శ్రీ మార్కండేయ మందిరాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ మార్కండేయ మందిరాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఫిబ్రవరి 2024, గురువారం

మార్కండేయ స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం

 



నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో గురువారం శ్రీ భక్త మార్కండేయ విగ్రహము రాజగోపుర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తుశ్రద్ధలతో జరిగాయి ఐదు రోజులుగా ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతుండగా చివరి రోజు గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కరకమలములచే మార్కండేయ ప్రాణ ప్రతిష్ట జరిపారు ఈ సందర్భంగా తెల్లవారుజామునుంచే ద్రొక్కుబలి దిగ్బలి హరణము నేత్రోన్ మిలీనము మహా పూర్ణాహుతి కుంభ సంప్రోక్షణ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి శాంతి కళ్యాణము కార్యక్రమాలు నిర్వహించారు  శతాధి ప్రతిష్టాపన చార్యులు చౌటుపల్లి గంగా ప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో జరిగిన పార్వతి రాజరాజేశ్వర స్వామి శాంతి కల్యాణంలో మంగి రాములు మహారాజు ఇప్పకాయల హరిదాసు స్వామి పాలకొండ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు మాజీ ఎమ్మెల్యే బేగాల గణేష్ గుప్తా మేయర్ దండు నీతో కిరణ్ తదితర ప్రముఖులు మార్కండేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిర్జు దత్తాత్రేయ వర్కింగ్ ప్రెసిడెంట్ పులగం హనుమాన్లు మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజరాజేశ్వరి నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నరసయ్య దాసరి కొండయ్య కారం కొండ విట్టల్ దేంగి మోహన్ మందిర కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవదాస్ రాపల్లి గురుచరణ్ ఏజీ రామస్వామి గుడ్ల భూమేశ్వర్ బల్ల లక్ష్మీబాయి కొండ గంగా చరణ్ చింతల గంగాధర్ బీమార్తి సురేందర్ పెంటిరాజు బుస శ్రీనివాస్ జై సత్యపాల్ తుమ్మ నాగభూషణం సుభాష్ మహేష్ సత్య ప్రకాష్ సిర్పరాజు రాజు తదితరులు పాల్గొన్నారు


వేదమంత్ర పారాయణాలు

 నిజామాబాద్ లోని కోటగల్లి మార్కండేయ మందిరంలో కొనసాగుతున్న నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా బుధవారం దుర్గ సూక్త హవనము మూలమంత్ర జపము వేదమంత్ర పారాయణాలు చేశారు ప్రముఖ ప్రతిష్టాపన చార్యులు గంగా ప్రసాద్ నేతృత్వంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు మంగళహారతులు సమర్పించారు నగర పద్మశాలి సంఘం ఆలయ కమిటీ ప్రతినిధులు వివిధ ప్రాంతాల భక్తులు మొక్కులు చెల్లించారు రాజగోపుర నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు గురువారం ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు మహాకుంభాభిషేకం రుత్విక్ సన్మానం పూర్ణాహుతి అన్నదానం ఉంటుందని వెల్లడించారు



27, ఫిబ్రవరి 2024, మంగళవారం

వైభవంగా మార్కండేయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

 నిజామాబాద్ నగరంలోని కోట గల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాల అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు మంగళవారం శతాధిక ప్రతిష్టాపనచార్యులు చౌటుపల్లి గంగా ప్రసాద్ దీక్షితులు పురోహిత్యంలో చండీ హోమము రుద్ర హోమాలు న్యాస హోమము అధివాస హోమము ఫల పుష్పాదివాసము అవధారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు పూజలు చేశారు నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పోల్కం హనుమాన్లు నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నరసయ్య దాసరి గుండయ్య కైరం కొండ విట్టల్ బింగి మోహన్ మందిర కమిటీ చైర్మన్ లెక్క పత్రి దేవదాస్ రాపల్లి గురు చరణ్ గుడ్ల భూమేశ్వర్ పల్లె లక్ష్మీబాయి కొండ గంగాచారం చింతల గంగాధర్ భూస శ్రీనివాస్ జై సత్యపాల్ తుమ్మ నాగభూషణం అంకం రాజేందర్ పాల్గొన్నారు




13, ఫిబ్రవరి 2024, మంగళవారం

నవీపేట లో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

 నవీపేట మండల కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు ఉదయం ప్రత్యేక అభిషేకాలు యజ్ఞం అనంతరం పద్మశాలి జెండా ఆవిష్కరణ మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు మంగళ హారతులు భాజ భజంత్రీలతో భక్త మార్కండేయని శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మేక లక్ష్మణ్ లోకం నరసయ్య గంగాధర్ న్యాతర నరసయ్య సురేష్ యోగి పద్మశాలి కుల బంధువులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

 రాజంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలోని పద్మశాలి సంఘ భవనాలలో మార్కండేయ జయంతి వేడుకలను పద్మశాలి సంఘ సభ్యులు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ మార్కండేయ మహా ఋషి చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం గ్రామంలో ప్రధాన చౌరస్తాలో మీదుగా డప్పు చప్పుళ్లతో డీజే మూతలతో అంగరంగ వైభవంగా జిలుస్ తీశారు అనంతరం ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు మచ్చ నర్సింలు మాట్లాడుతూ రిషి సంస్కృతి పద్మశాలీల కుల దైవమైన శ్రీ భక్త మార్కండేయ మహా రుషికే జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం మహర్షి దగ్గర విషయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు ఉపాధ్యక్షులు చిలువేరి రవి కార్యదర్శి మచ్చ భాస్కర్ కోశాధికారి పాకాల రవి బద్రి సలహాదారులు మరియు సంఘ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు



ఘనంగా మార్కండేయ జయంతి

 పిట్లం మండల కేంద్రంలో పద్మశాలిల ఆరాధ్య దైవం మార్కండేయ జయంతిని పద్మశాలి కులస్తులు సంఘ సభ్యులు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయం నుండి మహిళలు కోలాటాలాడుతూ మార్కండేయ స్వామి చిత్రపటాన్ని రథంపై ఊరేగింపుగా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించగా ఈ రథయాత్ర శివాలయం వద్దకు చేరుకుంది ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు బాలరాజ్ మార్కండేయుని జీవిత చరిత్రను వివరించారు అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త పత్తి శ్రీనివాస్ మార్కండేయని జయంతిని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు మధురోహణ నరసింహులు మహిళలు యువకులు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు



సిరిసిల్లలో ఘనంగా మార్కండేయ జయంతి

 కార్మిక క్షేత్రం సిరిసిల్ల సోమవారం ఆధ్యాత్మిక శోభతో అలరారింది పద్మశాలి సామాజిక వర్గం ఇలవేల్పు శివ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కనుల పండుగ సాగింది ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై మార్కండేయ చిత్రపటంతో ర్యాలీ తీశారు మహిళల కోలాటాలు విద్యార్థుల సాంస్కృతిక విన్యాసాలు ఆకర్షించాయి మార్కండేయ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు



12, ఫిబ్రవరి 2024, సోమవారం

భక్తిశ్రద్ధలతో కొనసాగిన మార్కండేయ జయంతి

 


జిల్లాలో సోమవారం మార్కండేయ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఉదయం నుంచి పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు పలు మండలాల్లో పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బిచ్కుందలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని పదో తరగతి ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు ఎల్లారెడ్డి లోని పద్మశాలి సంఘ సభ్యులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు మండల కేంద్రంలో పద్మశాలి కుల సంఘ భవనం నుంచి మార్కండేయ ఆలయం వరకు కలశాల ఊరేగింపు నిర్వహించారు ఆలయంలోని మార్కండేయ విగ్రహానికి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మద్నూర్లోని మార్కండేయ ఆలయంలో పూజలు చేశారు అనంతరం ఉయ్యాల సేవ నిర్వహించారు పిట్లంలో పద్మశాలి సంఘ సభ్యులు మహిళలు బోనాలతో మార్కండేయుడు చిత్రపటాన్ని రథంపై ఏర్పాటు చేసి కోలాటం ఆడుతూ బ్రహ్మంగారి ఆలయం నుంచి చెరువు కట్ట రామేశ్వర ఆలయం వరకు ఊరేగింపు చేపట్టారు అనంతరం ఆలయంలో మార్కండేయ జయంతి నిర్వహించారు పద్మశాలి సంఘాలు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి బాన్సువాడ మండలంలోని బొర్లం తాడుకుల్ గ్రామాల్లో మార్కండేయ జయంతిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు బోనాలతో మార్కండేయ మందిరం వరకు శోభాయాత్ర నిర్వహించి పూజలు చేశారు బోర్లలోని మార్కండేయ మందిరంలో మార్కండేయ స్వామి ఉత్సవ విగ్రహానికి తొట్టెల కార్యక్రమానికి వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పూజారి శ్రీధర్ పంతులు పద్మశాలి సంఘం పెద్దలు అన్నం హనుమాన్లు నాగయ్య పద్మ రమేష్ నాగభూషణం సుప్పని అంజయ్య బాబు నారాయణ బసవరాజ్ సుభాష్ ప్రవీణ్ కుమార్ వినయ్ సాయిబాబా పాల్గొన్నారు జంగంపల్లిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ చిత్రపటాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు పద్మశాలి సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంఘం సభ్యులు పాల్గొన్నారుబాన్స్వాడలోని మార్కండేయ ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గంగాధర్ రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి నాయకులు ఎజాజ్ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ కౌన్సిలర్లు కోఆప్షన్స్ సభ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు పాల్గొన్నారు బిబిపేట్ తో పాటు మాందాపూర్ రాజంపేట మండలం బసవన్నపల్లిలోని మార్కండేయ ఆలయంలో పూజలు నిర్వహించారు కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు లక్కపత్ని రవి కార్యదర్శి సామల బాలచంద్రం కోశాధికారి అరవింద్ సంఘ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

దోమకొండలోని మార్కండేయ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగరాజు ఉపాధ్యక్షులు బొమ్మెర ప్రవీణ్ కుందన వినోద్ రాజేందర్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ అనిల్ జగదీష్ మహాదేవ్ కోశాధికారి గణేష్ నారాయణ సి డి సి చైర్మన్ ఐరన్ నరసయ్య పద్మశాలి కుల పెద్దలు చేనేత సహకార సంఘం సభ్యులు డైరెక్టర్లు మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు




ఘనంగా భక్త మార్కండేయ జయంతి

 




ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలను ప్రజలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఆలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు పలుచోట్ల కళాశాలతో ఊరేగింపు నిర్వహించారు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు పద్మశాలి కుల సంఘ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు



భక్త మార్కండేయ కండువాల పంపిణీ

 భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని బాల్కొండ మండల కేంద్రంలోని మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం భక్త మార్కండేయ కండువాలను గ్రామ పద్మశాలి సంఘాలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాల్కొండ మండల అధ్యక్షుడు మానేటి నాగభూషణం మాట్లాడుతూ పద్మశాలి సంఘ సభ్యులు అందరూ సంఘటితంగా ఏర్పడి రాజకీయంగా సామాజికంగా ప్రతి సభ్యుడు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు బాల్కొండ పట్టణ అధ్యక్షుడు మధుకర్ మాట్లాడుతూ మార్కండేయ జయంతి సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ మందిరంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు మానేటి నాగభూషణం కార్యదర్శి రా రాజుల రామనాథం బాల్కొండ పట్టణ పద్మశాలి అధ్యక్షుడు ఎలిగేటి మధుకర్ కోశాధికారి రాజేందర్ సంయుక్త కార్యదర్శ తమ్మి కపిల్ సంఘ సభ్యులు నవీన్ సుమన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు 

నేడు మార్కండేయ జయంతి ఉత్సవాలు

 


పద్మశాలీల ఆరాధ్య దైవమైన మార్కండేయ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ నగరంలో అంబేద్కర్ కాలనీలో గల సంఘం భవనంలో నేడు ఘనంగా నిర్వహించనున్నట్లు తర్ప అధ్యక్షుడు గంట్యాల వెంకటేష్ తెలిపారు మార్కండేయ జయంతిని పురస్కరించుకొని ముందుగా సంఘ భవనంలో మార్కండేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం తర్ప సభ్యుడు బల్ల శ్రీనివాస్ డెనిమ్ క్లబ్ షోరూమ్ యజమాని ఆధ్వర్యంలో సంఘంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు

11, ఫిబ్రవరి 2024, ఆదివారం

బిబిపేట మార్కండేయ మందిరంలో జయంతి ఉత్సవాలు

 భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకుని బిబిపేట మండల కేంద్రంలోని భక్త మార్కండేయ మందిరంలో జయంతి ఉత్సవాలను నేడు ఘనంగా నిర్వహించనున్నట్లు పద్మశాలి సంఘం సభ్యులు తెలిపారు పూజలు మహా యజ్ఞం మధ్యాహ్నం అన్నదానం రాత్రి భజన ఉంటుందన్నారు



నేడు మార్కండేయ జయంతి

 


దోమకొండ మండల కేంద్రంలో మార్కండేయ జయంతిని సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఉమామహేశ్వర సీతారాముల కల్యాణోత్సవం నవగ్రహ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు హాజరుకానున్నట్లు తెలిపారు