ఈ పూజ ఆదివాసీ ప్రజలు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం లోని చింతల సాంగ్విలో సిడాం పరివార్ ఆది వాసీలు సోమవారం నోవొంగ్ పూజ ను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలకరి పంటల ద్వారా వచ్చిన కొత్త ధాన్యం , కాయ గూరలు పండ్లను కుల దైవాలు పెర్సా పేన్, సతిక్ దేవతలకు అర్పించారు. సామల బియ్యానికి నెయ్యి కలిపి తయారు చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని , మినుములతో చేసిన గారెలను నైవేద్యంగా నివేదించారు.
SPIRITUAL KNOWLEDGE
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
1, సెప్టెంబర్ 2026, మంగళవారం
30, ఆగస్టు 2026, ఆదివారం
భక్తి శ్రద్ధలతో.. తిట్ల వర్షం..
వాన పడకపోతే దేవుణ్ణి నిందించడం ఎక్కడైనా విన్నామా? కర్ణాటక రాష్ట్రంలో విజయనగరం జిల్లా హోస పేటె గ్రామంలో ఇలాంటి ఆచారం ఉంది. పట్టణ శివారులోని కాటమయ్య ఆలయానికి సాధారణ రోజుల్లో భక్తులెవరూ వెళ్ళరు. సరైన సమయంలో వర్షాలు కురవక పోతేనే ఆ ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఈ ఏడాది ఇంకా వాన చుక్క లేకపోవడంతో స్థానికులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి , దేవుడిపై తిట్ల వర్షం కురిపిస్తూ ప్రదక్షిణలు చేశారు. ఇలా చేస్తే కాటమయ్య వర్షాలు కురిపిస్తాడని పూర్వం నుంచి విశ్వసిస్తున్నారు. ప్రదక్షిణ పూర్తయిన గంట తర్వాత పట్టణంలో ఒక మోస్తరు వర్షం పడడం విశేషం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
