కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల పురాతన శక్కర్ బేస్ ఆంజనేయ స్వామి ఆలయం లో శిఖర, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయ ఆవరణలో ధర్మ ధ్వజాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆలయం పైన శిఖర ప్రతిష్ఠాపన , ఆలయంలో నంది, శివ లింగం , ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బిచ్ కుంద మండలం ఖత్ గావ్ మల్లిఖార్జున స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి