జాతరలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జాతరలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మే 2026, శుక్రవారం

శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి జాతరలు 2026

 కమ్మర్పల్లి మండలంలోని చౌటుపల్లి గ్రామములో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి జాతర ఉత్సవాలకు ఏర్పాటు చేశారు. ఉత్సవాలను శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు సముద్రాల అమర్నాథ్ చారి, వేద పండితులు గంగా ప్రసాద్ దీక్షితులు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొప్పెల ప్రవీణ్ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4 రోజులుగా ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు నిర్వహించారు.

ఆలయ నేపథ్యం ఏమిటంటే..

అగస్త్య మహాముని గోదావరి పరివాహక ప్రాంతంలో తపస్సు చేస్తూ 3 శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలు నిర్మించారని చెబుతారు. ఒకటవది చౌటుపల్లిలో రెండవది మంత్రపురి/ మంథనిలో, మూడవది జైనథ్ లో నిర్మించినట్లు పూర్వీకుల కథనం. 

చౌటుపల్లి లో ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1870లో నిర్మించినట్లు ఆలయం వెనుక భాగంలో గల శిలాశాసనం సంస్కృత భాషలో ఉంది .కమ్మర్పల్లి మండల కేంద్రంలో కొలువుతీరి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామికల్యాణము గురువారం కనుల పండుగ నిర్వహించారు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి భరత్ కోశాధికారి పన్యాల రవి రెడ్డి దంపతులతో పాటు కమిటీ సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కమ్మర్పల్లి గ్రామంలో అతి పురాతనమైన పూర్తి రాతి తో కట్టబడి ఉన్న గ్రామస్తుల ఆరాధ్య దైవం గా కొలవబడే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలిసారి రథోత్సవం, జాతర నిర్వహించారు. గురువారం రాత్రి స్వామి వారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నారాయణస్వమి ట్రస్ట్ సభ్యులు మరో 500 స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులను వితరణ చేశారు. 

మోస్రా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత నెల 22వ తేదీ నుంచి గురువారం వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి నవరాత్రులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురోహితులు మారుతి ఆలయ కమిటీ సభ్యులు ఎగన్నగారి లింగారెడ్డి, సతీష్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

ఆర్మూర్ పట్టణంలో ని గుల్ బంగ్లా వద్ద గల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సర్వ సమజ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.

బోధన్ పట్టణంలోని బసవతారక నగర్ లో శ్రీ కోట మైసమ్మ సహిత లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వేద పండితులు బాలయోగి పిట్ల కృష్ణ మహా రాజు ప్రవీణ్ మహారాజ్ మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

నవీపేట మండలంలోని జన్నేపల్లిలో గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు స్థానిక నరసింహస్వమి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

6, మార్చి 2024, బుధవారం

రేపటి నుంచి ఏడుపాయల జాతర

 రేపటి నుంచి ఏడుపాయల జాతర మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో ఈనెల 8 నుంచి 10 వరకు జాతర జరగనున్నది తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా అందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది వృద్ధులు దివ్యాంగులు పిల్లలు వెళ్లడానికి 8 మినీ బస్సులను ఏర్పాటు చేసింది విఐపి క్యూ లైన్లు బారికేళ్ళు తాగునీటి కుళాయిలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు



3, మార్చి 2024, ఆదివారం

మేడారంలో 317 హుండీల లెక్కింపు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది గురువారం మొదలైన హుండీల లెక్కింపు ప్రక్రియ మరో రెండు రోజులపాటు కొనసాగుతున్నది జాతరలో మొత్తం 518 ఉండి ఉండగా వాటిని వరంగల్కు తరలించి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో భద్రపరిచి గుండెలను లెక్కిస్తున్నారు ఇప్పటివరకు 317 లెక్కించగా 9 కోట్ల 60 లక్షల 36వేల రూపాయలు ఆదాయం సమకూరింది మరో 2001 ఎక్కించాల్సి ఉంది మొదటి రోజున 114 లెక్కించగా మూడు కోట్ల 15 లక్షల 40 వేల రూపాయలు రెండవ రోజున 71 లెక్కించగా రెండు కోట్ల 98 లక్షల 35 వేల రూపాయలు ఆదాయం రాగా మూడవరోజు 112 ఎక్కించగా మూడు కోట్ల 46 లక్షల 61 వేల రూపాయల ఆదాయం వచ్చింది  మిగిలిన రెండు వందల ఒక్క హుండీల లెక్కింపు మరో రెండు రోజులలో పూర్తి కానున్నది

జాతరలలో భాషలకు అర్థాలు అనేకం

 తెలంగాణలో ఏ గ్రామం వెళ్ళిన ఎక్కడ చూసినా గ్రామదేవతలు దర్శనమిస్తారని మన దేవతలు సంప్రదాయ జాతరలకు కొదవలేదని టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య గారి చెప్పారు తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించిన పండుగల సందర్భంగా ప్రజలు మాట్లాడే భాషకు అర్థాలు తెలిపే పదకోశాన్ని శనివారం శైలజ రామయ్య తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు ఇలాంటి అరుదైన ప్రయోగం చేసి ముద్రించిన సాహిత్య అకాడమీ ఆమె అభినందించారు ప్రజలకు ఎప్పుడు అవసరమయ్యే చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ పుస్తకం ఎంతో విలువైనన్నారు గ్రామీణ ప్రాంతాలలో జాతర సందర్భంగా పలికే మాటలు భాషను వివరించే తొలి గ్రంథమని అన్నారు ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ సంచాలకులు కేనికిల తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాల చారి డాక్టర్ రాపోలు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు