3, మే 2026, ఆదివారం

ఆధ్యాత్మిక సమాచారం 3-5-2026

లింగంపేట మండలం ,నల్లమడుగు గ్రామంలో శనివారం పోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. రథాల పున్నమి సందర్భంగా ప్రతి ఏటా కుస్తీ పోటీలు పోచమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి వెండి కడియం వరకు కుస్తీ పోటీలు ఆద్యంతముత్కఠంగా సాగాయి. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు, చివరికి కుస్తీ వెండి కడెం బహుకరించినట్లు తెలిపారు సర్పంచ్ తహసీన్ బేగం తదితరులు పాల్గొన్నారు.

ముషీరాబాద్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం. 

ముషీరాబాద్ లో ప్రసిద్ధిగాంచిన మహంకాళి దేవాలయ ప్రధాన అర్చకులు వై చంద్రమౌళి ఆధ్వర్యంలో శనివారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్ ఏ పావని వినయ్ కుమార్ గౌరీ శంకర్ ఆలయ కమిటీ చైర్మన్ పి శ్రీధర్ చారి తదితరులు హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పూజ నిర్వహించి కానుకలు సమర్పించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో స్థానికంగా ఆధ్యాత్మికత వెళ్లి విరిసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి