2, సెప్టెంబర్ 2026, బుధవారం

తమిళనాడు ఆలయాల్లో.. నో మొబైల్స్

 తమిళనాడు లోని ప్రముఖ ఆలయాల్లో సెల్ ఫోన్లు తీసుకు రావడం పై హిందూ మత, దేవాదాయ శాఖ నిషేధం విధించింది . ఆలయాలలో యువత నిబంధనలను ఉల్లంఘిస్తూ రీల్స్, ఫోటోలు తీయడం గమనించిన అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల మొబైల్ ఫోన్లను భద్ర పరచడానికి ఆలయ ఎంట్రెన్స్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

ఒక్కో ఫోన్ కు రూ 5 చొప్పున వసూలు చేస్తున్నారు.  కాంచీ పురంలోని దేవరాజ స్వామి ఆలయంలో ఈ విధానం ఉదయం నుండే ప్రారంభం అయింది. ఫోన్ మోడల్, నంబర్ రిజిస్టర్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తున్నారు. ఇది ఆలయాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని అధికారులు పేర్కొన్నారు. మొబైల్ బ్యాన్ బోర్డులను ఎంట్రెన్స్ వద్దే ఏర్పాటు చేయాలని , పబ్లిక్ అనౌన్స్ మెంట్ ద్వారా భక్తులకు తెలియ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి