2, సెప్టెంబర్ 2026, బుధవారం

జగదాంబ దేవికి బంగారు బొట్టు బిళ్ళ

 కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడ మండలంలోని బుడ్మి జగదాంబ దేవి ఆలయంలో ఉన్న విగ్రహానికి మంగళ వారం బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యాపార వేత్త , జాగృతి హాస్పిటల్ నిర్వాహకులు  రుద్రంగి ఉదయశ్రీ - గంగాధర్ దంపతులు బంగారు బొట్టు బిళ్ళ ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని వేసుకున్నట్లు తెలిపారు. గంగాధర్  దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  గ్రామస్తులు డా .తిరుమల గౌడ్, జిన్న రఘు , శ్రీనివాస్ గుప్త,ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి