ఆదిలాబాద్ జిల్లాలో 800 ఏళ్ల నాటి పురాతన బాల గణేశుడి విగ్రహం లభ్యమైంది. జిల్లా కేంద్రానికి సమీపంలో గల చందా, శివారం గ్రామాల మధ్య సా. శ. 2 వ శతాబ్దికి చెందిన బాల గణేష్ విగ్రహాన్ని , స్థానిక చరిత్ర ఉపాధ్యాయులు పృథ్వీరాజ్ రోడ్డావార్ గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హర గోపాల్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివ నాగిరెడ్డి గారు తెలిపారు. చందా గ్రామ శివారులోని రైలు కట్ట సమీపంలోని ఒక చెట్టు కింద గల ఒక శిల్పంలో ఒక పీఠంపై సుఖాసనంలో కూర్చున్న పార్వతి , కుడి చేతిలో ఒక ఫలాన్ని , ఎడమ చేతితో తన ఎడమ తొడపై, కూర్చొని చనుబాలు తాగుతున్న బాల గణేశుని పట్టుకొని ఉందని ,ఆయనకు తలపై కిరీటం లేకపోవడం.. ఈ శిల్పం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు వెలుగు చూసిన తొలి, అరుదైన చారిత్రక ప్రాధాన్యత గల శిల్పమని వారన్నారు. బాల గణేశునికి రెండు చేతులే ఉండి, తలపై కిరీటం లేకపోవడం గమనించాల్సిన విషయం అన్నారు. ఆదిలాబాద్ కు 14 కి. మీ దూరంలో సా. శ. 1104 లో మాల్వా దేశ రాజ కుమారుడైన పారమార జగదేవుడు జైనథ్ లో నిర్మించిన లక్ష్మీ నరసింహ ఆలయ శిల్పాలను పోలిన ఈ బాల గణేష్ శిల్పం సా. శ. 12 వ శతాబ్దికి చెందినదని , చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ శిల్పాన్ని గ్రామ పంచాయతీ కి తరలించి భద్రపరచాలని హరగోపాల్, శివ నాగిరెడ్డి గార్లు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి