోట్ల 32 లక్షల మూడు వేలకు చేరింది వచ్చిన మొత్తం ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత మేడారం ఈవో రాజేంద్రన్ తెలిపారు తిరుగువారం కోసం ఏర్పాటు చేసిన గుండెలను సోమవారం టిటిడికే తరలించనున్నట్లు ఆఫీసర్లకు తెలిపారు



3, మార్చి 2024, ఆదివారం

ఇస్కాన్ కు తొమ్మిది ఎకరాల మామిడి తోట విరాళము

 నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన కొండపావులూరి శ్రీనివాసరావు సుభాషిని దంపతులు తమ తొమ్మిదిన్నర ఎకరాల మామిడి తోటను ఇస్కాన్ సంస్థకు విరాళంగా అందజేశారు ఈ తోట విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుంది హైదరాబాదులో వ్యాపారం చేస్తున్న శ్రీనివాసరావు ఎన్నో ఏళ్లుగా శ్రీకృష్ణుడికి భక్తులు హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ సంస్థలు సభ్యునిగాను ఉన్నారు నవీపేట మండలంలోని శాఖాపూర్ గ్రామ జీవ శివారులోని తమ మామిడి తోటను ఆదివారం ఇసుకనుకు అందజేశారు ఈ మామిడి తోటలో త్వరలో ఇస్కాన్ మందిరం వృద్ధాశ్రమం గోషాల ఏర్పాటు అవుతాయని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు అలాగే హనుమాన్ ఫారంలో తమ సొంత డబ్బు లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని శ్రీనివాసరావు తన తండ్రి వెంకటేశ్వరరావు పేరిట విరాళంగా ఇచ్చారు

రాజరాజేశ్వర ఆలయంలో తాగునీటి వసతికి నాలుగు ట్యాంకుల విరాళం

 నవీపేట మండలంలోని నాగేశ్వర్ లోని రాజరాజేశ్వర ఆలయంలో తాగునీటి సౌకర్యార్థం గ్రామానికి చెందిన కోనేరు పెద్ద భీమిరెడ్డి నాలుగు తాగునీటి ట్యాంకులను విరాళంగా అందజేశారు రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ తాగునీటి ట్యాంకులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బినోల సొసైటీ చైర్మన్ హనుమాన్లు తాజా మాజీ సర్పంచ్ సురేష్ నవీన్ సతీష్ తదితరులు ఉన్నారు

మేడారంలో 317 హుండీల లెక్కింపు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది గురువారం మొదలైన హుండీల లెక్కింపు ప్రక్రియ మరో రెండు రోజులపాటు కొనసాగుతున్నది జాతరలో మొత్తం 518 ఉండి ఉండగా వాటిని వరంగల్కు తరలించి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో భద్రపరిచి గుండెలను లెక్కిస్తున్నారు ఇప్పటివరకు 317 లెక్కించగా 9 కోట్ల 60 లక్షల 36వేల రూపాయలు ఆదాయం సమకూరింది మరో 2001 ఎక్కించాల్సి ఉంది మొదటి రోజున 114 లెక్కించగా మూడు కోట్ల 15 లక్షల 40 వేల రూపాయలు రెండవ రోజున 71 లెక్కించగా రెండు కోట్ల 98 లక్షల 35 వేల రూపాయలు ఆదాయం రాగా మూడవరోజు 112 ఎక్కించగా మూడు కోట్ల 46 లక్షల 61 వేల రూపాయల ఆదాయం వచ్చింది  మిగిలిన రెండు వందల ఒక్క హుండీల లెక్కింపు మరో రెండు రోజులలో పూర్తి కానున్నది

2, మార్చి 2024, శనివారం

రెండు రోజుల మేడారం హుండీల ఆదాయము ఆరు కోట్లకు పైగా

 రెండో రోజు కరెన్సీ కానుకలు రెండు కోట్ల 98 లక్షలు శుక్రవారం తెరిచిన హుండీలు 71 మొత్తం 535 లెక్కించినవి 205

