9, మే 2026, శనివారం

గోదావరి తీరాన నాగవీరుడు భైరవుడి శిల్పాలు

 



నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర్ మండలంలో ని గోదావరి ఒడ్డున ఉన్న ప్రాచీన బ్రహ్మేశ్వర్ ఆలయ ప్రాంగణంలో తొమ్మిది నుంచి 12 వ శతాబ్దం మధ్య కాలానికి సంబంధించిన అరుదైన శిల్పాలు విగ్రహాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ కవి చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. ఇందులో నాగ వీరుడు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చెప్పారు అప్పటి నాగరాధనకు ప్రతీకగా లేదా యుద్ధంలో వీరమరణం పొందిన యోధుడి జ్ఞాపకార్థంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా గుర్రంపై కత్తి డాలు ధరించి యుద్ధానికి సాగుతున్న వీరుడు రూపంతో కూడిన మరో వీర గళ్ళు శిల్పాన్ని కూడా పరిసర ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు ఈ గోదావరి తీర గ్రామాలలో భైరవ సంప్రదాయం విస్తృతంగా ఆచరణలో ఉన్నట్లు ఇక్కడ లభిస్తున్న భైరవ విగ్రహాలను బట్టి తెలుస్తుంది అన్నారు ఆలయ పరిసరాలలో చతుర్భుజ భైరవుడు లజ్జ గౌరీ విగ్రహాలు కూడా లభించాయని తెలిపారు లజ్జ గౌరీ విగ్రహం జైన సంప్రదాయానికి చెందిన యక్షిని శిల్పాన్ని పోలి ఉందని తెలిపారు.

గంగమ్మ దేవి నూతన ఆలయ ప్రాణప్రతిష్ట

 



రామారెడ్డి మండల కేంద్రంలో గంగపుత్రుల కులదైవం శ్రీ గంగాభవాని దేవి గుడి నిర్మాణం భారీ దేయంతో నిర్మించడం జరిగింది. నూతన ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర గణపతి సుబ్రహ్మణ్య నందీశ్వర మరియు అద్భుతమైనటువంటి 62 అడుగుల ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వేద పండితుల మంథోత్సవాల మధ్య ఘనంగా శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు నెమలి నాగరాజు శర్మ వల్లంపట్ట నాగరాజు సహాయ పండితులు గణపతి పూజతో ప్రారంభించి పుణ్యాహవాచనం మూలమంత్ర హోమాలు యంత్ర ప్రతిష్ట పూర్ణాహుతి కుంబాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నుల పండుగ శివ కళ్యాణ మహోత్సవం వీక్షించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ పిలుపుమేరకు మండల అభివృద్ధి అధికారి నాగేశ్వర్ గుప్తా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికాంత్ పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం అధ్యక్షులు నామాల లింబాద్రి సెక్రటరీ నూతన ఆలయ నిర్మాణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నామాల రవి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మరియు గ్రామస్తులకు అధికారులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం రోజున సాయంత్రం మూడు గంటల నుండి గంగాభవాని దేవికి బోనాలను సమర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించి మరుసటి రోజు ఆదివారం ఇళ్ళకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు కావున బోనాల ఉత్సవాల ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొని గంగాభవాని తల్లి ఆశీస్సులు పొందాలని కోరారు ఇట్టి కార్యక్రమానికి సహకారం అందించిన గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ పాలకవర్గ సభ్యులకు గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.