వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో ముంబైలోని కమాటిపుర ప్రాంతంలో గల పీపీ మార్గచా రాజా గణేష్ మండల్ కు 63 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మండల్ కు గత 17 ఏళ్లుగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అబ్బాస్ ఖాన్ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం విశేషం. హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ భారతీయులలా ఒక్కటై ఈ పండుగను వేడుకగా జరుపుకోవడం చాలా కాలంగా కొనసాగుతున్నట్లు వాలంటీర్ వికాస్ బేలదార్ తెలిపారు. గణపతి అప్పపై నాకున్న అపారమైన విశ్వాసంతోనే ఏటా ఈ వేడుకను నిర్వహించగలుగుతున్నాము. ఇవి రెండు మతాల సామరస్య సందేశం మాత్రమే కాదు, నిజానికి మేమంతా ప్రేమ సందేశం చాటుతున్నాము. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆహ్వానిస్తాం అని అబ్బాస్ ఖాన్ తెలిపారు. ఈ ఉత్సవాలు జరిగే పది రోజులు తాము శాకాహారం భుజిస్తూ, సీర /రవ్వ కేసరి, చనా/ శనగలు ప్రసాదాన్ని ఇంటివద్ద సిద్ధం చేసి మండపానికి తీసుకొస్తామని అబ్బాస్ భార్య హసీనా ఖాన్ చెప్పారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి