3, మే 2026, ఆదివారం

శ్రీవారి దర్శనానికి 14 గంటలు

 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కావడంతో పాటు వారాంతం కావడంతో తిరుమల వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది .శ్రీవారి ఆలయ ప్రాంతంలో పాటు మాడవీధులు, లడ్డు కేంద్రం ,అఖిల అండం, ప్రధాన కూడళ్లు ,రిసెప్షన్ కౌంటర్లు, కళ్యాణ కట్టలు రద్దీగా కనిపిస్తున్నాయి. కాలినడక మార్గాలలో రద్దీ తగ్గలేదు .వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు లోని 31 కంపార్ట్మెంట్లు ,నారాయణ గిరిలోని తొమ్మిది షెడ్లు నిండిపోయి క్యూ లైన్ శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయం మధ్య వరకు వ్యాపించింది. వీరికి దర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతుంది.

తిరుపతిలో రెడ్డి భవనం నిర్మాణానికి కోటి రూపాయలు

 


తిరుపతిలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవన నిర్మాణం కోసం పి పి రెడ్డి గ్రూపు చైర్మన్, యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పన్నాల పర్వతాలు రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. రెడ్డి సంఘం ప్రతినిధులు మురళీకృష్ణారెడ్డి, మల్రెడ్డి రామిరెడ్డి ,వినయ్ కుమార్ రెడ్డి, గూడూరు నరోత్తం రెడ్డి, కొలను మహేందర్ రెడ్డి తదితరులు సమక్షంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వారు పర్వతాల రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అఖిల భారత రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో అధునాతన సౌకర్యాలతో ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవనం నిర్మించనున్న విషయం తెలిసింది.