మేడారం మహా జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది రెండో రోజున శుక్రవారం నాటికి ఆదాయం 6 కోట్ల 13 లక్షల 75 వేలకు చేరింది జాతరలో దేవాదాయ శాఖ అధికారులు 535 హుండీలను ఏర్పాటు చేయగా హనుమకొండ టిటిడి కళ్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి మిగతావి తిరుగుబాటు భక్తుల కోసం అక్కడే ఉంచారు గురువారం కౌంటింగ్ ప్రక్రియ మొదలవగా మొదటి రోజు 134 హుండీలలో మూడు కోట్ల 15 లక్షల 40000 ఇండియన్ కరెన్సీ వచ్చింది రెండో రోజున శుక్రవారం మధ్యాహ్నం నాటికి సమ్మక్క తల్లి గద్దె వద్ద ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు పూర్తయింది తర్వాత సార్లమ్మ హుండీలతో కలిపి 71 హుండీలను తెరవగా రెండు కోట్ల 98 లక్షల 35వేల రూపాయల ఆదాయం వచ్చింది మొత్తంగా రెండు రోజుల్లో ఆరు కోట్ల 13 లక్షల 75 వేల రూపాయలు వచ్చిందని అకౌంట్లో జమ చేశామని ఎండోమెంట్ ఆఫీసర్లు పేర్కొన్నారు



29, ఫిబ్రవరి 2024, గురువారం

కొమురవెల్లి ఆలయంలో విరాట్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్

 విరాట్ ఫౌండేషన్ ఫ్లై హై కన్సల్టెన్సీ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం వద్ద భక్తులకు చల్లని మంచినీటిని అందించేందుకుగాను నెలకొల్పిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని కోరుతూ ఆ సంస్థ బాధ్యులు గురువారం సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సంస్థ డైరీ ని మంత్రికి ప్రధానం చేశారు కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తులకు మంచినీటిని అందించాలని గొప్ప సంకల్పంతో వాటర్ ప్లాంట్ నెలకొల్పిన విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు సభ్యులను మంత్రి అభినందించారు మంత్రిని కలిసిన వారిలో విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆకుల సోనియా సభ్యులు తానే సురేష్ పటేల్ తదితరులు ఉన్నారు

రామయ్య హుండీ ఆదాయం ఒక కోటి 81 లక్షలు

 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు 56 రోజులకు ఒక కోటి 81 లక్షల 80 వేల 925 ఆదాయం వచ్చిందని వివో ఎల్ రమాదేవి తెలిపారు ఇందులో అన్నదాన సత్రంలోని నుండి ద్వారా 388100 బంగారం 174 గ్రామంలో వెండి కిలో 248 గ్రాములు ఒక వెయ్యి ఒక వంద పదిహేను యుఎస్ డాలర్లు 1000 సౌత్ ఆఫ్రికా ర్యాంట్స్ 90 కెనడా డాలర్లు 145 ఆస్ట్రేలియా డాలర్లు 17 మలేషియా రింగ్ హిట్స్ 25 ఇంగ్లాండు పౌండ్స్ 6 సౌదీ అరేబియా రియాల్స్ 100 జపాన్ యెన్ 20 థాయిలాండ్ బాతులు 15 నేపాల్ రుపీలు 15 యూఏఈ థర్హ్యమ్స్ ఆరు ఖతార్ రియాన్సు 100 ఒమన్ బైసాసు పది బంగ్లాదేశ్ టాకాలు వచ్చాయని చెప్పారు

నగదు విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేశామని తెలిపారు



మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

 


మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు

గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ బందోబస్తు మధ్యన లెక్కింపు ప్రక్రియ మొదలైంది దేవాదాయ రెవిన్యూ శాఖల సిబ్బంది స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో  లెక్కింపు జరుగుతుంది

హుండీలో బంగారు తాళిబొట్లు ఫారిన్ కరెన్సీలతో పాటు ఫేక్ నోట్లను కూడా భక్తులు కానుకలుగా వేశారు 518 హుండీలలో ఒక్కో హుండీని ఓపెన్ చేస్తూ లెక్కిస్తున్నారు అనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను గురువారం ఎండోమెంట్ పోలీస్ మేడారం పూజారులు ప్రారంభించారు హుండీలలో విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటు చిల్లర కాయిన్స్ ను భక్తులు భారీగా వేశారు టన్నులకొద్దీ ఒడిబియ్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు కాగా మొదటి రోజు మూడు కోట్ల రూపాయల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపార మొదటిరోజు ఆదాయాన్ని అధికారులు ఎండోమెంట్ అకౌంట్ లో జమ చేశారు లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ డిప్యూటీ అడిషనల్ కమిషనర్లు శ్రీకాంతరావు సునీత పర్యవేక్షిస్తున్నారు

బంగారు భరిణలు వెండి ఉయ్యాలలు జాతరలో  చాలామంది భక్తులు తమ మొక్కులలో భాగంగా బంగారు వెండి ఆభరణాలను హుండీలలో వేశారు లెక్కింపు సమయంలో ప్రతి బాక్సులు బంగారు తాళిబొట్లు కుంకుమ భరణి కడియాలు బయటపడుతున్నాయి వెండితో చేసిన ఊయలలు సమ్మక్క సారలమ్మ తల్లుల కన్నుల రూపాలు నాగుపాము ముద్రలు ఇంటి బొమ్మలు తదితరాలు కానుకలుగా వచ్చాయి వాటిని ప్రత్యేక హుండీలో వేసి తాళాలు వేసి భద్రపరిచారు జాతరకు వచ్చిన కొందరు విదేశీ భక్తులతో పాటు ఇతర దేశాలకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన తెలంగాణ భక్తులు కూడా మొక్కల క్రింద ఫారిన్ కరెన్సీని హుండీలలో కానుకలుగా సమర్పించారు ఇలాంటి వందల కొద్ది నోట్లు బయటపడుతున్నాయి మరికొందరు భక్తులు డాన్స్ చేసిన పాత 500 రూపాయల నోట్లు వేశారు 2000 రూపాయల నోట్లు కూడా వేశారు అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన 100 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు హుండీలలో కనిపించాయి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని ఆ నోట్లపై రాశారు కదా మేడారం జాతరలో మొత్తం 535 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు 518 హుండీలు పూర్తిగా నిండాయి ఇందులో 482 ఐరన్ 34 క్లాత్ రెండు కోడి బియ్యం హుండీలు ఉన్నాయి ఇంకా తెలుగు వారం హుండీలు మండపానికి చేరుకోలేదు గురువారం 134 హుండీలను తెరిచారు

లెక్కింపు సిబ్బందికి డ్రెస్ కోడ్ కానుకల లెక్కింపులో మొత్తం 400 మంది సిబ్బంది పాల్గొన్నారు వీరిని మహిళా కానిస్టేబుల్ తో చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు లెక్కింపులో పాల్గొనేవారు చేతివాటం ప్రదర్శించకుండా అధికారులు సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేశారు మెయిన్ డోర్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటుచేసి తనిఖీలు చేశారు కానుకల రూపంలో వచ్చిన కరెన్సీని బ్యాంకర్లు తీసుకువచ్చిన కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు అమ్మవార్ల కానుక లెక్కించడానికి గతంలో రెండు వారాల సమయం పట్టగా ఈసారి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు

చిల్లర లెక్కింపు కోసం మిషన్లు జాతరలో భాగంగా భక్తులు వేసిన చిల్లర నాణేలతో చిన్నచిన్న డ్రమ్ములు నిండుతున్నాయి అయితే చిల్లర నాణేల లెక్కింపు అధికారులకు తలనొప్పిగా మారేది అయితే ఈసారి కాయిన్స్ లెక్కించడానికి ప్రత్యేకంగా మిషన్లు తయారు చేయించారు కాయిన్ సైజు ఆధారంగా నాణేలను ఆ మిషన్లను వేయగానే అవిసెపరేట్ అవుతున్నాయి దీంతో లెక్కించడానికి సులభం అవుతుంది. గతంలో భారీ మొత్తంలో వస్తున్న రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణేలను వేరుచేసి లెక్కించడానికి అదనంగా నాలుగు అయిదు రోజులు సమయం పట్టేది అదే సమయంలో భక్తులు మొక్కల రూపంలో వేసిన పచ్చని ఓడిబియ్యాన్ని జల్లెడ సాయంతో వేరు చేసి బస్తాల్లో నింపుతున్నారు



హనుమాన్ ఆలయానికి మైక్ సెట్ వితరణ

 పిట్లం మండలంలోని చిల్లరికి హనుమాన్ ఆలయానికి గ్రామానికి చెందిన దుమ్మ శంకర్ అనే దాత పదివేల రూపాయల విలువ చేసే మైక్ సెట్ గురువారం ఆలయ కమిటీ సభ్యులకు వితరణ చేశారు ఆయన మాట్లాడుతూ అనుమానాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో హనుమాన్ మాల ధారణ స్వాములకు ఈ మైక్ సెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు అదేవిధంగా ఉదయాన్నే గ్రామస్తులను మేల్ కోల్పోయిన అనుమాన ఆలయం ఆవరణలో ఆంజనేయ స్వామి చాలీసా వినిపించడం జరుగుతుందని పేర్కొన్నారు



