సహజ మరణాలకు రెండు లక్షల రూపాయలు ప్రమాదం అయితే పది లక్షలు టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు ప్రకటన
తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి బీమా సదుపాయం కల్పించనున్నట్లు టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు ప్రకటించారు. అలిపిరి దాటినప్పటి నుంచి భక్తులందరికీ ఈ గ్రూప్ పాలసీ వర్తిస్తుందని తెలిపారు .తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో రవిచంద్ర, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు. కొండపై సహజ మరణం పొందిన భక్తుడు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు .ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆలయాల పరిధిలో టిటిడి ప్రవేశపెడుతోంది అని పేర్కొన్నారు. ప్రమాదాలలో మరణించిన భక్తులకు మూడు లక్షలు గా ఉన్న భీమాను 10 లక్షల రూపాయలకు పెంచామని దీనికి 17 లక్షల రూపాయల ప్రీమియం ఖర్చును టీటీడీ భరిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ఎల్ఐసి తో ఒప్పందం చేసుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి