15, మే 2026, శుక్రవారం

ఆధ్యాత్మిక సమాచారం 15 మే 2026

 25 లక్షల తో గోశాల ఏర్పాటు..




 కామారెడ్డి జిల్లా పెద్ద కొడంగల్ మండలం కస్లాబాద్ కి చెందిన వ్యాపారవేత్త పత్తి సంతోష్ గోవులపై ఉన్న మమకారంతో తన వ్యవసాయ క్షేత్రంలో 25 లక్షల రూపాయలతో నందగోకులం పేరిట నిర్మించిన గోశాలను శ్రీశ్రీశ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా వారం ప్రారంభించారు అనంతరం సరస్వతీ స్వామి మాట్లాడుతూ గోవులకు సేవ చేయడం గొప్ప విషయం అన్నారు అనంతరం అన్నదానం నిర్వహించారు నాయకులు సతీష్ యాదవ్ రిషప్ప పటేల్ తదితరులు పాల్గొన్నారు..

తాడుకోలు అఖండ హరినామ సప్తాహం.. బాన్సువాడ మండలంలోని తాడుకోలు గ్రామంలో గల విటళేశ్వర ఆలయంలో బాల యోగి శ్యామ్ సుందర్ గిరి స్వామీజీ  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తః గురువారం నాలుగవ రోజుకు చేరుకుంది .ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు భక్తుశ్రద్ధలతో ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలను నిర్వహించారు. గురువారం ముంబై నర్సింలు మహారాజ్ నామ కీర్తనలు ఆలపించి భక్తులను ఆధ్యాత్మిక భావంతో ముంచెత్తారు .కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు. 



పంచముఖి హనుమాన్ ఆలయ వార్షికోత్సవము.. కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయ వార్షికోత్సవం నిర్వహించారు కేతపండితో ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు కళ్యాణోత్సవం అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఏడు నుంచి 11 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు నిర్వహించారు. 

శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ గోశాలకు వరిగడ్డి అందజేత..



భిక్కనూరు మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ గోశాలకు గురువారం గడ్డి కట్టలను అంద చేశారని ఆలయ కమిటీ చైర్మన్ తాటిపాముల లింబాద్రి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతు కందడి ప్రభాకర్ మెదక్ జిల్లా అక్కన్నపేట గ్రామానికి చెందిన పోలీస్ కిష్టయ్య పెద్ద మల్లారెడ్డి కి చెందిన రవీందర్ రెడ్డి గడ్డి కట్టలను అందజేశారు అనంతరం రైతులను సన్మానించే స్వామ ప్రసాదాన్ని అందజేశారు.

అంబారిపేటలో ఆలయాల పునః నిర్మాణము 



దోమకొండ మండలంలోని అంబర్పేట గ్రామంలో వెంకటేశ్వర ఆలయం శివాలయాల పునర్నిర్మాణానికి దాతగా ముందుకు వచ్చిన గ్రామానికి చెందిన గునిగంటి ప్రభాకర్ రావు ముందుకు వచ్చినట్లు సర్పంచ్ అరుట్ల కవిత తెలిపారు సొంత నిధులతో రెండు గుడుల పునరుద్ధరణకు సుమారుగా 25 లక్షలతో కుడి పనులను ప్రభాకర్ రావు మేనకోడలు సురభి నిర్మల సత్యం రావు చేతుల మీదుగా పనులను ప్రారంభించారు కార్యక్రమంలో ఆరుట్ల అనిల్ ఉప సర్పంచ్ సత్య గౌడ్ పంతులు కృష్ణమాచార్యులు దేవాలయ కమిటీ అధ్యక్షులు నీల గంగాధర్ 6 వ వార్డ్ మెంబర్  ఫిరంగి అశోక్ బిలకుర్తి స్వామి గ్రామస్తులు అశోక్ రావు దామోదర్ రావు మిరుదొడ్డి నరసయ్య పాల్గొన్నారు



రాజన్న హుండీ ఆదాయం రెండు కోట్లు 

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి వారి హుండీకి రెండు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది గత 44 రోజుల నుండి ఆదాయాన్ని భీమేశ్వర సదన్ పార్కింగ్ స్థలంలో లెక్కించగా రెండు కోట్ల 17810 నగదు 175 గ్రాముల బంగారం 12 కిలోల 200 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఉండే లెక్కింపును ఆలయ ఇవ్వు రమాదేవి కరీంనగర్ ఏసి కార్యాలయానికి చెందిన రాజమౌళి పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య నిర్వహించారు 

అంజన్న పెద్ద జయంతి ఆదాయం ఒక కోటి 74 లక్షలు 



జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 15 నుండి 12 వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆలయానికి ఒక కోటి 74 లక్షల 18 వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో అంజన రెడ్డి తెలిపారు గత జయంతితో పోలిస్తే ఈసారి 24 లక్షలు అధికంగా వచ్చినట్లు తెలిపారు.

ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు..



విజయానికి స్ఫూర్తి ఆంజనేయ స్వామి అని ప్రజలు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు గురువారం పోతంగల్ మండలం హంగర్గాలో నూతన ఆలయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాన్ని తెలిపారు ప్రతి గ్రామంలో ఆలయాల అభివృద్ధికి గ్రామస్తులు పాటుపడాలని పేర్కొన్నారు .


ప్రాచీన చరిత్ర కలిగిన పెద్దంగంటి ఎల్లమ్మ

 నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బడా భీంగల్ విరజానది ఒడ్డున గల పెద్దంగంటి ఎల్లమ్మకు 700 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈ గ్రామ దేవత 14వ శతాబ్దానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరిగోపాల్ రూడీ పరిచారని అన్నారు. ప్రధాన నల్లరాతి ఎల్లమ్మ విగ్రహం యొక్క ముఖము, చేతులు భిన్నమైనందున తమ చేతులలో ధరించిన పరికరాలు కనిపించడం లేదు. ఎల్లమ్మ అపార శక్తి స్వరూపిణి మాతగా ఆది, మంగళవారాలలో భక్తుల పూజలు అందుకుంటుంది. ఎల్లమ్మ ముందు పరశురాముని తల్లి రేణుకా దేవి విగ్రహం ఉంది .ఎల్లమ్మ పక్కనే ఒక వేప చెట్టు కానుకొని ఉన్న శిథిల రండంతస్తుల వీరగల్లు పదవ శతాబ్దం చాళుక్యుల కాలానికి చెందిన వీరగల్ల శిల్పం ఉంది. రెండో అంతస్తులో వీరులు తలబడే తీరు గతంలో ఏ వీర గల్లులో కనబడలేదు. పై అంతస్తు విరిగిపోయింది .ఒక్క వీరున్ని రెండు వైపులా నుంచి ఇద్దరు దాడి చేస్తున్నట్టుంది. ఇలాంటి వీరగల్లు శిల్పం చాలా అరుదు .చరిత్రకారుడు కంకణాల రాజేశ్వరి వెంట భీమ్గల్ సర్వ సమాజాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు తీగల రఘు ,రామ్ గిరి ఆనంద్ ఉన్నారు.