28, ఫిబ్రవరి 2024, బుధవారం

శ్రీశైలంలో అమెరికా భక్తుడు భూరి విరాళం

 శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఒక భక్తుడు మంగళవారం బూరి విరాళం సమర్పించారు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్ దత్ బంగారు వెండి సామాగ్రి ఆభరణాలను ఆలయానికి అందజేశారు 28.3 గ్రాములు ఉన్న రెండు బంగారు బాషకాలు ఐదు గ్రాముల బంగారు కంకణం ఒకటి. రెండు ఐదు కిలోల వెండి పళ్ళెం 865 గ్రాముల వెండి శక్తి ఆయుధము 550 గ్రాముల వెండి నాగ హారతి 20090 గ్రాముల కుక్కుట ధ్వజము 750 గ్రాముల 5 వెండి గిన్నెలు 920 గ్రాముల గంధక్షత గిన్ని ఒక వంద 90 గ్రాముల కమండలాన్ని 300 గ్రాముల పెద్దక మండలాన్ని కొత్తపల్లి సునీల్ దత్ గారు కుటుంబం అందజేసింది నంద్యాల జిల్లా పగిడాలకు చెందిన కౌలూరి సింధూర కూడా 810 మరియు 350 గ్రాముల చొప్పున 2 వెండి పళ్ళాలు 615 గ్రాములున్న మూడు వెండి చెంబులను ఆలయానికి అందజేశారు అనంతరం దాతలకు దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రము ప్రసాదము అందజేసి సత్కరించారు రెండు రోజుల క్రితం చెన్నైకి చెందిన భక్తురాలు కోనేరు విమలాదేవి స్వామివారికి 343 గ్రాముల బంగారు పళ్లెం అందజేశారు.

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

 మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి సిరిసిల్ల వాస్తవ్యులు ముత్యంరావు లక్ష్మీ దంపతులు తమ వంతు సహాయంగా ఆలయ ప్రాంగణంలోని నాగుపాము పుట్టపైన రేకుల షెడ్డు నిర్మాణానికి 1,50,000 ఇచ్చుటకు వాగ్దానం చేసి 50 వేల రూపాయలను అడ్వాన్సుగా మంగళవారం ఆలయ అధికారులకు చెల్లించారు ఆలయం తరఫున సన్మానం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి ఈవో ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు


26, ఫిబ్రవరి 2024, సోమవారం

అయ్యప్ప స్వామికి స్వర్ణఖడ్గా బహూకరణ

 


నిజామాబాద్ పట్టణం అయ్యప్ప మందిరంలో సోమవారం శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి హంపి పీఠాధిపతులచే నిర్వహించిన చండీ హోమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి స్వర్ణఖడ్గం బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్ పాలు మాట్లాడుతూ ఈ పుణ్యకార్యంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు హరిహర సుతుని ఆశీర్వాదంతో హిందూ ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు ఈ మహాకార్యాన్ని తలపెట్టి విజయవంతంగా పూర్తి చేసిన ఆలయ కమిటీ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు స్వర్ణ కడగానికి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తన వంతుగా ఐదు లక్షల రూపాయలు స్వామివారి స్వర్ణ కడదానికి సమర్పించడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మేయర్ దండోయ్ తో కిరణ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ అసెంబ్లీ కన్వీనర్ లింగం భక్తవత్సలం ఆలయ కమిటీ చైర్మన్ సురేష్ గౌడ్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు

యాదగిరిగుట్టకు రెండంతస్తుల భవనం విరాళం

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే భవనాన్ని విరాళంగా ఇచ్చారు చైతన్యపురికి చెందిన టి శారద హనుమంతరావు దంపతులు 260 గజాల్లో నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని దేవస్థానం పేరిట సోమవారం సరూర్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ దాతలు శారద హనుమంతరావు దంపతులకు ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో భాస్కర శర్మ ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్ ఆలయ అధికారులు సత్యనారాయణ శర్మ ప్రసాదు పాల్గొన్నారు