13, సెప్టెంబర్ 2026, ఆదివారం

జెండా బాలాజీ జాతర.. నిజామాబాద్..

 కలియుగ దైవమైన గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా భక్తవత్సలా గోవిందా వడ్డీకాసులవాడా గోవిందా అంటూ భక్తులు శ్రీమన్నారాయణ స్వామిని వేడుకుంటూ దర్శించుకున్న అంతనే అండగా నిలిచే స్వామి జండా బాలాజీ వెంకటేశ్వర స్వామి. జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు సెప్టెంబర్ 12వ తేదీన శనివారం ప్రారంభమై 26వ తేదీ శనివారంతో ముగియనున్నాయి.



 మహారాష్ట్రయులు ఎంతో భక్తిగా పిలుచుకొని బాలాజీ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు . ప్రతి ఏటా భాద్రపద మాసంలో ప్రారంభమైన ఉత్సవాలు పౌర్ణమి వరకు సాగుతాయి. మొదటి రోజున వంశపారంపర్య అర్చకులు అజయ్ సాంగువాయి ఇంటి వద్ద పూజలు నిర్వహిస్తారు. నగరంలో వివిధ వీధుల్లో తిరిగి జెండా అర్ధరాత్రి స్థానిక జెండా గల్లీలో గల జెండా బాలాజీ ఆలయానికి చేరుకుంది. ఆలయంలో ప్రతిష్టించిన జెండాకు పది రోజుల పాటు భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లలేని భక్తులు జెండాను దర్శించుకున్నంతలోనే శ్రీనివాసుని సంపూర్ణ కటాక్షాలతో మన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకము. భక్తులకు అభయహస్తాన్ని అందించిన జెండా బాలాజీ శ్రీనివాసుని దర్శించుకోవడానికి జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల భక్తులకు ఇలవేల్పుగా నిలిచారు. అధిక సంఖ్యలో ఊరేగింపులో భక్తులు పాల్గొననున్నారు .ఆలయ అర్చకులు వేద పండితులచే స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు జెండా బాలాజీ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో కందర్ గ్రామంలో సాంగు వాయి వంశస్థులు జెండా బాలాజీని కొలిచేవారు .ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వెంకటేశ్వర్లు దర్శించుకునే వాడు ఒకసారి స్వామీజీ కలలో కనిపించే నా భక్తులకు ఉత్సవ విగ్రహాలు ఇచ్చి తిరుమల కొండ దాటించమని ఆదేశించాడట .హౌసా విగ్రహాలను తీసుకొని ఇంటి దారి పట్టి వారం రోజులు అనంతరం నిజామాబాదులో రాత్రి విశ్రాంతికై నిలిచాడు .రాత్రి స్వామివారు స్వప్నంలో కనిపించి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించమని చెప్పారని తెలుస్తోంది .అలా సాంగ్వాయి వంశం వారు జెండా బాలాజీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జెండా బాలాజీ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శివరాత్రి ఆంజనేయులు కోరారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జండా ఊరేగింపు ఉంటుందన్నారు. స్వామివారి జెండా ముందుండగా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా పులాంగ్ బ్రిడ్జి వరకు తరలి వెళ్లి విశ్రాంతి విడిది చేయడంతో ఉత్సవ కార్యక్రమాలు ముగిస్తారు అని తెలిపారు. భక్తులు జండా ఊరేగింపులో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి అజయ్ సాంగువాయి కుటుంబ సభ్యులు జాలీగాసి గోపాల్ ,లవంగ ప్రమోద్ ,ఆలయ అర్చకులు నాగరాజు ,జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్ ,మోర సాయిలు, నర్సింగరావు ,ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి