1, మే 2026, శుక్రవారం

నైవేద్యాలలో ఉల్లి,వెల్లుల్లి ఎందుకు వాడరు..

 నీరుల్లిపాయ, వెల్లుల్లిపాయలు వినియోగం దైవ నివేదనలు ప్రసాదాలలో కనిపించదు. అలాగే పూర్వకాలం నుంచే కొన్ని వర్గాల వారికి వాటిని తమ ఆహారంలో వాటిని వినియోగించకపోవడం ఆచారంగా వస్తోంది .ఆధ్యాత్మిక సాధనకు, ప్రశాంత జీవనానికి సాత్విక ఆహారం ప్రధానమని సాధకులు చెబుతారు .నీరుల్లిని, వెల్లుల్లిని తామస రజోగునాలను పెంచే పదార్థాలుగా పూర్వులు పేర్కొన్నారు. అది కోపాన్ని ,ఆందోళనను, వాంఛలను పెంచుతాయి. కాబట్టి యోగ సాధనకు ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు.

ఘనంగా అష్టోత్తర శతఘటభిషేకం

 మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజున ఆలయంలో మూలమూర్తికి అష్టోత్తర శతఘటభిషేకం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచారణల మధ్య పూజారులు ప్రత్యేక పూజలు చేసి మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు.