మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి సిరిసిల్ల వాస్తవ్యులు ముత్యంరావు లక్ష్మీ దంపతులు తమ వంతు సహాయంగా ఆలయ ప్రాంగణంలోని నాగుపాము పుట్టపైన రేకుల షెడ్డు నిర్మాణానికి 1,50,000 ఇచ్చుటకు వాగ్దానం చేసి 50 వేల రూపాయలను అడ్వాన్సుగా మంగళవారం ఆలయ అధికారులకు చెల్లించారు ఆలయం తరఫున సన్మానం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి ఈవో ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
19, ఫిబ్రవరి 2024, సోమవారం
చుక్కాపూర్ లక్ష్మీనరసింహుడికి పూజలు
మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వాహన పూజలు పుట్టు వెంట్రుకలు గండ దీపాల ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు హైదరాబాద్ కు చెందిన కాసుల మధు సరిత స్వామి వారి ఆలయ అభివృద్ధికి ఐదువేల ఒక వంద రూపాయలు విరాళంగా అందజేశారు అర్చకులు పరంధామాచార్యులు సంజీవచార్యులు ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు
11, ఫిబ్రవరి 2024, ఆదివారం
చుక్కాపూర్ లో భక్తుల సందడి
మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు జిల్లా నలుమూలలతో పాటు ఇతర జిల్లాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఓడి బియ్యం పట్టినామాలు కోరమీసాలు కండ్లు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించారు ఆలయ కమిటీ సిబ్బంది భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు


