18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

మొబైల్ గణేశ @ మెట్ పల్లి

 భక్తా.. అతిగా మొబైల్ వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయి . ఈ రోజు సెల్ ఫోన్ ను అత్యధికంగా వినియోగించావు. ఇకపై తక్కువ సమయం వాడతానని మాట ఇస్తేనే నీకు నా దర్శన భాగ్యం కలుగుతుంది అని మొబైల్ గణేశ పలుకుతున్న స్వరం అందరినీ ఆలోచింప చేస్తోంది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణం లోని చైతన్య నగర్ లో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మంటపాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు గణ నాథుడిని దర్శించుకోవాలంటే ముందు సెల్ ఫోన్ ను అక్కడి సీసీ కెమెరా ముందు స్కాన్ చేయించాలి. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన స్పీకర్ నుంచి వచ్చే ఆజ్ఞలు పాటించాలి. 


భీమేశ్వర స్వామికి..3.72 కోట్ల ఆదాయం..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన భీమేశ్వర స్వామి ఆలయానికి  శ్రావణమాసంలో భారీ ఆదాయం వచ్చింది. 28 రోజులకు సంబంధించి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు రెండు రోజులపాటు లెక్కించారు. మూడు కోట్ల 72 లక్షల 72 వేల 809 వచ్చినట్లు తెలిపారు. అలాగే 201.400 గ్రాముల మిశ్రమ బంగారం,16.600 కిలోల మిశ్రమ వెండి వచ్చినట్లు తెలిపారు.

కాటేజీ నిర్మాణానికి భారీ విరాళం..
మాచారెడ్డి మండలంలో ని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద భక్తుల విరాళాలతో నిర్మిస్తున్న కాటేజీకి హైదరాబాదుకు చెందిన కీర్తిశేషులు అబ్బగౌని లక్ష్మీనారాయణ గౌడ్, జ్ఞాపకార్థము ఆయన సతీమణి శ్యామల ఆలయ సిబ్బందికి రెండు లక్షల 50 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సత్కరించారు .కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి ,ఈవో, ముఖ్య అర్చకులు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి