ఈ పూజ ఆదివాసీ ప్రజలు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం లోని చింతల సాంగ్విలో సిడాం పరివార్ ఆది వాసీలు సోమవారం నోవొంగ్ పూజ ను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలకరి పంటల ద్వారా వచ్చిన కొత్త ధాన్యం , కాయ గూరలు పండ్లను కుల దైవాలు పెర్సా పేన్, సతిక్ దేవతలకు అర్పించారు. సామల బియ్యానికి నెయ్యి కలిపి తయారు చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని , మినుములతో చేసిన గారెలను నైవేద్యంగా నివేదించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి