17, సెప్టెంబర్ 2026, గురువారం

ఆధ్యాత్మిక విశేషాలు 17-9-26

 మల్లన్న హుండీ ఆదాయం 74 లక్షల రూపాయలు 

ప్రముఖ పుణ్య క్షేత్రం కొముర వెల్లి మల్లిఖార్జున స్వామి హుండీ లెక్కింపు బుధవారం జరిగింది.లెక్కింపును ఆలయ ముఖ మండపం వద్ద చేపట్టారు.లెక్కింపులో శ్రీ శివ రామ కృష్ణ భజన మండలి సేవా సభ్యులు పాల్గొన్నారు.63 రోజులకు గాను 74 లక్షల 52 వేల 87 రూపాయలు నగదు రాగా, మిశ్రమ బంగారం 32 గ్రాములు , మిశ్రమ వెండి 3 కిలోల 200 గ్రాములు విదేశీ కరెన్సీ 31 నోట్లు హుండీల ద్వారా లభించినట్లు ఆలయ ఈఓ కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు.దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయ లక్ష్మి పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున ,స్థానాచార్యులు పీ మల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

సిద్ధ రామేశ్వర ఆలయ హుండీ లెక్కింపు..



భిక్కనూరు మండల కేంద్రంలో సిద్ధ రామేశ్వర ఆలయ హుండీ లెక్కించారు ఈఓ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ప్రక్రియ చేపట్టారు.3,57,298 రూ.లు వచ్చినట్లు తెలిపారు.కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి,ఉపాధ్యక్షులు దయాకర్ రెడ్డి,పూజారులు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు . 

మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుంకరి అశోక్ కళ్యాణి దంపతులు పూజలు నిర్వహించి 10,102 రూ.విరాళం అందజేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి