తిరుమల శ్రీవారి ఆ లయం శుక్రవారం రాత్రి వైశాఖమాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి వారు గరుడనిపై ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు .పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సి వి ఎసవో మురళీకృష్ణ ,తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఆలయ పేష్కార్ లోకనాథం, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
SPIRITUAL KNOWLEDGE
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
2, మే 2026, శనివారం
శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రవేశాలు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026 27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగేండ్ల డిప్లమా ,రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సులకు ఈనెల 4 నుండి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు .పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు .దరఖాస్తులను కళాశాలలో నేరుగా పొందవచ్చు .పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20వ తేదీ సాయంత్రంలోగా అందజేయాలి. ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టిటిడి లక్ష రూపాయలను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి కోర్సు పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా స్వయం ఉపాధి అవసరాల నిమిత్తం అందజేస్తుంది. వివరాలకు శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ టిటిడి, అలిపిరి రోడ్డు ,తిరుపతి.. ఫోన్ నెంబర్ 0877 2264637 ను సంప్రదించాలి. వెబ్సైట్ www.tirumala.org
