3, మే 2026, ఆదివారం

శివుడికి తల్లి అయిన బెజ్జమహాదేవి

 


శివుడిని కొడుకుగా భావించిన బెజ్జమహాదేవి శిల్పం నిజామాబాద్ జిల్లా బెజ్జోరా గ్రామంలోని బెజ్జం దేవి గుడిలో ఉన్నది. వీరశైవ భక్తురాలైన అక్కమహాదేవి శిల్పం ప్రసిద్ధం. ఇక్కడ బెజ్జమహాదేవి విగ్రహం అంతటిది. పాల్కురికి సోమన బసవ పురాణంలో బెజ్జమహాదేవి కథ రాస్తూ ఆ పిజ్జా మహాదేవి అందరికీ అందరు ఉన్నారు కానీ శివునికి తల్లి ఉన్నట్లయితే తాపసిని కానిస్తుందా జుట్టు జడలు కట్టనిస్తుందా తల్లుంటే విషం తాగనిస్తుందా తోళ్లు కట్టనిస్తదా.. పాముల ధరింపనిస్తుందా బూడిద పూసుకొని స్తుందా. పల్లకాటిలో ఉండనిస్తుందా తల్లి లేనందువల్లనే కదా శివుడికి నికష్టాలు నేనే శివునికి తల్లిని అవుతానని పిచ్చమహాదేవి లింగమూర్తిని కొడుకును చేసుకుని చంటి బిడ్డకు అభ్యంగన స్నానాలు చేయించినట్టు తాను స్నానం ఆడిస్తున్నదట. ఉగ్గు తినిపిస్తున్నదట ముద్దాడుతున్నదట ఆమె చేస్తున్న బాల్యోపచారాలకు శివుడు మిర్చి ఆమె వద్ద శిశువు గానే ఉండిపోయాడట బెజ్జ మహదేవి శివుణ్ణి నాకున్న, నా పట్టి ,నా చిన్న పడగ, నా కుర్ర అని గారాబాలు చేసింది  తన ఒడిలో పడుకోబెట్టుకుని తన్మయం చెందిందని వర్ణిస్తాడు.



బెజ్జూరలో బెజ్జమహాదేవి శిల్పము 

శివుడిని కొడుకుగా భావించిన బెజ్జమహాదేవి శిల్పము నిజామాబాద్ జిల్లా బెజ్జోరా గ్రామంలోని దేవి గుడిలో ఉన్నది వీరశైవ భక్తురాలైన అక్క మహాదేవి శిల్పము ప్రసిద్ధము ఇక్కడ బెజ్జమహాదేవి విగ్రహము అలా అంతటిది. ఈ శిల్పాన్ని మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ చూసి ప్రతిమ లక్షణాలను గుర్తించడం కోసం ఫొటోలు పంపాడు.



గుహలో వెంకటేశ్వరుడు

 


సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్ గ్రామ ఈశన్య దిశలో ఉన్న గుట్టల ప్రాంతంలో సుమారు 150 ఏళ్ల క్రితం వెంకటేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిశారు ఒకరోజు అకస్మాత్తుగా గుట్ట చీలిపోయి అందులో చిన్న గుహ ఏర్పడింది ఆ గుహలో నుంచి వినిపించిన ఘంటానాదం స్వయంగా వెలిగిన దీపజ్యోతి ఈ దృశ్యాలు గ్రామ ప్రజలలో భక్తి జ్యోతిని రగిలించాయి ఆ గుహలో వెలిసిన నిరాకార స్వరూపాన్ని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలవడం ప్రారంభించారు అప్పటినుంచి ఈ క్షేత్రం కొత్త దేవుడిగా ప్రసిద్ధి చెందింది ఏటా శ్రవణ మాసంలో కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో పెద్దలతో కలిసి భక్తులు వనభోజనాలు చేస్తారు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు ఇక్కడ నిర్వహించే వనభోజనాలు ప్రత్యేక పూజలు ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి భక్తులు ముడుపులు కడుతూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు ఈ గుహకు తూర్పు దిశలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం ఈ ప్రాంతానికి మరో ఆధ్యాత్మికత పరిమళాన్ని జోడిస్తోంది గుహ సమీపంలో విరాజిల్లే భారీ మర్రిచెట్టు దాని నీడలో కూర్చుని జపమాలలు తిప్పే భక్తులు గాలిలో తేలే మంత్రం ఈ దృశ్యాలు ఈ క్షేత్రాన్ని ఒక జీవంత ఆధ్యాత్మిక ప్రపంచంగా నిలబెడుతున్నాయి. ఇంతటి ఆధ్యాత్మిక విశిష్టత ఉన్నప్పటికీ ఈ క్షేత్రం ఇప్పటికీ నిరాదరణలోనే ఉంది ఆలయ నిర్మాణం లేకపోవడం రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉండడం తాగునీరు విద్యుత్ వంటి కనీస వసతులు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఒక చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలయ నిర్మాణం రహదారులు తాగునీరు విద్యుత్తు విశ్రాంతి గృహాలు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.