11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం..

 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల ప్రవాహం కొనసాగుతున్నది . తాజాగా శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డ్ స్థాయికి చేరింది. గురువారం ఒక్క రోజు హుండీ ద్వారా 6 కోట్ల 93 లక్షల రూపాయలు ఆదాయం లభించినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు .ఇది ఇటీవలి కాలంలో నమోదైన అత్యధిక ఒక్కరోజు ఆదాయాలలో ఒకటిగా నిలిచింది .



తిరుమల చరిత్రలో ఇప్పటివరకు హుండీ ఆదాయం 6 కోట్ల రూపాయల మార్పును దాటడం కేవలం నాలుగు సార్లు మాత్రమే జరగడం విశేషం. 

మరుగోళ్ళ పోటీలు అంటే..

 పోలాల అమావాస్య అంటే.. 

శ్రావణం సకల దేవతలకు ప్రీతికరమైన మాసం.. ఈ మాసం సమృద్ధికి ఆలంబనం. ఈ నెలలో ప్రతి రోజూ విశేషమైనదే. ఈ మాసంలో చివరి రోజైన శ్రావణ బహుళ అమావాస్యను "పోలాల అమావాస్య" అంటారు.దీనిని కౌశి అమావాస్య , ఆలోక అమావాస్య గా కూడా పూర్వ గ్రంథాలు పేర్కొన్నాయి.ప్రధానంగా ఇది శక్తి పూజ .ముత్తైదువులు దీన్ని ఆచరిస్తారు. పోలాంబకు ప్రతీకగా కంద మొక్కను పూజా మండపం మీద ప్రతిష్టించి పూజిస్తారు. వరి దుబ్బును కూడా పూజించే ఆనవాయితీ ఉంది. తోరాలను కట్టి ,వాటిని అమ్మవారికి అర్పించి , తమ చేతులకు ,ఇంట్లోని ఆడపిల్లల చేతులకు కట్టుకుంటారు. పోలాంబను పూజించడం వల్ల కుటుంబ సౌఖ్యం, సిరి సంపదలు ,సౌభాగ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.నందీశ్వరుడు జన్మించిన రోజు ఇదే అని పురాణాలు చెబుతున్నాయి.కాబట్టి పలు ప్రాంతాలలో రైతులు తమకు సాగులో సాయం చేసే బసవన్నలకు వృషభ పూజను నిర్వహిస్తారు. దీనిని " ఎడ్ల పొలాల అమావాస్య " అని కూడా అంటారు.



ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం పోలాల పండుగ సంబరంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను రంగు రంగుల దుస్తులతో, బెలూన్లతో అలంకరించారు.అనంతరం వీధులలో ఊరేగించారు. గ్రామ దేవతల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 



తర్వాత ఎడ్లను పూజించి నైవేద్యం సమర్పించారు.వాటికి నైవేద్యం పెట్టిన తర్వాత ఉపవాసం వీడడం ఇక్కడి రైతుల సంప్రదాయం.



సీతాదేవి ఆలయం, నువారా ఎలియా జిల్లా,శ్రీలంక.

మరుగోళ్ళ పోటీలు..అంటే..

ఆదివాసీ సంస్కృతి,సాంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి.వాటిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. పోలాల అమావాస్య రోజున సాంస్కృతిక గిరి ఆధ్వర్యంలో ఉట్నూర్ ఐటిడిఏ ప్రాంగణంలో మరుగోళ్ళ పోటీలు ప్రారంభం అయ్యాయి.ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల ఆచారాలు ,పండుగలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.వీటి పరిరక్షణకు ఐటిడిఏ విశేష కృషి చేస్తోంది.