నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర్ మండలంలో ని గోదావరి ఒడ్డున ఉన్న ప్రాచీన బ్రహ్మేశ్వర్ ఆలయ ప్రాంగణంలో తొమ్మిది నుంచి 12 వ శతాబ్దం మధ్య కాలానికి సంబంధించిన అరుదైన శిల్పాలు విగ్రహాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ కవి చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. ఇందులో నాగ వీరుడు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చెప్పారు అప్పటి నాగరాధనకు ప్రతీకగా లేదా యుద్ధంలో వీరమరణం పొందిన యోధుడి జ్ఞాపకార్థంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా గుర్రంపై కత్తి డాలు ధరించి యుద్ధానికి సాగుతున్న వీరుడు రూపంతో కూడిన మరో వీర గళ్ళు శిల్పాన్ని కూడా పరిసర ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు ఈ గోదావరి తీర గ్రామాలలో భైరవ సంప్రదాయం విస్తృతంగా ఆచరణలో ఉన్నట్లు ఇక్కడ లభిస్తున్న భైరవ విగ్రహాలను బట్టి తెలుస్తుంది అన్నారు ఆలయ పరిసరాలలో చతుర్భుజ భైరవుడు లజ్జ గౌరీ విగ్రహాలు కూడా లభించాయని తెలిపారు లజ్జ గౌరీ విగ్రహం జైన సంప్రదాయానికి చెందిన యక్షిని శిల్పాన్ని పోలి ఉందని తెలిపారు.

