భగవాన్ శ్రీ రమణ మహర్షి భక్తురాలు మద్దాలి బాలసర సరస్వతి తన 96 ఏళ్ల వయసులో శనివారం సాయంత్రం కన్నుమూశారు తన బాల్యాన్ని గడిపిన ధన్యజీవి ఆమె మద్దాలి సుబ్బారావుతో ఆమె వివాహం జరిపించింది కూడా భగవాన్ రమణ మహర్షి ఏ వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలురు ఉన్నారు సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలోనే ఆమె స్వగృహంలో పలువురు ప్రముఖులు రమణాశ్రమ సభ్యులు భక్తులు బంధుమిత్రులు నివాళులు అర్పించారు ఆదివారం ఉదయం తార్నాక హిందూ స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
18, మే 2026, సోమవారం
16, మే 2026, శనివారం
యాదగిరి క్షేత్రానికి జాతీయ గుర్తింపు
యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం మరో అరుదైన రికార్డ్ సాధించింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 29వ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా న్యూ ఢిల్లీలో జరిగిన సదస్సులో శుక్రవారం ఆలయ ఈవో భవాని శంకర్ పాల్గొన్నారు ఆలయ డిజిటల్ సేవలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు తీవ్ర కాలంలో యాదగిరి క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఆలయాధికారులు భక్తులకు డిజిటల్ సేవలు చేరువ చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు దీంతో నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ అధికారులు ఇటీవల యాదగిరి క్షేత్రాన్ని సందర్శించి పరిశీలించి సేవలతో భక్తులు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు. ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని అంశాలపై అధ్యయనం చేశారు 82 దరఖాస్తులు లో జాతీయస్థాయి ఈ గవర్నెన్స్ 29వ సదస్సులో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా 82 దరఖాస్తులు వివిధ విభాగాల నుంచి అందాయి ఇందులో 32 ప్రాజెక్టులతో షార్ట్ లిస్ట్ తయారు చేశారు ఫిస్టులో తెలంగాణ నుంచి యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉండటం విశేషం. ఈ నెల 14న యాదగిరి దేవస్థానం ఈవో బృందం ఢిల్లీకి వెళ్లి జూరీ సమక్షంలో ఫైనల్ ప్రెసెంటేషన్ సమర్పించింది ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జాతీయస్థాయిలో యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరింత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
