వేముల వాడ రాజన్న ఆలయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వేముల వాడ రాజన్న ఆలయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

శివ కళ్యాణానికి రాజన్న ఆలయం ముస్తాబు

 27 నుంచి 31 వరకు జరగనున్న ఉత్సవాలు 28న కళ్యాణము

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 27న శివకళ్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి 31 వరకు ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాల కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే యాగశాలను సిద్ధం చేశారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుండగా వేములవాడ మాత్రం శివ మహాపురాణం ఆధారంగా కామ దహనం తర్వాత కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈనెల 28న అభిషేక లగ్న ముహూర్తాన ఉదయం 10:50 నుంచి 125 నిమిషముల వరకు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు కల్యాణం సందర్భంగా రాజన్న ఆలయం మున్సిపాలిటీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ముప్పయిన స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలను వీక్షి ంచేందుకు లక్షలాదిమంది భక్తులతో పాటు జోగినిలు హాజరవుతారు ఒకవైపు శివుడి వివాహం జరుగుతుండగా జోగినులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని శివుడిని పెళ్లాడినట్లు తన్మయత్వం చెందుతారు ఐదు రోజులపాటు అభిషేకాలు పూజలు రద్దు శివ కళ్యాణం సందర్భంగా ఈనెల 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు ఆలయంలో నిత్య కళ్యాణం సత్యనారాయణ వ్రతం లింగార్చన అభిషేకం రద్దు చేయనున్నారు అలాగే కళ్యాణం రోజు చండీ సహిత రుద్ర హోమం టికెట్స్ భక్తులు సమర్పించే కోడెల టికెట్స్ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అని ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు



9, మార్చి 2024, శనివారం

వేములవాడలో వైభవంగా మహాశివరాత్రి

 రాజన్న సన్నిధికి రెండు లక్షల మంది రాక

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి ఉదయం స్వామివారికి స్థానాచార్యులు అప్పల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో మహాలింగార్చన నిర్వహించారు దాదాపు రెండు లక్షల మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు శివదీక్ష పరులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది సాయంత్రం 6 గంటలకు మహా లింగా అర్చన జరిపారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు రద్దు చేసిన అధికారులు నిరంతరం లఘు దర్శనాలకు కొనసాగించారు అర్ధరాత్రి నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు చేశారు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ అడిషనల్ కలెక్టర్ గౌతమి పరిశీలించారు




8, మార్చి 2024, శుక్రవారం

వేములవాడ మహా జాతర ప్రారంభం

 వేములవాడలో కనుల పండుగగా మహాశివరాత్రి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్ల సమర్పణ వేలాదిగా తరలివస్తున్న భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పించారు టిటిడి తరఫున ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తుల రాకము మొదలైంది ముఖ్యంగా నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రత్యాధికంగా కనిపించింది వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో కూడా ఏర్పాటు చేసుకున్నారు ధర్మకుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజ్యాంగంలో దర్శించుకుని కళ్యాణ కట్టల తలనీలాలు సమర్పించుకున్నారు కోడి ముక్కులు చెల్లించుకున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బాధ్యత సేవలను రద్దుచేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి అడిషనల్ కలెక్టర్ గౌతమి ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు మూడు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగలు ఉన్నాయి



7, మార్చి 2024, గురువారం

మహాశివరాత్రికి వేములవాడలో ఏర్పాట్లు

 


మహాశివరాత్రి జాతరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబయింది గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ మహారాష్ట్ర చత్తీస్గఢ్ నుంచి సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాటు చేశారు జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాణ కోసం రాజన్న గుడి చెరువు మైదానంలో స్టేజిని రెడీ చేశారు వేములవాడ జాతర సందర్భంగా రాజరాజేశ్వర స్వామికి ఆటో టిటిడి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు వందలు ఉన్నాయి గురువారం రాత్రి టీటీడీ తరఫున అర్చకులు ఆఫీసర్లు రాజన్నకు పట్ట వస్త్రాలు సమర్పిస్తారు శుక్రవారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు ప్రత్యేకంగా వెయ్యి ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు ప్రత్యేకంగా హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు 1600 మంది పోలీసులు 640 కెమెరాలతో పహార కాస్తున్నారు కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు పూర్తి చేశారు



6, మార్చి 2024, బుధవారం

రాజన్న ఆలయం ధగ ధగ

 మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ దీపాల కాంతులలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగదగలాడుతోంది శివపార్వతుల కటౌట్లు తోరణాలు ఆకట్టుకుంటున్నాయి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు



2, మార్చి 2024, శనివారం

వేములవాడ లో ఏడు నుంచి మహాశివరాత్రి పూజలు

 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈనెల 7 8 9 తేదీలలో నిర్వహించనున్నారు 7న రాత్రి టీటీడీ పట్ట వస్త్రాలు సమర్పిస్తుంది మహాశివరాత్రి రోజు ఎనిమిదిన తెల్లవారుజామున 12 గంటల నుంచి రెండున్నర గంటల వరకు పట్టణ ప్రజలకు సర్వదర్శనం ఉంటుంది తెల్లవారుజామున రెండున్నర గంటలనుండి మూడున్నర గంటల వరకు ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులకు దర్శన అవకాశం కల్పిస్తారు 3:30 నుంచి 3:40 నిమిషాల వరకు మంగళ వాయిద్యాల ప్రదర్శన 3:40 నుండి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ ఆలయ శుద్ధి 4:30 నుండి 6 గంటల వరకు ప్రాతఃకాల పూజ ఉంటుంది ఎనిమిదిన్నర గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శివదీక్ష స్వాములకు దర్శనం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మండపంలో మహా లింగార్చన రాత్రి 11:35కు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తాం



13, ఫిబ్రవరి 2024, మంగళవారం

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం 40000 మంది భక్తులు దర్శించుకున్నారు సమ్మక్క జాతర సమీపిస్తుండటంతో అక్కడికి వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం మానవాహితీ ప్రస్తుతం సమ్మక్క భక్తులు తాకిడి వేములవాడలో తీవ్రంగా ఉంది భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఆర్చిత సేవలు రద్దు చేశారు రాజన్నను దర్శించుకున్న భక్తులు బద్ది పోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల ద్వారా 45 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు భక్తులకు సంబంధించిన ఏర్పాటు శ్రీనివాస్ ప్రతాప నవీన్ పరిశీలించారు