1, మే 2026, శుక్రవారం

పుష్కరిణి నీటితో శ్రీవారి చిత్రం

 పుష్కరిణి నీటితో శ్రీవారి చిత్రం.. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక యువకుడు గురువారం నాడు తన కళా ప్రతిభతో భక్తిని వ్యక్తం చేశాడు. తమిళనాడులోని తిరువూరుకు చెందిన మోహన్ ప్రభువు అనే భక్తుడు గత పది సంవత్సరాలుగా పెయింటింగ్ చేస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు. 

శ్రీవారి పుష్కరిణి నీటిని ఉపయోగించి సుమారు మూడు గంటల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ వాటర్ పెయింటింగ్ రూపొందించాడు. అతని భక్తిని కళా నైపుణ్యాన్ని చూసిన పలువురు భక్తులు ప్రశంసించారు. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి