ముంబైలోని కింగ్స్ సర్కిల్ లో జీ ఎస్ బీ ( గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్) గణపతి విగ్రహం దేశంలోనే ఖరీదైనదిగా నిలిచింది. ఈ విగ్రహానికి 66 కిలోల బంగారం , 335 కిలోల వెండి , రత్నాలతో తయారు చేసిన ఆభరణాలను అలంకరించారు. రూ. 703.27 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు దీంతో దేశ వ్యాప్తంగా ఈ విగ్రహం గురించి చర్చ మొదలైంది. శని వారం నుంచే భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వస్తున్నారు. జీ ఎస్ బీ వినాయక చవితి వేడుకలు దేశంలోనే అత్యంత వైభవంగా నిలుస్తున్నాయి . కేవలం ఆభరణాలే కాకుండా .. నిత్యం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. నవరాత్రులు ఇక్కడ వేద సాంప్రదాయాలు , ఆచారాలు , భజనలు , కీర్తనలతో పాటు భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
పుచ్చకాయపై గణేశుడు..
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు వినాయక చవితి సందర్భంగా ఆదివారం పుచ్చకాయపై 4 అంగుళాల వెడల్పు ,4 అంగుళాల పొడవు గల వినాయకుడి రూపం చెక్కారు.గతంలో చింత గింజలపై వినాయకుడు ,బియ్యపు గింజపై వినాయకుడి చిత్రం వేశారు.ఇలా ఎన్నో సూక్ష్మ కళా రూపాలు తయారు చేసి జాతీయ అంతర్జాతీయ రికార్డులను కైవసం చేసుకోవడం జరిగింది.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి