8, సెప్టెంబర్ 2026, మంగళవారం

భంగారం బిడాయి అంటే..

 



ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి ,భక్తుల ప్రార్థనలు, డప్పుల మోతతో ,పట్టణ సరిహద్దులు దాటిన తర్వాత పూజా సామాగ్రిని అక్కడే వదిలివేయడం.. చత్తీస్గఢ్లోని నారాయణపూర్ లో ఇది ఎన్నో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం .దీనిని భంగారం బిడాయి అంటారు .ప్రజల అనారోగ్యాలు, దుఃఖాలను, బాధలు, కష్టాలను భంగారం దేవుడు తన వెంట తీసుకువెళ్లి, ఆ ప్రాంతానికి శాంతి ,సౌభాగ్యం ,మంచి పంటలను ప్రసాదిస్తాడని స్థానికులు విశ్వాసంతో ఈ వేడుకను నిర్వహిస్తారు .రక్షాబంధన్ తర్వాత శ్రావణమాసం చివరలో, భాద్రపద మాసం ప్రారంభ సమయంలో ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేస్తారు.  స్థానిక మాత మావిలీ ఆలయంలో పవిత్ర దారం కట్టడంతో ఈ సంప్రదాయం ప్రారంభమవుతుంది. వేడుకలలో భక్తులు పసుపు, నూనెలతో  పాటు తమ మొక్కులు ,కానుకలు దేవుడికి సమర్పిస్తారు .వాటన్నింటినీ సేకరించి ఆలయ ప్రాంగణంలోని ఒక రాయి కింద భద్రపరుస్తారు .పూజల అనంతరం బయటకు తీసి ప్రత్యేకంగా సిద్ధం చేసిన పల్లకిలో ఉంచుతారు ."సారా " అని పిలిచే పూజారులు ఆ పల్లకిని డప్పుల మోతమధ్య తీసుకెళ్లి, ఊరి చివర పొలిమేరలో విడిచిపెడతామని దేవ్ కమిటీ ఉపాధ్యక్షుడు అర్జున్ దేవాంగన్ తెలిపారు. 

వక్కలతో.. వినాయకుడు

 


వినాయక చవితి పండుగ ఇంకా రాకమునుపే రకరకాల గణపయ్య ప్రతిమలు భక్తులను ఎంతో అలరిస్తున్నాయి. తిరుపతి నుండి కరకంబాడి కి వెళ్లే మార్గంలోని బొమ్మల  క్వార్టర్స్ వద్ద 46 కిలోల, సుమారు 1,80,000  వక్కలతో ఏడడుగుల పర్యావరణహిత విగ్రహం ముస్తాబయింది. దీనిని కళాకారుడు రాము కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధం చేశారు. నిమజ్జనం చేసే సమయంలో పర్యావరణం కలుషితం కావద్దనే ఉద్దేశంతో తిరుపతికి చెందిన పలువురు భక్తులు ప్రత్యేకంగా తయారు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు .ఇందుకోసం కడప నుంచి వెడల్పు ఎక్కువగా ఉన్న వక్కలు తెప్పించామని చెప్పారు. విగ్రహం తయారీకి 15 రోజులు పట్టిందని , ఒక లక్ష పదివేల రూపాయల ఖర్చు అయిందని రాము వివరించారు .