SPIRITUAL NEWS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
SPIRITUAL NEWS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం..

 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల ప్రవాహం కొనసాగుతున్నది . తాజాగా శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డ్ స్థాయికి చేరింది. గురువారం ఒక్క రోజు హుండీ ద్వారా 6 కోట్ల 93 లక్షల రూపాయలు ఆదాయం లభించినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు .ఇది ఇటీవలి కాలంలో నమోదైన అత్యధిక ఒక్కరోజు ఆదాయాలలో ఒకటిగా నిలిచింది .



తిరుమల చరిత్రలో ఇప్పటివరకు హుండీ ఆదాయం 6 కోట్ల రూపాయల మార్పును దాటడం కేవలం నాలుగు సార్లు మాత్రమే జరగడం విశేషం. 

మరుగోళ్ళ పోటీలు అంటే..

 పోలాల అమావాస్య అంటే.. 

శ్రావణం సకల దేవతలకు ప్రీతికరమైన మాసం.. ఈ మాసం సమృద్ధికి ఆలంబనం. ఈ నెలలో ప్రతి రోజూ విశేషమైనదే. ఈ మాసంలో చివరి రోజైన శ్రావణ బహుళ అమావాస్యను "పోలాల అమావాస్య" అంటారు.దీనిని కౌశి అమావాస్య , ఆలోక అమావాస్య గా కూడా పూర్వ గ్రంథాలు పేర్కొన్నాయి.ప్రధానంగా ఇది శక్తి పూజ .ముత్తైదువులు దీన్ని ఆచరిస్తారు. పోలాంబకు ప్రతీకగా కంద మొక్కను పూజా మండపం మీద ప్రతిష్టించి పూజిస్తారు. వరి దుబ్బును కూడా పూజించే ఆనవాయితీ ఉంది. తోరాలను కట్టి ,వాటిని అమ్మవారికి అర్పించి , తమ చేతులకు ,ఇంట్లోని ఆడపిల్లల చేతులకు కట్టుకుంటారు. పోలాంబను పూజించడం వల్ల కుటుంబ సౌఖ్యం, సిరి సంపదలు ,సౌభాగ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.నందీశ్వరుడు జన్మించిన రోజు ఇదే అని పురాణాలు చెబుతున్నాయి.కాబట్టి పలు ప్రాంతాలలో రైతులు తమకు సాగులో సాయం చేసే బసవన్నలకు వృషభ పూజను నిర్వహిస్తారు. దీనిని " ఎడ్ల పొలాల అమావాస్య " అని కూడా అంటారు.



ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం పోలాల పండుగ సంబరంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను రంగు రంగుల దుస్తులతో, బెలూన్లతో అలంకరించారు.అనంతరం వీధులలో ఊరేగించారు. గ్రామ దేవతల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 



తర్వాత ఎడ్లను పూజించి నైవేద్యం సమర్పించారు.వాటికి నైవేద్యం పెట్టిన తర్వాత ఉపవాసం వీడడం ఇక్కడి రైతుల సంప్రదాయం.



సీతాదేవి ఆలయం, నువారా ఎలియా జిల్లా,శ్రీలంక.

మరుగోళ్ళ పోటీలు..అంటే..

ఆదివాసీ సంస్కృతి,సాంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి.వాటిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. పోలాల అమావాస్య రోజున సాంస్కృతిక గిరి ఆధ్వర్యంలో ఉట్నూర్ ఐటిడిఏ ప్రాంగణంలో మరుగోళ్ళ పోటీలు ప్రారంభం అయ్యాయి.ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల ఆచారాలు ,పండుగలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.వీటి పరిరక్షణకు ఐటిడిఏ విశేష కృషి చేస్తోంది.


25, మార్చి 2024, సోమవారం

అంజన్న స్వాముల సన్నిధానానికి కూలర్లు అందజేత

 కుంటాల మండల కేంద్రమైన కుంటాలలోని అంజన్న స్వాములకు సన్నిధానంలో నందిపేట మండలంలోని జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నందగిరి అన్వేష్ కుమార్ అంజన్న భక్తులకు రెండు కూలర్లను విరాళంగా తన వంతుగా సహాయంగా అందజేశారు అంతేకాకుండా అంజన్న భక్తులకు బిక్షం ఏర్పాటు చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా గురుస్వామి భుజంగం గణపతి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి పూజా కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంజన్న స్వాములు గ్రామస్తులు పాల్గొన్నార



శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ

 శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను 22 మంది చిత్రకారులు వేయగా దీన్ని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పేరుతో తిరుపతికి చెందిన శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పుస్తకంగా రూపొందించింది ఈ పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గీసిన బొమ్మ కూడా ఈ పుస్తకంలో ఉండడం ఆ దేవదేవుడి కృపయా అన్నారు కాకా బ్రహ్మానందం ఆదివారం ఉదయం బిజెపి బ్రేకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు

దగడు సేటు వినాయకుడి కి ద్రాక్ష మహోత్సవం

 



హోలీ సంబరాల వేళ మహారాష్ట్రలో విఘ్నేశ్వరాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు పూణేలో కొలువైన దగడు సేట్ వినాయక ఆలయాన్ని రంగురంగుల ద్రాక్ష పండ్లతో ముస్తాబు చేశారు ఇందుకోసం దాదాపు 2000 కిలోల ద్రాక్ష పనులను వినియోగించారు ఆలయ ప్రాంగణాన్ని నలుపు ఆకుపచ్చ ద్రాక్షలతో సుందరంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవము వేడుకగా జరుపుకోవాలని ఇక్కడ ఆనవాయితీ సహ్యాద్రి ఫామ్స్ ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన అద్భుతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామి వారి వద్ద ఉంచిన ద్రాక్ష పనులను ససూన్ ఆసుపత్రి పితాశ్రీ వృద్ధాశ్రమం తో పాటు పలు సంస్థలకు భక్తులకు పంపిణీ చేస్తారు.



22, మార్చి 2024, శుక్రవారం

సుఖమే దుఃఖం

 దహింపబడతాను అని తెలియక పురుగు అగ్నిలో పడి చస్తుంది. చస్తాను అని తెలియక గాలానికి ఉన్న ఎర్రని తిని చేప తన ఆయుష్షు పోగొట్టుకుంటుంది కానీ మనం మాత్రం తెలిసి తెలిసి కొన్ని వ్యామోహాలలో చిక్కుకొని కొన్ని తప్పుదారుల్లో నడిచి తినాశనం కొని తెచ్చుకుంటాము తరచి చూస్తే మనం ఏవి సుఖాలని వెంటపడతామో అదే అసలు దుఃఖాలుగా గ్రహించేసరికి జీవితం ముగిసిపోతుంది

ముసలితనం పెద్ద పులి వలే భయపెడుతూ మనపై పడుతుంది రోగాలు శత్రువుల శరీరాన్ని కబళిస్తాయి రంద్రం పాడిన కుండలోని నీరుల ఆయువు తరిగిపోతుంది లోకం శోకహతం అని తెలిసినప్పటికీ ఆశా పాశంతో జీవితం ముడిపడి మనం తప్పుదారిని విడవడం లేదు మనకు కోరికలు తీరుతున్న కొద్ది ఇంకా ఇంకా అనుభవించాలి పొందాలి అనే కృష్ణ ఏర్పడుతుంది కృష్ణుని పారద్రోహి తృప్తిని పెంచుకున్న మానవుడు నిత్యానందాన్ని అనుభవిస్తాడు సంతృప్తిని మించిన సౌభాగ్యం లేదు తృప్తిని పొందని మనుజుడు సప్త దీపమునైన చక్కబడడు అని పోతున చెప్పారు భక్తి సజ్జన సాంగత్యం మాత్రమే మనిషికి సంతృప్తిని శాంతిని ఇవ్వగలవు

19, మార్చి 2024, మంగళవారం

గులాల్ గోట బంతులు

 హోలీ పండగకు ముందు సోమవారం జైపూర్లో పర్యావరణ అనుకూల కలర్ పౌడర్ తో చేసిన గులాల్ కోట బంతులను సిద్ధం చేస్తున్న మహిళలు



ఆలయ సత్రం నిర్మాణానికి భూమి పూజ

 బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో దుర్గామాత ఆలయ సత్రం నిర్మాణానికి గ్రామస్తులు సోమవారం భూమి పూజ నిర్వహించారు ఈ సత్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నిర్ల నరసింహులు మంద శ్రీనివాస్ పర్వారెడ్డి మన్నే చిన్న సాయిలు గోపనపల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు

దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనలు

 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటారుమూరులో శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి నాలుగు రోజులపాటు జరగనున్న ఉత్సవాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు విగ్రహాల ఊరేగింపు అనంతరం ప్రత్యేక పూజలు యజ్ఞం నిర్వహించారు బుధవారం శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ చేతుల మీదుగా శివ పంచాయత నవగ్రహ ధ్వజ శికర సహిత హనుమాన్ దేవత మూర్తులు యంత్రస్థాపన మూర్తుల ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షుడు ఇత్తడి గంగారెడ్డి కోశాధికారి తిరుపతి గౌడ్ ప్రధాన కార్యదర్శి గడ్డి కార్తీక్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఇంద్రకీలాద్రిపై బఫే పద్ధతితో అన్న ప్రసాదం

 ఇంద్రకీలాద్రిపై బఫే పద్ధతితో అన్న ప్రసాదం

శుక్ర శని ఆదివారాల్లో అందించాలని నిర్ణయము మహా మండపం మొదటి అంతస్తులు ఏర్పాట్లు

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాదం అందాల అధికారులు చర్యలు చేపట్టారు క్యూ లైన్ లో వేచి ఉండకుండా నేరుగా ప్రసాద వితరణ హాల్లోకి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిత్యము అమ్మవారి దర్శనానికి సుమారు 30 వేల నుంచి 40000 మంది విచ్చేస్తుంటారు వీరిలో అత్యధికులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారే సాధారణ రోజులలో 4000 మందికి శుక్ర శని ఆదివారాలు రోజుకు 5000 మందికి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు మహా మండపం రెండవ అంతస్తులు రెండు హాల్స్లో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది రాంబాబు అన్నదానం వితరణను పరిశీలించిన క్రమంలో పలువురు భక్తులు తమ ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చారు మహా మండపం మొదటి అంతస్తులు పద్ధతిలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడంతో పాటు దానిని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఒకదాఫా 100 మంది చొప్పున రోజుల 1500 మందికి అన్న ప్రసాదం అందించే వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ వారమే దీని అమలు చేయాలని నిర్ణయించారు

17, మార్చి 2024, ఆదివారం

మన ఆలోచన

 అరణ్యవాసంలో ఉన్న పంచపాండవుల యొక్క క్షేమాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు వారితో ఒక రాత్రి గడిపాడు పాండవులు వంతుల వారీగా గంటకొకరు చొప్పున తామున్న కుటీరాన్ని రాత్రి కాపలా కాయ సాగారు ఒకరు కాపలా కాసేటప్పుడు మిగిలిన వారు నిద్రిస్తున్నారు. అయితే వీరిలో ప్రతి ఒక్కరికి ఒక భూతం కనిపించింది అది క్రమంగా తన ఆకారాన్ని పెంచుకోవడం చూశారు దానిని హతమార్చడానికి ప్రయత్నించారు కానీ ఎవరు దాన్ని కనీసం అక్కడ నుంచి ధర్మా లేకపోయారు కాపలా కాస్తున్న ధర్మరాజుతో నన్ను కాపలా కాయని ఇవ్వరా బావ అన్నాడు కృష్ణుడు అంతట ధర్మరాజు ఈ ప్రపంచాన్ని అంతా కాపాడేది మీరే కదా మమ్మల్ని కాపాడేది మీరేగా అటువంటి మీరు కాపలా ఉంటానంటే వద్దని చెప్పడానికి మేమెవరము అన్నాడు పాండవుల వంతు ముగిసిన తర్వాత కృష్ణుడు తనవంతుగా కాపాడాకాశాడు అప్పుడు ధర్మరాజు కృష్ణ భూతం ఉంది అది క్రమంగా పెద్దదవుతుంది అది మీకేమైనా తలనొప్పిగా మారుతుందేమో అని ఆందోళనగా ఉంది అన్నాడు. అంతటా కృష్ణుడు ధర్మ నీకు నామీద సందేహం రావచ్చా అది నీ బలహీనత నేను నా వంతుగా కాపలా కాస్తాను అన్నాడు అర్ధరాత్రి దాటింది ఓ గంట పాటు కృష్ణుడు కాపలా కాసిన తర్వాత అర్జునుడు వచ్చాడు బావా కృష్ణ నువ్వు ఆ పోతాన్ని లేకుండా చేసేశావే అన్నాడు అందుకు కృష్ణుడు అర్జున నేను ఏ భూతాన్ని పిశాచాన్ని నాశనం చేయలేదు. నా కంటికి అలా ఏదీ కనిపించలేదు ఏదైనా మనం చూసే తీరిలో ఉంటుంది మనలో ఏ ఆలోచనలో ఉంటే ఆ దృశ్యం మదిలో మెదులుతుంది అదే దర్శనమిస్తుంది అది ద్వేషమైన కావచ్చు కోపం అయినా కావచ్చు ఆనందమైనా కావచ్చు దేశం అనేది లేకుండా ప్రేమతో మనసును ని ంపితే మన ముందు ప్రేమే కనిపిస్తుంది. భూతం కనిపించదు అన్నాడు ఇది అర్థమైతే అందరూ ఆనందంగా జీవించవచ్చు అన్నాడు. మన ఆలోచనలే మనకు కనిపించే భూతాలు

15, మార్చి 2024, శుక్రవారం

జెండా బాలాజీ ఆలయ హుండీ లెక్కింపు

 నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం నందు ఉండే లెక్కింపు గురువారం ఆలయ కార్య నిర్వహణ అధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ లెక్కింపులో 54,710 నోట్ల రూపంలో నాణ్యాలు 5540 మొత్తం 60 వేల 250 వచ్చినవే అని ఆయన తెలిపారు ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ నిజామాబాద్ సహాయ కమిషనర్ నాయని సుప్రియ ఆధ్వర్యంలో జరిగిందని కార్యనిర్వాహణాధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జాలిగా గోపాల్ ధర్మకర్తలు వైరాముగౌడ్ పి నర్సింగరావు టి నాగభూషణం ఏ సంతోష్ వి నాగరాజు ఆలయ అర్చకులు ఈ నాగరాజు జూనియర్ అసిస్టెంట్ శివరాత్రి ఆంజనేయులు ఆలయ విష్ణు సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొన్నార



శ్రీ ఏక చక్రేశ్వర శివాలయం హుండీ లెక్కింపు

 బోధన్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శివాలయంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం ఈ హుండీ లెక్కింపుని దేవాదాయ ధర్మా శాఖ వారి ఆదేశానుసారం జిల్లా ఇన్స్పెక్టర్ కమల ఈవో రవీందర్ గుప్తా జేఏవో రాములు ఆలయ చైర్మన్ కాలనీ హనుమంతరావు వారి పాలకమండలి ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ పోలీస్ సిబ్బంది పలువురు ప్రముఖుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దేవాదాయ ధర్మ శాఖ ఇన్స్పెక్టర్ కమల రవీందర్ గుప్తా ఆలయ చైర్మన్ కాలనీ హనుమంతరావు మాట్లాడుతూ భక్తుల కానుకల ద్వారా హుండీల మొత్తం మూడు లక్షల 6745 రూపాయలు ఆర్జిత సేవలు అభిషేకాల ద్వారా 4348 రూపాయలు మొత్తం ఎనిమిది లక్షల 393 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఇట్టి మొత్తాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖాతాలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు



పుష్పం ఫలం

 పూర్వం ఒక అమాయకుడు ఒక మామిడి తోట కొనుక్కున్నాడు దాని చుట్టూ బోలెడు మోదుగ చెట్లు అంటే అగ్నిపూల చెట్లు వీటినే పలాస చెట్లు అని కూడా అంటారు ఇవి ఉన్నాయి వసంతం రాగానే మామిడి చెట్లు పూత పట్టాయి కానీ అంత పెద్ద చెట్టుకు ఎంతో చిన్న పూలు కనిపించేసరికి అమాయకుడు నిరుత్సాహపడిపోయాడు పూలు చిన్నగా ఉంటే పండ్లు చిన్నవే కాస్తాయి కదా అని దిగులుపడ్డాడు అదే సమయంలో బళ్ళున పూసిన మోదుగ పూలు పెద్దగా ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించాయి పూలు ఇంత పెద్దగా ఉంటే కాయలు మరింత పెద్దవిగా రుచిగా ఉంటాయని అంచనా వేశాడు అమాయకుడు వెంటనే మామిడి చెట్లని నరికేసి మోదుగ చెట్లకు నీళ్లు పట్టి ఎరువు గట్ల వేసి పోషించాడు మోదుగ చెట్టు ఫలించినప్పుడు రుచి పచీలేని అతి చిన్న మోదుగ కాయలు చూసి అయ్యో నేను ఎంతటి మూర్ఖపు పని చేశాను అని అప్పుడు దుఃఖించాడు

నేను కూడా అలా మామిడి చెట్టును నరికి మోదుగ చెట్టును పోషించిన మూర్ఖుడినే.. సోహం ఆమ్రవనం చిత్వా పలాశాన్ చ న్య శేచయం.. రామం ఫలాగమే త్య క్త్వా.. పశ్చాత్ షోచామి దుర్మతి:. చేతికి అంది వచ్చిన రాముడిని దుర్మతినై వదులుకొని తర్వాత ఇలా శోకిస్తున్నాను ..వాల్మీకి అయోధ్య 63 -10.. రాముడు వనవాసానికి వెళ్లాక తన పట్టమహిషి కౌసల్య ముందు ఇలా వాపోతున్న వాడు దశరథ మహారాజు ఒక పని చేసేటప్పుడు దీని ఫలం ఎలా ఉంటుంది అది తీయని పుణ్యఫలమా లేక చేదు అయిన పాప ఫలమా ఈ  కర్మలో ఏమి దోషముంది ఎంతటి దోషం ఉంది అన్నది గమనిక అవసరం .అది నాకు లేకపోయింది అని పశ్చాత్తాప పడుతున్నాడు .చిన్నతనంలో ఆయన వేటకు వెళ్ళాడు. రాత్రి సరయు నదిలో నీళ్లు తాగేందుకు వచ్చి అడవి జంతువులను చీకటిలో వేటాడి చంపాలన్న చాపలయం వల్ల తొందరపాటుతో అంధకారంలో సంధించిన బాణం శ్రావణ కుమారుడి ప్రాణం తీసింది అలాగే మరో సందర్భంలో తనను ఎప్పుడైనా సరే ఏదైనా సరే వరంగ అడిగే అధికారాన్ని చిన్న భార్య కైకకు అనాలోచితంగా కట్టబెట్టాడు ఆ దూకుడు తనం వల్ల ఆయన చాలా చేదు ఫలాన్ని రుచి చూడవలసి వచ్చింది

10, మార్చి 2024, ఆదివారం

ఆందోల్ లో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పా

 సంగారెడ్డి జిల్లా ఆందోలు లోని రంగనాయక సాగర్ పెద్ద చెరువు కట్ట పైన ఉన్న శిల్పాలు దాదాపు 1000 సంవత్సరాల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ప్లీజ్ ఇండియా సీఈవో డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి తెలిపారు శనివారం ఆయన ఈ శిల్పాలను పరిశీలించారు ఆందోళనలోని శ్రీ రంగనాథ ఆలయం గోపురం ముందున్న మహిషాసుర మర్దిని తదితర శిల్పాలు రాష్ట్ర కూతులు కళ్యాణి చాళుక్యుల హయాం క్రీస్తుశకం 9 11 శతాబ్దాల మధ్య చిక్కినవని వెల్లడించారు అలాగే చెరువు గట్టును నాగుల కట్టపై వెలసిన చెన్నకేశవ జనార్ధన నాగదేవతల విగ్రహాలు కళ్యాణి చాళుక్యులు కాకతీయుల కాలం 11 13 శతాబ్దాల మధ్య వని వివరించారు చెన్నకేశ విగ్రహం చుట్టూ ఉన్న మకర తోరణం శ్రీదేవి భూదేవి దశావతార శిల్పాలకు చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు ఈ శిల్పాలు అలనాటి అద్భుత శిల్పకళా నైపుణ్యానికి అర్థం పడుతున్నాయని చెప్పారు



9, మార్చి 2024, శనివారం

శివుడికి వెండి కిరీటం బహుకరించిన ముస్లిం భక్తుడు

 మహాశివరాత్రి సందర్భంగా ఒక ముస్లిం భక్తుడు మతసామరస్యాన్ని చాటాడు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఎండి మౌలానా పట్టణంలోని శ్రీ భవాని శంకర మహాదేవాలయానికి శుక్రవారం ఆలయ కమిటీ సమక్షంలో 20వేల రూపాయల విలువైన వెండి కిరీటాన్ని బహూకరించారు ఆలయ పూజారి విశ్వనాథ శర్మ ప్రత్యేక పూజలు చేసి కిరీటాన్ని శివలింగానికి అలంకరించారు మౌలానా కుటుంబానికి పరమశివుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు



7, మార్చి 2024, గురువారం

శివాలయం నూతన చైర్మన్ కు సన్మానం

 బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయం నూతన చైర్మన్గా ఎన్నికైన కర్నే హనుమంతరావును బుధవారం వీరశైవ లింగాయత్ జంగమ సమాజ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కర్ణ హనుమంతరావును చాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు సన్మానించిన వారిలో బాబాయప్ప వెంకటేశ్వర దేశాయ్ శ్యామ్ రావు శివకుమార్ అప్ప నర్సింగప్ప లక్ష్మణ్ పటేల్ అజయ్ కుమార్ శంకరప్ప ప్రభు అప్ప మాధవరావు పటేల్ నాగభూషణ్ లింగాయత్ సమాధి సభ్యులు జంగమ సమసభ్యులు తదితరులు పాల్గొన్నారు



స్వర్ణగిరి వెంకటేశుడికి ప్రాణ ప్రతిష్ట

 



స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు బుధవారం భువనగిరి శివారులోని మానేపల్లి హిల్స్లో నిర్మించిన పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాల ప్రాణప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛారణలు హోమాధికతువులతో స్వామివారి పూజా కార్యక్రమాలు కనుల పండగ జరిగాయి కార్యక్రమానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు



6, మార్చి 2024, బుధవారం

భక్తులకు బంగారం పడి లేచిన మర్రి చెట్టు

 పడి లేచిన మర్రిచెట్టు శివ సాయి దేవస్థానంగా పిలుస్తారు ఆలయ ఆవరణలో కొలువైన సాయిబాబా హనుమాన్ ఆలయాలు దాతల సహాయంతో 36 అడుగుల హనుమాన్ విగ్రహం కళ్యాణ మండప నిర్మాణం ముడుపులు పెడితే కోరికలు తీర్చే మర్రిచెట్టు మహిమ


నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలు

ముత్కాల్ మండల కేంద్రంలోని పడి లేచిన మర్రిచెట్టు దేవస్థానం వద్ద కొత్తపల్లి గ్రామంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ విశేష పూజలు జరిగాయి ఉత్సవాల్లో రెండవ రోజు ఆలయంలో ఉదయం వేకువ చామున ప్రతిష్టమూర్తులకు పంచామృతాలతో వేదమంత్రాలతో అభిషేకం చేసి వివిధ రకాల పువ్వుల బిల్వపత్రాలతో అలంకరించి రుద్ర హోమం తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు

మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా శివలింగానికి రుద్రాభిషేకం బిల్వార్చన 1121 నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం శివరాత్రి జాగరణ భజన కార్యక్రమాలు జాగరణలు జరుగుతాయి రాత్రి లింగోద్భవ కాలంలో బిల్వ అభిషేకం చేయనున్నట్లు తెలిపారు మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని రంగులతో వివిధ రంగుల పువ్వులతో విద్యుత్ దీపాలతో అలంకరించారు అంతేకాకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం చలువ పందేళ్లు నీటి వసతులు పార్కింగ్ వసతులు అన్ని ఏర్పాటు చేశారు స్థానిక ఆలయ పూజారుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు

ముక్కాల్ మండల కేంద్రంలో మర్రి వృక్షం సుమారు 200 ఏళ్ల క్రితం ఉన్న ఈ పడిలేచిన మర్రిచెట్టు శ్రీ మహాలింగేశ్వర స్వామి వటవృక్షం. గత 18 ఏళ్ల క్రితం 2005 జనవరి 28వ తేదీన ఆనాటి పరిణామాల దృష్ట్యా భారీ ఈదురు గాలులకు అకస్మాత్తుగా నేలకొరిగింది 33 అడుగుల వృత్త విస్తీర్ణం ఉన్న ఈ మర్రిచెట్టు వృక్ష రాజం కూకటివేళ్లతో సహా పడిపోవడం జరిగింది అనంతరం అదే సంవత్సరం 25 జూన్ 24వ తేదీ శుక్రవారం రోజు ఇలాంటి మానవ ప్రయత్నం లేకుండానే యథాస్థానంలో పునర్ ప్రతిష్టితమై లేచి నిలబడిందని గ్రామస్తులు పేర్కొన్నార

పడి లేచిన మర్రి చెట్టుకు భక్తుల పూజలు

ఆనాటి నుంచి నేటి వరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర జిల్లాలనుంచి పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పడి లేచిన మర్రిచెట్టు మహా లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు అంతేకాకుండా మొక్కులు తీరిన భక్తులు కుటుంబ సమేతంగా సోమవారం వచ్చి వారు కట్టిన ముడుపులు తీసి సత్యనారాయణ వ్రతం చేసే సామూహిక భోజనాలు చేసి స్వామి వారిని దర్శించుకుని భక్తులు వెళుతుంటార

ప్రతి సోమవారం పండుగ వాతావరణం ప్రతి సోమవారం పడలేచిన మర్రిచెట్టు ఆలయం వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కాకుండా ఇతర మండలాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వారి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు భక్తుల రద్దీ దృష్ట్యా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి రోజురోజుకు పెరుగుతున్న భక్తులకు అవసరమైన వసతులు సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ అద్భుత స్థలమైన మహాలింగేశ్వర స్వామి పడి లేచిన మర్రి చెట్టు ప్రతిరోజు భక్తుల పూజలు అందుకుంటుందని పూజారులు అంటున్నారు ప్రతి గురువారం సాయిబాబా హారతి తర్వాత అన్నదానం చేపడతారు మహాశివరాత్రి పురస్కరించుకొన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన శివరాత్రికి మూడు రోజుల ముందు ఆరు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి గ్రామంలోని యువకులు పెద్దలు దాదాపు 20 నుంచి 40 మంది 41 రోజుల పాటు శివదీక్షలు తీసుకొని స్వాములు ఆలయం ఆవరణలో ఉంటారు శివరాత్రి పర్వదిన రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి మాల తీసి దీక్ష విరమిస్తారు శివరాత్రి నిలారం ఉన్న భక్తులు మరుసటి రోజు మహా అన్నదానం ఒక్కపొద్దుల విరమిస్తారు పడి లేచిన మర్రిచెట్టు పక్కన సాయిబాబా ఆలయం పక్కన 36 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం కొలువైంది ఈ విగ్రహ దాత నునుకొండ అంజయ్య నునుగొండ శ్యామల జ్ఞాపకార్థం శ్యామల కళ్యాణమండపం నిర్మించారు మహా లింగేశ్వర స్వామి చుట్టుపక్కల భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ధర్మశాల మంచినీటి సౌకర్యం మరుగుదొడ్ల నిర్మాణం వాహనాల పార్కింగ్ స్థలం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని స్థానికలయ కమిటీ సభ్యులు తెలిపారు



మేడారం జాతర ఆదాయం 12.7 కోట్లు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదాయం 12 కోట్ల 71 లక్షల 79280 రూపాయలు వచ్చింది. గతంలో కన్నా 26 లక్షల 29,5503 రూపాయలు ఎక్కువ వచ్చింది ప్రతి జాతరకు కోటి రూపాయలపైనే ఆదాయం పెరుగుతూ వస్తున్న ఈసారి మాత్రం అలా జరగలేదు. కాగా మేడారం నుండి లెక్కింపు మంగళవారం ముగిసింది భక్తుల నుంచి కానుకగా వచ్చిన ఎనిమిది వందల గ్రాముల బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండిని బ్యాంకులు భద్రపరిచారు