15, సెప్టెంబర్ 2026, మంగళవారం

బోధి సత్వుడే.. బుద్ధుడై..

 బౌద్ధంలో ఒక క్రమ సాధన ఉంది. దాని ప్రకారం ఏళ్ల తరబడి ధ్యానం చేసిన వ్యక్తి బోధి సత్వుడవుతాడు. బోధి సత్వుడు పది దశలు దాటిన తర్వాత బుద్ధుడవుతాడు. మొదటి దశ ముదిత లో లోకంలో అందరికీ మంచి జరగాలనే సమ భావన కలుగుతుంది. రెండోది విమలత్వం . మూడో దశ లో మేధ తేజోవంతం అవుతుంది. నాలుగో దశలో ఆలోచనలు జ్ఞానోదయం వైపు వేగంగా సాగుతాయి. అజేయుడిగా మార్చేది ఐదో దశ. ఆరో దశలో విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకుంటాడు. ఏడో దశలో సంపూర్ణ జ్ఞాన వంతుడవుతాడు. ఎనిమిదో దశలో స్థిర చిత్తుడై అచలత్వాన్ని పొందుతాడు. స్థితప్రజ్ఞత కలుగుతుంది. అంటే లౌకిక విషయాలేవీ సాధకుని ప్రభావితం చేయలేవు. తొమ్మిదో దశలో సాధుమూర్తిగా అవతరిస్తాడు. ఎటు చూసినా కరుణ సాక్షాత్కరిస్తుంది. చివరి దశలో ధర్మ స్వరూపుడై బుద్ధుడిగా వెలుగొందుతాడు. 

సృష్టి మొదలై అంతమవడాన్ని ఒక కల్పం అంటారు. అటువంటి కల్పాలు ఇప్పటి కి పది పూర్తయ్యాయి.. ప్రతి కల్పంలో కొంతమంది బుద్ధులు అవతరించారు.  మనం ఇప్పుడు 11వది అయిన భద్ర కల్పంలో ఉన్నాము. ఈ కల్పంలో వైశాఖ పౌర్ణమి రోజున పుట్టిన 28 వ బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు. ఇతడు 35 ఏళ్ల తర్వాత వైశాఖ పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొందాడు. ఈ గౌతమ బుద్ధుడు లోకంలో దుఃఖము ఉందని ,ఆ దుఃఖానికి కారణము, దాన్నుంచి విముక్తికి మార్గము ఉన్నాయని తెలుసుకున్నాడు. అదే అష్టాంగ మార్గమని చెబుతూ నాలుగు పరమ సత్యాలను ప్రబోధించాడు. దుఃఖానికి కారణం కనుక్కుని దాన్ని ప్రజలకు తెలియజేయడం వల్ల ఈ గౌతమ బుద్ధుడు ఇతరుల కంటే విఖ్యాతుడు అయ్యాడు. కాకతాళీయంగా గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజునే మహాపరి నిర్మాణం పొందాడు. అందుకే వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి గా ప్రసిద్ధి పొందింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి