భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో శ్రీనివాస కాలనీలోని శ్రీనివాస గిరి. పచ్చని కొండపై 600 అడుగుల ఎత్తులో వెంకటేశ్వర స్వామి శ్రీదేవి , భూదేవి సమేతంగా స్వయంభువుగా వెలిశారు. గుహలో కొలువైన స్వామిని 2 వేల మెట్లు ఎక్కి దర్శించుకోవాలి ఇది కాకతీయుల కాలం నాటి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గుహలో తొలుత మట్టి నిండుకొని నీటి చుక్కలు పడుతూ ఉండేవి. ఓ సారి అడవికి వెళ్లిన వారు దాహార్తి తీర్చుకునేందుకు గుహ వైపు వెళ్లగా అక్కడ నీటి చుక్కలకు రాతి పై ఉన్న మట్టి కరిగి స్వామి వారి రూపం పాక్షికంగా కనిపించింది. కొంత మంది కలిసి గుహలో మట్టినంతా శుభ్రం చేశారు. అప్పటి నుంచి స్వామి వారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు.
ప్రతి శని వారం విశేష పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న వెంకటేశ్వరుడిగా భాసిల్లుతున్న స్వామి వారి కళ్యాణ వేడుకకు ఏటా తెలంగాణ,ఏపీ ల నుండి భక్తులు భారీగా తరలి వస్తారు.కళ్యాణానికి పాల్వంచ తహసీల్దార్ ముత్యాల తలంబ్రాలు తీసుకు రావటం అనవాయితీ. మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి, అనంత పద్మనాభ స్వామి,దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు కనిపిస్తాయి.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి