2, సెప్టెంబర్ 2026, బుధవారం

తమిళనాడు ఆలయాల్లో.. నో మొబైల్స్

 తమిళనాడు లోని ప్రముఖ ఆలయాల్లో సెల్ ఫోన్లు తీసుకు రావడం పై హిందూ మత, దేవాదాయ శాఖ నిషేధం విధించింది . ఆలయాలలో యువత నిబంధనలను ఉల్లంఘిస్తూ రీల్స్, ఫోటోలు తీయడం గమనించిన అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల మొబైల్ ఫోన్లను భద్ర పరచడానికి ఆలయ ఎంట్రెన్స్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

ఒక్కో ఫోన్ కు రూ 5 చొప్పున వసూలు చేస్తున్నారు.  కాంచీ పురంలోని దేవరాజ స్వామి ఆలయంలో ఈ విధానం ఉదయం నుండే ప్రారంభం అయింది. ఫోన్ మోడల్, నంబర్ రిజిస్టర్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తున్నారు. ఇది ఆలయాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని అధికారులు పేర్కొన్నారు. మొబైల్ బ్యాన్ బోర్డులను ఎంట్రెన్స్ వద్దే ఏర్పాటు చేయాలని , పబ్లిక్ అనౌన్స్ మెంట్ ద్వారా భక్తులకు తెలియ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

తిరుపతిలో శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలు..

 తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి ఈ ఉత్సవాల్లో భాగంగా 19 న అత్యంత విశేషమైన గరుడ సేవ ను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్ది నెలల క్రితం తిరుమల లో అందుబాటులోకి వచ్చిన వసతి సముదాయం 5 ను పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకుంటున్నారు. తిరుమల లో 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా 7600 గదులు , 5 పీ ఏ సీ లు ఉన్నాయి. అయినా భక్తులు గదుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తిరుపతి లో కొత్త వసతి సముదాయాలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుపతి లో భక్తుల కోసం నిర్మించిన శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలు ముఖ్య మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీటీడీ తుది ఏర్పాట్లను వేగవంతం చేసింది. 

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న ఈ సముదాయాల పనులు చివరి దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా , లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ రెండు సముదాయాల్లో భాగంగా ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మించారు.దాదాపుగా 10 వేల మంది భక్తులకు వసతి సౌకర్యం కల్పించే వెసులుబాటు కలగ నున్నదని ఆలయ వర్గాల అంచనా.

రెండో అంతస్తులో రిసెప్షన్ , అన్న దానం , వసతి కేంద్రాలుంటాయి. మూడు,నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు..సుమారు 7 వేల మంది భక్తులకు సరిపడా  లాకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2024 మార్చి నెలలో ప్రారంభమైన వీటి నిర్మాణానికి రూ 600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 

ఈ గదులను ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా పొందేలా భక్తులకు వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా తుది కసరత్తు కొనసాగుతోంది.

అలంపూర్ ఆలయంలో.. సౌండ్ అండ్ లైట్స్ షో

 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆలంపూర్ క్షేత్ర ఆధ్యాత్మిక, చారిత్రక , సాంస్కృతిక వైభవాన్ని వెలుగు జిలుగుల, ధ్వనుల సమ్మేళనంతో ఆవిష్కరించే మల్టీ మీడియా , సౌండ్, లైట్ షో ను 4.60 కోట్ల రూపాయల నిధులతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ షోను ఆలంపూర్ ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. అనంతరం  మల్టీ మీడియా, సౌండ్, లైట్ షో ను ప్రతినిధులు, ప్రజలతో కలిపి తిలకించారు. 

ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు ఆలంపూర్ ఆలయ విశిష్టతపై ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, అధికారులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 




శక్కర్ బేస్ ఆంజనేయ ఆలయం,మద్నూర్

 కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల పురాతన శక్కర్ బేస్ ఆంజనేయ స్వామి ఆలయం లో శిఖర, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయ ఆవరణలో ధర్మ ధ్వజాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆలయం పైన శిఖర ప్రతిష్ఠాపన , ఆలయంలో నంది, శివ లింగం , ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బిచ్ కుంద మండలం ఖత్ గావ్ మల్లిఖార్జున స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 




సేవాలాల్ ఆలయ నిర్మాణానికి విరాళం

 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంపు తండాలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి ఆస్పత్రి వైద్యులు డా శ్రీనివాస్ నాయక్ 5500 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాత ను ఘనంగా సన్మానించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు. 



జగదాంబ దేవికి బంగారు బొట్టు బిళ్ళ

 కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడ మండలంలోని బుడ్మి జగదాంబ దేవి ఆలయంలో ఉన్న విగ్రహానికి మంగళ వారం బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యాపార వేత్త , జాగృతి హాస్పిటల్ నిర్వాహకులు  రుద్రంగి ఉదయశ్రీ - గంగాధర్ దంపతులు బంగారు బొట్టు బిళ్ళ ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని వేసుకున్నట్లు తెలిపారు. గంగాధర్  దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  గ్రామస్తులు డా .తిరుమల గౌడ్, జిన్న రఘు , శ్రీనివాస్ గుప్త,ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. 



జాతీయ స్మారక కట్టడంగా.. గొల్లల గుడి..

 తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేటలోని పురాతన కట్టడం ' గొల్లల గుడి ' కి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ కట్టడాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత పురావస్తు సర్వేక్షణ (ఏ ఎస్ ఐ) అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాచీన స్మారక కట్టడాలు , పురావస్తు ప్రదేశాలు , అవశేషాల చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గొల్లల గుడి ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించే ఉద్దేశం తో అంతకు ముందు ఈ ఏడాది మార్చి 6 న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టం నిర్దేశించిన 2 నెలల గడువులోగా ప్రజల నుండి ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదు. దీంతో ఆగస్టు 31 న ఏ ఎస్ ఐ డైరెక్టర్ జనరల్ యదు బీర్ సింగ్ రావత్ దీనిపై తుది గెజిట్ విడుదల చేశారు. గెజిట్ నోటిఫికేషన్ లో పొందు పరచిన షెడ్యూల్ ప్రకారం గొల్లల గుడి పరిధిలోని పావు ఎకరం విస్తీర్ణాన్ని రక్షిత ప్రాంతంగా భారత పురావస్తు సర్వేక్షణ తమ యాజమాన్యం లోకి తీసుకుంది. ఈ మేరకు రక్షిత స్మారక చిహ్నం పరిమితులను ఖరారు చేస్తూ మ్యాప్ ను గెజిట్ లో పొందు పరచారు. 



1, సెప్టెంబర్ 2026, మంగళవారం

నోవోన్గ్ పూజ అంటే

 ఈ పూజ ఆదివాసీ ప్రజలు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం లోని చింతల సాంగ్విలో సిడాం పరివార్ ఆది వాసీలు సోమవారం నోవొంగ్ పూజ ను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలకరి పంటల ద్వారా వచ్చిన కొత్త ధాన్యం , కాయ గూరలు పండ్లను కుల దైవాలు పెర్సా పేన్, సతిక్ దేవతలకు అర్పించారు. సామల బియ్యానికి నెయ్యి కలిపి తయారు చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని , మినుములతో చేసిన గారెలను నైవేద్యంగా నివేదించారు.