1, మే 2026, శుక్రవారం

నైవేద్యాలలో ఉల్లి,వెల్లుల్లి ఎందుకు వాడరు..

 నీరుల్లిపాయ, వెల్లుల్లిపాయలు వినియోగం దైవ నివేదనలు ప్రసాదాలలో కనిపించదు. అలాగే పూర్వకాలం నుంచే కొన్ని వర్గాల వారికి వాటిని తమ ఆహారంలో వాటిని వినియోగించకపోవడం ఆచారంగా వస్తోంది .ఆధ్యాత్మిక సాధనకు, ప్రశాంత జీవనానికి సాత్విక ఆహారం ప్రధానమని సాధకులు చెబుతారు .నీరుల్లిని, వెల్లుల్లిని తామస రజోగునాలను పెంచే పదార్థాలుగా పూర్వులు పేర్కొన్నారు. అది కోపాన్ని ,ఆందోళనను, వాంఛలను పెంచుతాయి. కాబట్టి యోగ సాధనకు ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు.

లశునం గృంజనం చైవ పలా0డుం కవకాని చ అభక్ష్యాని ద్విజాతీనాం అమేధ్య ప్రభవాణి చ.. అని మనుస్మృతి చెబుతోంది. లశునం /ఎల్లుల్లి, గుంజనం /ముల్లంగి, పలాండం/ ఉల్లిపాయ, కవకాని /పుట్టగొడుగులు ఇవి అశుద్ధమైన చోట పుడతాయి కాబట్టి ఉపాసకులు శ్రీ విద్యాసాధకులు వాటిని తినకూడదు అని భావము.

ఆధ్యాత్మికపరంగా.. ఆత్మశుద్ధి, సాత్విక జీవనశైలి కోసం ఉల్లిని ,వెల్లుల్లిని నిషిద్ధంగా పరిగణిస్తారు. అవి మనస్సును చంచలం చేస్తాయని చెబుతారు.

 ఆయుర్వేదము యోగ శాస్త్రం ప్రకారం.. ఉల్లిపాయలు తామస రజోగుణ ప్రేరేపకమైన పదార్థాలు. అవి శరీరంలో పైత్య రసాన్ని పెంచుతాయి. ఆవేశాన్ని, వాంఛలను రేకెత్తిస్తాయి. 

పౌరాణికంగా చూస్తే.. రాహు ,కేతువుల రక్త బిందువుల నుంచి ఉల్లి ,వెల్లుల్లి పుట్టాయంటారు .అందుకే వాటిని అశుద్ధమైనదిగా, రాక్షస ప్రవృత్తి కలిగించేదిగా భావిస్తారు.

దైవానికి నివేదన చేసే విషయానికి వస్తే.. పూజలలో దేవునికి సమర్పించే నైవేద్యములో ఉల్లి, వెల్లుల్లిని అపవిత్రంగా భావించి వినియోగించరు. కాలక్రమైనా మారుతున్న అలవాట్ల వల్ల పూర్వం వీటిని ఉపయోగించని వర్గాలు కూడా స్వీకరిస్తున్నప్పటికీ ,సంప్రదాయ ఆచారాలు పాటించేవారు ఇప్పటికీ దూరంగానే ఉంటారు. అయితే పూజల్లో వినియోగం, సాధకుల నియమాలను పక్కన పెడితే ..నిత్య ఆహార పదార్థాలలో వీటిని వాడే విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు.

ఘనంగా అష్టోత్తర శతఘటభిషేకం

 మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజున ఆలయంలో మూలమూర్తికి అష్టోత్తర శతఘటభిషేకం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచారణల మధ్య పూజారులు ప్రత్యేక పూజలు చేసి మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు. 



స్వామి వారి జన్మదిన పురస్కరించుకొని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఫల పంచామృతాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బాలయ్య ప్రాంగణంలో 108 అష్టోత్తర శతఘటలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుండి ఆలయానికి చేరుకుని క్యూ పద్ధతిలో దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు కార్యక్రమంలో చైర్మన్ కమలాకర్ రెడ్డి పిఓ ప్రభురామచంద్రన్ సిబ్బంది అర్చకులు భక్తులు పాల్గొన్నారు.