3, మే 2026, ఆదివారం

పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి రెండు లక్షల విరాళం

 రామారెడ్డి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి రెండు లక్షల రూపాయలను ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడటంతో ఎమ్మెల్యేను కలిసి వివరించగానే తక్షణమే స్పందించి రెండు లక్షల రూపాయలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. మున్ముందు ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏఎంసి డైరెక్టర్ రావు ఫ్, బాలయ్య ,డైరెక్టర్ రాజు ,నాయకులు గురజాకుంట స్వామి ,అమ్ముల పశుపతి, రామాలయం చైర్మన్ పశుపతి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోపి, రామ్మూర్తి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి