నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆర్ అండ్ బి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి మోహన్ నాయక్ దర్శించుకున్నారు వీరికి ముందుగా స్థానిక మాజీ సర్పంచ్ డి లక్ష్మణరావు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి మోహన్ నాయక్ పూజ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వీరి కాలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామంలోని బొర్రా గణేశా ఆలయం నుండి మహాలక్ష్మి ఆలయం శ్రీ పాప హరేశ్వర ఆలయం శ్రీ దత్తాత్రేయ ఆలయం నుండి సరస్వతి అమ్మవారి ఆలయం వరకు బైపాస్ సీసీ రోడ్డు రహదారి కొరకై ప్రత్యేకంగా ఆరు కోట్ల రూపాయల నిధులతో పనులు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఈ పనులు పూర్తయితే బాసర మండల కేంద్రానికి వచ్చే గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
29, ఫిబ్రవరి 2024, గురువారం
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
అమ్మవారి సన్నిధిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సోమవారం భారత ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారి మనుమడు విరాట్ కో అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు అంతకుముందు వీరికి ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు ఆలయ ఈవో విజయరామారావు అర్చకులు అమ్మవారి ప్రసాదాలను ఆశీర్వచనాలను అందజేశారు
26, ఫిబ్రవరి 2024, సోమవారం
బాసర గోదావరి నది వద్ద స్వచ్ఛభారత్
నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం అయినటువంటి సద్గురు మాతా సుదీక్షకి మహారాజ్ ఆధ్వర్యంలో సంత నిరంకార్ నిజామాబాద్ బ్రాంచ్ సంయోజకర్ లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ప్రాజెక్టు అమృత స్వచ్ఛమైన మీరు స్వచ్ఛమైన మనసు అనే కార్యక్రమంలో నిరంకారీ సేవాదాల సభ్యులందరూ పాల్గొని గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నది పుష్కర ఘాట్లతో దశరథ మహారాజ్ ఆశ్రమం పరిసర ప్రాంతాలలోని చెత్తాచెదారాన్ని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సుమారు వందమంది కార్యకర్తలు పాల్గొన్నారు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను పుష్కర ఘాట్లను చెత్తాచెదారం లేకుండా తొలగించారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్లాస్టిక్ వ్యర్ధాలపై అవగాహన కల్పించారు పవిత్ర గోదావరి నదిని అపవిత్రం చేయకుండా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని సూచించారు.
25, ఫిబ్రవరి 2024, ఆదివారం
బాసర ఆలయంలో చతుర్వేద సరస్వతి హోమం
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రతినెలా మోస పౌర్ణమి సందర్భంగా శనివారం చతుర్వేద సరస్వతి మంత్ర సహిత చండీ హోమం నిర్వహించారు శ్రీ మహాలక్ష్మీ మహాకాళి శ్రీ సరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద పండితులు ఉదయం ఆలయంలో గణపతి పూజా కళాశాపన రక్షాబంధనం పుణ్యాహవాచనము దక్ష సంకల్పంతో విశేష పూజలు నిర్వహించార
23, ఫిబ్రవరి 2024, శుక్రవారం
బాసరలో ఆర్జిత సేవలకు సంప్రదాయ దుస్తులు
బాసర అమ్మవారి ఆలయంలో అచ్యుత సేవలు అభిషేక పూజలు చేసే భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించాలని సూచిస్తూ ఆలయ పరిసరాలలో బోర్డులు ఏర్పాటు చేశారు ఆయా పూజలకు పురుషులు ధోవతి పంచే తెల్లటి చుక్క కండువా మహిళా భక్తులు చీర అమ్మాయిలు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు మార్చి ఒకటి నుంచి అమలు చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
15, ఫిబ్రవరి 2024, గురువారం
సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ
బాసరలో వసంతం పంచమిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం బందోబస్తును పర్యవేక్షించారు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు సిబ్బందికి పలు సూచనలు చేశారు భక్తుల దర్శనం ప్రశాంతంగా జరుగుతోందని ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ముధోల్ సిఐ మల్లేష్ బాసర ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
భక్తజన బాసర.. వసంత పంచమి
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం బుధవారం భక్తజనసంద్రంగా మారింది పిల్లలకు అక్షరాభ్యాస పూజలు చేయించేందుకు రాష్ట్రం తో పాటు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు అదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎమ్మెల్సీ దండ విటల్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు
14, ఫిబ్రవరి 2024, బుధవారం
సరస్వతీ మాత భక్తులకు స్నాక్స్ అందజేత
వసంత పంచమి సందర్భాన్ని పురస్కరించుకొని కాలినడకన బాసరకు వెళుతున్న సరస్వతి మాత భక్తులకు పోతంగల్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బచ్చు శేఖర్ సెట్ మంగళవారం స్నాక్స్ వాటర్ బాటిల్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూరు నుండి మొదలైన ఈ పాదయాత్ర బాసర టెంపుల్ వరకు సుమారు 70 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుందన్నారు ఈ పాదయాత్రలో సుమారు 68 మంది సరస్వతి మాత భక్తులు పాల్గొన్నట్లయితే తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల తన మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని తెలిపారు కార్యక్రమంలో భీమ్సేట్ భక్తులు తదితరులు పాల్గొన్నారు
భక్తులకు పండ్లు వాటర్ పంపిణీ
బాన్స్వాడ నుండి బాసరకు కాలినడకన వస్తున్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు థర్డ్ బిలోలిలో పండ్లు వాటర్ బాటిల్ ని పంపిణీ చేశారు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు అష్టం శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో భక్తులకు వాటర్ సౌకర్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు గుజ్జుల సాయి రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా తదితరులు పాల్గొన్నార
బాన్సువాడ నుంచి బాసరకు భక్తుల పాదయాత్ర
బాన్సువాడ నుండి ప్రారంభమైన భక్తుల పాదయాత్ర మంగళవారం బోర్గం మీదుగా బాసరకు చేరుకుంది వసంత పంచమే వేడుకలను పురస్కరించుకొని భక్తులు ప్రతి ఏటా బాసరకు కాలినడకన వెళ్లడం ఆనవాయితీగా మారింది ఈ సందర్భంగా మార్గమధ్యంలో బూర్గం గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వసంత పంచమి వేడుకల సందర్భంగా 1993 నుండి కాలినడకన బాసర పీఠాధిపతిని చేరుకుంటామన్నారు వసంత పంచమికి 46 ఒక్కరోజు ముందు భక్తులు మండల దీక్షలు నిర్వహిస్తారు వేడుకలకు రెండు రోజుల ముందు బాన్స్వాడ నుండి కాలినడకన బాసర వరకు భక్తులు పాదయాత్ర చేపడతారు నెమ్లి సాయిబాబా మందిరం బోధన్ రెడ్డి తదితర ప్రాంతాలలో బిక్షలు ఏర్పాటు చేసుకుంటారు బాసర సరస్వతి మాత ఆలయానికి చేరుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు ఉన్నారు
బీర్కూర్ నుంచి బాసరకు మహాపాదయాత్ర
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బీర్కూరు మండల కేంద్రం నుంచి గురుస్వామి సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో వందలాదిమంది భక్తులు మహా పుణ్యక్షేత్రమైన బాసరకు మహాపాదయాత్రను చేపట్టారు బీర్కూరు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పెద్దహవారి గంగారాం జండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా వసంత పంచమి సందర్భంగా బీర్కూర్ నుంచి చదువుల తల్లి కొలువుదీరిన బాసర వరకు పాదయాత్ర నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తుందన్నారు గత తొమ్మిదేళ్లుగా నిర్విరామంగా పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు బుధవారం బాసరలో అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతామన్నారు పాదయాత్రకు తరలి వెళ్లిన వారిలో లింగం బాలకృష్ణ డాక్టర్ బాలకృష్ణ రాజేందర్ రాజు విట్టల్ గోపాల్ గోపి ఆకాష్ కుమార్ సంతోష్ యోగేష్ తదితరులు ఉన్నారు
బాసర ఆలయానికి హుండీల అందజేత
బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఒడిబియ్యం హుండీలను మంగళవారం కామారెడ్డి జిల్లా ఆరుగొండ గ్రామానికి చెందిన కందాడి నరేందర్ రెడ్డి కీర్తిశేషులు కందాడి జగ్గమ్మ జ్ఞాపకార్థం అందజేశారు వీరి వెంట మమ్మాయి సచిన్ ఆలయ అధికారులు పాల్గొన్నారు
9, ఫిబ్రవరి 2024, శుక్రవారం
వసంత పంచమి వేడుకలకు ఆహ్వానం
ఈనెల 12 నుంచి 14 వరకు అమ్మవారు కొరవైన బాసరలో నిర్వహించే వసంత పంచమి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కమిషనర్ అనిల్ కుమార్ కు బుధవారం ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికలను అందించారు ఈ నెల 14న రావాల్సిందిగా మంత్రిని కోరగా వేడుకలకు తప్పకుండా హాజరవుతానని సానుకూలంగా స్పందించినట్లు వారు ఒక ప్రకటనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇవ్వు విజయరామారావు చైర్మన్ ప్రధాన అర్చకులు సంజీవ్ పేద పండితులు పాల్గొన్నారు
బాసర ఆలయంలో ఈనెల 12 నుంచి 14 వరకు వసంతం పంచమి వేడుకలకు నిర్వహించనున్నారు ఈవో విజయరామారావు వైదిక బృందం సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు ఆలయ చైర్మన్ అర్చకులు తదితరులు పాల్గొన్నార















