దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆలంపూర్ క్షేత్ర ఆధ్యాత్మిక, చారిత్రక , సాంస్కృతిక వైభవాన్ని వెలుగు జిలుగుల, ధ్వనుల సమ్మేళనంతో ఆవిష్కరించే మల్టీ మీడియా , సౌండ్, లైట్ షో ను 4.60 కోట్ల రూపాయల నిధులతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ షోను ఆలంపూర్ ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. అనంతరం మల్టీ మీడియా, సౌండ్, లైట్ షో ను ప్రతినిధులు, ప్రజలతో కలిపి తిలకించారు.
ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు ఆలంపూర్ ఆలయ విశిష్టతపై ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, అధికారులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


