16, మే 2026, శనివారం

ఆధ్యాత్మిక సమాచారం,16-5-2026

 ముగిసిన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు..



ఆత్మకూరులో మూడు రోజులగా కొనసాగుతున్న మరకత లింగేశ్వర స్వామి విగ్రహ పతిష్టాపన ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు పేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయంలో మరకత లింగాన్ని ప్రతిష్టించారు దీనితో పాటు ఆలయంలో యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట తదితర కార్యక్రమాలను నిర్వహించారు కాక ఆలయం వద్ద జరిగిన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు వేరువేరుగా హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.


వైభవంగా కోటి కుంకుమార్చన.. 



నవీపేట మండలంలోని బినోల గ్రామంలో శుక్రవారం సామూహిక కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు పురోహితుడు కృష్ణ ప్రసాద్ జోషి ఆధ్వర్యంలో భువనేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో ఈ కోటి కుంకుమార్చన చేపట్టారు ఇప్పటివరకు 42 శుక్రవారం చేపట్టగా ఈనెల 22న జరిగే పూర్ణాహుతితో ముగుస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు పాల్గొన్నారు.

సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు..


కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్డలూరు గ్రామ శివారులో గల నిలిచిపూర్ శ్రీ సరస్వతి దేవి ఆలయంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శుక్రవారం అమ్మవారికి పర్వదినం కావడంతో ఉదయం నుంచి భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి కుంకుమార్చనలు హారతి అక్షరాభ్యాసం వంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా చేపట్టారు అనంతరం భక్తులు అమ్మవారికి మొక్కుల తీర్చుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు
 ఆలయానికి వచ్చే భక్తులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను ఆలయ  ధర్మకర్త కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పార్సి విఠల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

.

యాదగిరి క్షేత్రానికి జాతీయ గుర్తింపు

 యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం మరో అరుదైన రికార్డ్ సాధించింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 29వ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా న్యూ ఢిల్లీలో జరిగిన సదస్సులో శుక్రవారం ఆలయ ఈవో భవాని శంకర్ పాల్గొన్నారు ఆలయ డిజిటల్ సేవలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు తీవ్ర కాలంలో యాదగిరి క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఆలయాధికారులు భక్తులకు డిజిటల్ సేవలు చేరువ చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు దీంతో నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ అధికారులు ఇటీవల యాదగిరి క్షేత్రాన్ని సందర్శించి పరిశీలించి సేవలతో భక్తులు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు. ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని అంశాలపై అధ్యయనం చేశారు 82 దరఖాస్తులు లో జాతీయస్థాయి ఈ గవర్నెన్స్ 29వ సదస్సులో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా 82 దరఖాస్తులు వివిధ విభాగాల నుంచి అందాయి ఇందులో 32 ప్రాజెక్టులతో షార్ట్ లిస్ట్ తయారు చేశారు ఫిస్టులో తెలంగాణ నుంచి యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉండటం విశేషం. ఈ నెల 14న యాదగిరి దేవస్థానం ఈవో బృందం ఢిల్లీకి వెళ్లి జూరీ సమక్షంలో ఫైనల్ ప్రెసెంటేషన్ సమర్పించింది ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జాతీయస్థాయిలో యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరింత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.