కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆర్జిత సేవలను ఆన్లైన్లో బుక్ చేసుకుని సదుపాయం అందుబాటులోకి వచ్చింది దీనితో ఆర్చిత సేవలు టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన అవస్థ తప్పింది ఆలయంలో రోజు నిర్వహించే మొక్కుబడును అర్జిత సేవలు 25 రకాలుగా ఉన్నాయి అందులో 12 సేవలను టీ యాప్ లో పొందుపరిచారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
19, మార్చి 2024, మంగళవారం
10, మార్చి 2024, ఆదివారం
మల్లన్న ఆలయంలో పెద్దపట్నం
సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పెద్దపట్నం కళ్యాణం చేశారు శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటలకు మొదలై శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగింది స్వామి వారి పెద్దపట్నం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు ఆలయ ఒగ్గు పూజారులు పంచవన్ని రంగులతో నిలబయొక్క వరసల పట్నం వేసి స్వామివారికి యాదవ సంప్రదాయ కళ్యాణం జరిపించారు దర్బాలయం నుంచి వీరశైవ అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పెద్దపట్నం చుట్టూ ప్రదక్షిణలు చేసి పట్నం తొక్కడం ప్రారంభించారు అనంతరం భక్తులు మల్లన్నకు స్మరిస్తూ పట్నాన్ని విడతల వారీగా దాటారు
29, ఫిబ్రవరి 2024, గురువారం
కొమురవెల్లి ఆలయంలో విరాట్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్
విరాట్ ఫౌండేషన్ ఫ్లై హై కన్సల్టెన్సీ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం వద్ద భక్తులకు చల్లని మంచినీటిని అందించేందుకుగాను నెలకొల్పిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని కోరుతూ ఆ సంస్థ బాధ్యులు గురువారం సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సంస్థ డైరీ ని మంత్రికి ప్రధానం చేశారు కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తులకు మంచినీటిని అందించాలని గొప్ప సంకల్పంతో వాటర్ ప్లాంట్ నెలకొల్పిన విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు సభ్యులను మంత్రి అభినందించారు మంత్రిని కలిసిన వారిలో విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆకుల సోనియా సభ్యులు తానే సురేష్ పటేల్ తదితరులు ఉన్నారు
19, ఫిబ్రవరి 2024, సోమవారం
భక్తులతో నిండిన మల్లన్న క్షేత్రం
సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రమైంది స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం 30 వేల మంది భక్తులు తరలివచ్చారు భక్తులు కేశఖండన అభిషేకాలు పట్నాలు అర్చనలు ఓడి బియ్యం గంగ రేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి ముక్కులు తీర్చుకున్నారు ఆలయ ఈవో బాలాజీ ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పొర్పాటకం లక్ష్మారెడ్డి కమిటీ సభ్యులు అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలు అందించారు
15, ఫిబ్రవరి 2024, గురువారం
కొమురవెల్లి రైల్వే స్టేషన్ కు నేడు శంకుస్థాపన
సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నిర్మించనున్న రైల్వే స్టేషన్ హాల్టుకు గురువారం కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య ప్రాంతా అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు మనోహరాబాద్ కొత్తపల్లి నూతన రైలు మార్గంలోని కొమరవెల్లి లో కొత్త స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొని ఉన్నార
11, ఫిబ్రవరి 2024, ఆదివారం
కొమురవెల్లి క్షేత్రం భక్తజన సంద్రం
సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఎనిమిది వారాలపాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నాలుగో ఆదివారం మల్లన్న సన్నిధికి 35,000 మంది భక్తులు పోటెత్తారు ప్రత్యేక పూజలు చేసి ముక్కలు చెల్లించుకున్నారు వీఐపీ పాసులు పక్కదారి పడుతున్నాయని గత వారం వచ్చిన కథనానికి స్పందించిన ఆలయ వర్గాలు క్షేత్రంలో దర్శనం పాసుల జారీ ప్రక్రియను కఠిన తరం చేశాయి దీంతో కౌంటర్ వద్ద లేకుండా పోయింది




