శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు బుధవారం ఉదయం భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు సాయంత్రం స్వామి అమ్మవార్ల పుష్ప పల్లకి ఉత్సవం శోభాయ మానంగా సాగింది
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
6, మార్చి 2024, బుధవారం
5, మార్చి 2024, మంగళవారం
శ్రీశైలం మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు
స్థలం ఇస్తే 200 గదుల భవనం కడతాం అంటున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి గారు
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున సమర్పించడం సంగతి తెలిసిందే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నాలుగో రోజైన సోమవారం మయూర వాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం మయూర వాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు శివ స్వాములతో శ్రీశైలం పోటెత్తింది భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం టిటిడి ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టిటిడి దేవస్థానం తరఫున 200 గదుల భవనం కడతామని ప్రకటించారు క్షేత్రంలో టీటీడీ సత్రం పాత పడడంతో వాటిని ఆధునికరిస్తామని చెప్పారు
2, మార్చి 2024, శనివారం
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలిరోజు వేద పండితులు అర్చకులు యాగశాల ప్రవేశం చేసి అంకురార్పణ చేశారు రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ భేరీ పూజ నిర్వహించి సకల దేవతలకు ఆహ్వాన సూచికగా ద్వజపతాకాన్ని ఆవిష్కరించారు శ్రీశైల ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఏడు రోజులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వీరయ్య స్వామి తెలిపారు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ దేవస్థాన ఈవో ఎస్వి నాగేశ్వరరావు ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి దంపతులు పాల్గొన్నారు స్వామివారు బృంగి వాహన సేవలో దర్శనమిస్తారు స్వామి అమ్మవార్లను అలంకరించి ఆలయ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తారు
29, ఫిబ్రవరి 2024, గురువారం
మహాశివరాత్రికి శ్రీశైలం ముస్తాబు
శ్రీగిరి పై నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి 11 రోజులపాటు కొనసాగే ఉత్సవాల కోసం ఈవో డి పెద్దిరాజు ఆధ్వర్యంలో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఇందులో భాగంగా రెండున బృంగి వాహన సేవ మూడు నాహంస నాలుగున మయూర 5న రావణ కారణ పుష్ప పల్లకి సేవ 7న గజవాహన 8న నంది వాహన సేవ 9:30 రథోత్సవం 10న ధ్వజారోహణ 11న అశ్వవాహన సేవ పుష్ప ఉత్సవం షైన్ ఉత్సవం ఉంటాయి 8న మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ఐదున్నర గంటలకు బ్రహ్మోత్సవం 10 గంటలకు లింగోద్భవ కాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పాదాలంకరణ 12 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి లీలా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది 9న రాత్రి 8 గంటలకు తెప్పోత్సవ నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిలో అలంకార దర్శనానికి మాత్రమే భక్తులు అనుమతిస్తామని యువ తెలిపారు శివదీక్ష చేపట్టిన ఇరుముడి స్వాములకు శుక్రవారం నుంచి ఐదవ తేదీ వరకు స్వామివారి స్పర్శ దర్శనం ఉంటుందని అన్నారు బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలను పూర్తిగా ఆపేస్తున్నట్లు చెప్పారు
28, ఫిబ్రవరి 2024, బుధవారం
శ్రీశైలంలో అమెరికా భక్తుడు భూరి విరాళం
శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఒక భక్తుడు మంగళవారం బూరి విరాళం సమర్పించారు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్ దత్ బంగారు వెండి సామాగ్రి ఆభరణాలను ఆలయానికి అందజేశారు 28.3 గ్రాములు ఉన్న రెండు బంగారు బాషకాలు ఐదు గ్రాముల బంగారు కంకణం ఒకటి. రెండు ఐదు కిలోల వెండి పళ్ళెం 865 గ్రాముల వెండి శక్తి ఆయుధము 550 గ్రాముల వెండి నాగ హారతి 20090 గ్రాముల కుక్కుట ధ్వజము 750 గ్రాముల 5 వెండి గిన్నెలు 920 గ్రాముల గంధక్షత గిన్ని ఒక వంద 90 గ్రాముల కమండలాన్ని 300 గ్రాముల పెద్దక మండలాన్ని కొత్తపల్లి సునీల్ దత్ గారు కుటుంబం అందజేసింది నంద్యాల జిల్లా పగిడాలకు చెందిన కౌలూరి సింధూర కూడా 810 మరియు 350 గ్రాముల చొప్పున 2 వెండి పళ్ళాలు 615 గ్రాములున్న మూడు వెండి చెంబులను ఆలయానికి అందజేశారు అనంతరం దాతలకు దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రము ప్రసాదము అందజేసి సత్కరించారు రెండు రోజుల క్రితం చెన్నైకి చెందిన భక్తురాలు కోనేరు విమలాదేవి స్వామివారికి 343 గ్రాముల బంగారు పళ్లెం అందజేశారు.
10, ఫిబ్రవరి 2024, శనివారం
శ్రీశైలం క్షేత్రానికి 10 ఏసీ బస్సులు
హైదరాబాద్ శ్రీశైలం మధ్య 10 ఏసీ బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది .85 కొత్త బస్సులు అందు బాటులో కి తీసుకు రాబోతోంది .75 ఎక్స్ ప్రెస్ బస్సులు,10 ఏసీ బస్సులు

